Just In
- 21 min ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 1 hr ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 1 hr ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 3 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
Don't Miss
- News దేవినేని ఉమకు కీలక బాధ్యత అప్పగించిన చంద్రబాబు..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Movies Tillu Square Business: సిద్దు మూవీకి రికార్డు బిజినెస్.. ఆ హీరోలతో సమానంగా.. టిల్లు 2 హిట్ కావాలంటే!
- Sports ఖమ్మం క్లాసెన్..మెదక్ మార్క్రమ్: క్రియేటివిటీ కొట్టేవాడే లేడు భయ్యా
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు 14 రోజుల గడువిచ్చిన ప్రభుత్వం...ఎందుకు ?
భారత దేశంలో పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వం ఎంతో కఠినంగా వుంది. దీని వలన ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది, రోజురోజుకు అనేక సంస్థల నుంచి వివిధ మోడల్లు, వివిధ టెక్నాలజీ తో వస్తున్నాయి. ఇవి కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలి. ఇందులో భాగంగా ప్రభుతం ఇచ్చిన గడువెంటో చూద్దాం రండి.
ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను ప్రారంభించేందుకు ఆటోమొబైల్ తయారీదారులు ఒక ప్రణాళికతో వచ్చేందుకు రెండు వారాలు సమయం ఇచ్చారు. కేవలం కొద్దిరోజుల క్రితమే ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల వాహన తయారీదారులకు గడువును ప్రకటించింది.
ప్రభుత్వం ప్రకారం, అన్ని త్రీ వీలర్స్ ఏప్రిల్ 2023 నుండి ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలి, అలాగే 150సిసి కంటే తక్కువ ఉన్న అన్ని ద్విచక్రవాహనాలు ఏప్రిల్ 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలి. ఈ నిబంధనకు సంబంధించి అనేక ఆటోమోటివ్ తయారీదారులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు, వారి ఆందోళనలు ఒక మేరకు నిజమయ్యాయి.
భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ ప్రపంచంలో అతి పెద్దది మరియు ప్రపంచంలో అతి పెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్గా ఉంది. ఇంత పెద్ద మార్కెట్ తో తయారైన ఇంధన వాహనాలతో, లక్షల మంది ఆటోమోటివ్ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద గనులలో ఈ ఆటో పరిశ్రమ కూడా ఒకటి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ చాలా తక్కువగా ఉన్న పరిస్థితిలో, భారత ప్రభుత్వం విద్యుత్తు వాహనాలకు మారడానికి ఒక ఆదేశం ఇస్తే, మొత్తం పరిశ్రమ కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే పలు కంపెనీలు తమ ఆందోళనను వ్యక్తం చేశాయి.
ఈ మధ్య కాలంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ఆటోమోటివ్ తయారీదారులందరికీ కూడా విద్యుదీకరణ వాహనాల గురించి ఎలా వెళ్తామని ఒక ప్రణాళిక లేదా రోడ్ మ్యాప్ తో రావాలని కోరింది. దీని వలన ప్రభుత్వానికి ఒక అవగాహన వస్తుందని చెప్పవచ్చు.
Most Read: పెట్రోల్ కు బదులుగా కోకాకోలా నింపేసాడు...తరువాత ఏమి జరిగింది?
కొద్దిమంది తయారీదారులు ఒక ప్రణాళికపై గడువు ఆరు నెలలు కోరారు, కానీ ప్రభుత్వం వారి విద్యుదీకరణ ప్రణాళికల గురించి మొండిగా ఉందని తెలుస్తోంది. 2025 కల్లా ఎలక్ట్రిక్ టూ వీలర్స్, 2030 కల్లా ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్స్, 2023 కల్లా ఎలక్ట్రిక్ త్రీ-వీలర్స్ లక్ష్యాన్ని ప్రతి కంపెనీ ఎలా సాధిస్తుందో ప్రభుత్వం ఒక ప్రణాలికను కోరుతోంది.
Most Read: ఎలక్ట్రిక్ వాహనాలు కొనే వారికీ కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్.....!
దీనిపై డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం
విద్యుత్ వాహనాల తయారీ ప్రణాళిక తయారు చేసే పని అంత సులభం కాదు. ఆటోమోటివ్ తయారీదారులు ప్రస్తుతానికి ఎలాంటి ఈవిలపై మౌలిక సదుపాయాలు లేవని, మౌలిక వసతుల కోసం ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్స్ ఏవీ లేవని భావించాల్సి ఉంటుంది. ఇది కాకుండా, ప్రజలకు ఆందోళన కలగని విధంగా ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన కారకం ఉంది.
Most Read: సీఎం జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారు ధర ఎంతో తెలుసా?
ఇదంతా చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి తయారీదారులు ఆరు నెలల సమయం అడిగారు. అయితే ప్రభుత్వం దాన్ని నిరాకరించి కేవలం 14 రోజుల వ్యవధి ఇచ్చింది. ఈ క్షణంలో, ఇది ఎలా మలుపు తిరుగబోతోంది నిజంగా మేము ఖచ్చితంగా చెప్పలేము. రాబోవు కాలంలో ఇంకా ఎటువంటి మార్పులొస్తాయో చూడాలి.