Just In
- 54 min ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 1 hr ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
- 3 hrs ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 16 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
Don't Miss
- Finance Upper Circuit: లాభాల కిక్ ఇస్తున్న లిక్కర్ స్టాక్.. 8 రోజులుగా అప్పర్ సర్క్యూట్లోనే.. కొన్నారా..??
- News నామినేషన్ వేయనున్న వైఎస్ జగన్
- Sports హార్దిక్కు అంబానీ వార్నింగ్.. సంచలన నిర్ణయానికి సిద్ధం!
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫాస్ట్ ట్యాగ్ లు అమలు చేసినప్పటికీ బెంగుళూరులో తగ్గని ట్రాఫిక్
దేశవ్యాప్తంగా నేడు ట్రాఫిక్ అనేది అందరికి పెద్ద సమస్యగా మారింది. దేశం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ రకమైన ట్రాఫిక్ సమస్య రానురాను ఒక మహమ్మారిగా మారుతోంది. బాగా అభివృద్ధి చెందిన నగరాలైన ఢిల్లీ, ముంబై,హైదరాబాద్, బెంగుళూరు మొదలైన నగరాలలో ట్రాఫిక్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే. సాధారణంగా బెంగుళూరు వంటి ప్రాంతాలలో రోడ్లు ఎంత డెవలప్ చేసిన పెరుగుతున్న జనాభాతో వాహనదారులు ప్రతిరోజు సతమతమౌతున్నారు.
ప్రస్తుతం బెంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయంకి వెళ్లే జాతీయ రహదారిలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వళ్ళ ప్రయాణికులందరూ ఇబ్బందిపడుతున్నారు. సోషల్ మీడియా ప్రకారం వారి ఫిర్యాదుల ప్రకారం కర్ణాటక రాష్ట్రం మొత్తం టోల్ ప్లాజాలను వేగవంతమైన కదలికలను నిర్థారిస్తుంది.
విశ్వేశ్వర్ భట్ గురువారం ఈ విధంగా ట్విట్ చేసారు. తాను ట్విట్ లో ప్రస్తావించిన విషయం ఏమిటంటే ? బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే జాతీయ రహదారిలో చాల ట్రాఫిక్ ఉంది అని ప్రస్తావించారు. ఇంకా విమానాశ్రయం కనుచూపుమేరలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ట్రాఫిక్ వల్ల సరైన సమయానికి విమానాశ్రయానికి వెళ్లలేకపోతున్నామని, దాదాపు మొదట 15 నిముసాలు టోల్ గేట్ లో వేచిఉండాల్సి వచ్చిందని, మరియు ఇంకా 20 నిముషాలు వేచి ఉండవలసి వచ్చింది అని తెలియజేసాడు.
జాతీయ రహదారి మొత్తం పొడవైన క్యూ ఉంది. ఈ విధంగా క్యూ ఉండటం వాళ్ళ వాహనదారులు చేరవలసిన గమ్యాన్ని సరైన టైం కి చేరలేరు. ఆ ట్రాఫిక్ లో ఉన్న చాల మంది విమాన ప్రయాణాన్ని కోల్పోవచ్చు. మొత్తం అక్కడ గందరగోళంగా ఉంది. ఈ విదంగా ఉన్న రోజు వారి సమస్యని ఎవరు పరిష్కరిస్తారు అని తన ట్విట్ ద్వారా తెలియజేసారు.
గణేష్ భట్ చేసిన ట్విట్ లో ఈ విదంగా చెప్పారు. వాహనాలలో వెళ్ళే ప్రజలు టోల్ ప్లాజా వద్ద ఎక్కువసేపు వేచి ఉన్నారని ఫిర్యాదు చేశారు. "బెంగళూరు విమానాశ్రయానికి సమీపంలో ఉన్న టోల్ గేట్ వద్ద వేచి ఉండటం అనేది ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. ఇక్కడ వేచి ఉండటం ద్వారా దాదాపు అరగంట నుండి 45 నిమిషాల సమయం వృధా అవుతుందని దీనిపైనా సరైన చర్యలు తీసుకోవాలి అని చెప్పారు.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) యొక్క నియమాల ప్రకారం, సదాహల్లి టోల్ ప్లాజాలోని 10 హైబ్రిడ్ లైన్ వద్ద వేచి ఉండే సమయం కేవలం మూడు సెకన్లు మాత్రమే. కానీ ఆ సమయాన్ని పాటించడం లేదు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి అందుబాటులో ఉన్న నివేదికల ప్రకారం డిసెంబర్ 15 తర్వాత గరిష్ట నిరీక్షణ సమయం హోస్కోట్, నెలమంగళ, హర్వాల్ మరియు కన్నోల్ టోల్ ప్లాజాలలో 3 నుండి 5 నిమిషాలు మాత్రమే అని వెల్లడించారు.
Read More:బిఎస్ -6 పరీక్షలో కనిపించిన టాటా నెక్సాన్ ఫేస్లిఫ్ట్