Just In
- 49 min ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 3 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 4 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 4 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
జాగ్వార్ నుండి మొదటి ఎలక్ట్రిక్ కార్ వస్తుంది వివరాలు చుడండి
ఈ సంవత్సరం నుండి భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్ ధ్రువీకరించింది. దేశంలో వారి ఎలక్ట్రిఫికేషన్ ప్రణాళికల్లో భాగంగా, జాగ్వార్ భారతదేశంలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా ఐ-పేస్ ఎస్.యూ.విని ప్రారంభించనుంది.
ప్రపంచ నిబద్ధతలో భాగంగా జాగ్వార్ తన మొత్తం ఎలక్ట్రిసిఫైడ్ ఐచ్చికాలను తన పోర్ట్ఫోలియోలో అందించడానికి ప్రయత్నాలను ప్రరంబించింది.తదుపరి వచ్చే సంవత్సరాల్లో, జాగ్వార్ దేశంలో విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ వాహన ప్రవేశపెట్టనుంది,2019 నుండి వాటిలో హైబ్రిడ్స్ మరియు బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బిఇవి) ప్రారంభమవుతాయి అని చెప్పింది.
జాగ్వార్ భారత మార్కెట్లో హైబ్రిడ్ ఉత్పత్తులను ముందుగానే పరిచయం చేయదలచుకుంది, కొంతకాలం తర్వాత, బ్రిటీష్ బ్రాండ్ దేశంలో మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టనుంది, 2020 చివరలో ఐ-పేస్ అనే వాహనాన్ని తయారుచేయాలని భావిస్తోంది.
భారతదేశంలో ప్రవేశపెట్టిన నూతన ఎఫ్ఎఎంఈ-II పధకం ద్వారా దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేయటానికి జాగ్వర్ యొక్క ప్రధాన కారణాల్లో ఒకటి చెప్పవచ్చు. దేశంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు భారత ప్రభుత్వం దృష్టి పెట్టాలని జాగ్వార్ కోరుకుంది.
Most Read: సీసీటీవీ లో రికార్డ్ అయిన భయంకరమైన ప్రమాదం!
జాగ్వార్ ల్యాండ్ రోవర్ యొక్క ఛైర్మెన్ రోహిత్ సూరి మాట్లాడుతూ అందరి దృష్టిని మరింత స్థిరమైన భవిష్యత్కు ఆకట్టుకోవడానికి మా ఇంజనీర్లు ఈ మార్గంలో నడపడానికి సరైన ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. జాగ్వార్ లాండ్ రోవర్ భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రభుత్వం యొక్క నమ్మకానికి అనుగుణంగా ఉంటుంది అని చెప్పారు.
ఈ సంస్థ భారతదేశ ప్రభుత్వంచే నిర్ధారించబడిన ఎఫ్ఎఎంఈ-II ద్వారా ప్రోత్సహించబడింది మరియు దేశంలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాల విస్తరణపై దృష్టి పెట్టింది. అన్ని రకాలైన ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయబోతోంది,రాబోయే జాగ్వార్ ఐ-పేస్ మొత్తం ఎలక్ట్రిక్ ఎస్.యూ.వి కి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు విద్యుత్ బ్యాటరీ 90KWతో వస్తుంది.
Most Read: రాయల్ ఎన్ఫీల్డ్ ను పట్టుకున్న ఐఏఎస్ అధికారి..!
ఎలక్ట్రిక్ మోటార్లు 392బిహెచ్పి యొక్క మిశ్రమ విద్యుత్ ఉత్పత్తిని చేస్తుంది మరియు ఒక్క సరి ఛార్జ్ చేస్తే 480కి.మీ దూరాన్ని ప్రయాణించవచ్చును. జాగ్వార్ ఐ-పేస్ ఫాస్ట్-ఛార్జింగ్ టెక్నాలజీతో కూడా వస్తుంది, ఇది బ్యాటరీలను కేవలం 40 నిమిషాలలో ఛార్జ్ చేస్తుంది.