Just In
- just now ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించిన మహీంద్రా...ఎంతో తెలుసా ?
భారతదేశ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తన ప్యాసింజర్ కార్ల ధరల్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ కొత్త ధరలు జులై 1, నుంచి అమల్లోనికి వస్తాయి అని తెలిపింది. దీని వలన ఈ వాహనాలు మరింత భద్రతో వస్తున్నాయి.
ఇందులో కార్ల ధరల్ని రూ.36,000 పెంచుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. భారతదేశంలో అన్ని ప్యాసింజర్ వాహనాల్లో ఆటోమోటీవ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 145 భద్రతా నిబంధనలను అమలు చేయడం వల్ల ధరలను పెంచడం తప్పడం లేదని కంపెనీ పేర్కొంది.
గ్లోబల్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ తరహాలోనే భారతదేశంలో త్వరలో భారత్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ ప్రారంభం కానుంది. క్రాష్ టెస్ట్ నిర్వహించే కార్లకు ఏఐఎస్ 145 ప్రకారం సేఫ్టీ ఫీచర్స్ తప్పనిసరి. అలాంటి వాటికే 5 స్టార్ రేటింగ్ లభిస్తుంది.
2020 నాటికి రోడ్డు ప్రమాదాలు 50 శాతం తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం భారతదేశంలోని కార్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి.
ఆటోమోటీవ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ 145 భద్రతా నిబంధనలలో, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, సీట్ బెల్ట్ రిమైండర్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు ప్యాసింజర్ వాహనంలో డ్రైవర్ కు ఓవర్ స్పీడ్ అలర్ట్ తో సహా అనేక భద్రతా ఫీచర్ల ఇందులో ఉన్నాయి.
మహీంద్రా వారి లైనప్ లో సరికొత్త ఉత్పత్తులు, ఎక్స్యూవి300, కంపెనీ ఫ్లాగ్ షిప్ వెహికల్ అయిన ఆల్తురాస్ జీ4 ఇప్పటికే ఈ సేఫ్టీ ఫీచర్లతో ఉన్నాయి కాగా, ఈ మోడళ్లకు ధరల్లో కనీసస్థాయి పెరుగుదల కూడా ఉంటుందని చెప్పవచ్చు. కానీ థార్ 700 ప్రారంభం అయినప్పటికీ, పరిమిత సంఖ్యల కారణంగా, దీనిపై ధర పెరుగుదల ఉండవచ్చు.
Most Read: డాక్టర్ భార్య కోసం ల్యాంబోర్ఘిని హురాకాన్ కారు కొన్న భర్త
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ , రాజన్ వాదేరా చెప్పిన దాని ప్రకారం, "మహీంద్రా సేఫ్టీ మా ప్రొడక్ట్ డెవలప్ మెంట్ ప్రక్రియలో అంతర్భాగం మరియు భద్రతలను అప్గ్రేడ్ లకు సంబంధించిన ఆవశ్యకతలను మేం స్వాగతిస్తున్నాం.
Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??
వినియోగదారు యొక్క జీవితం మరియు అభివృద్ధి చెందుతున్న భద్రతా పర్యావరణ వ్యవస్థకు సమర్థవంతంగా మహీంద్రా తోడ్పడింది. అయితే, భద్రతా నియంత్రణ ఆవశ్యకత వలన కొంత ఖర్చు పెరగటానికి దారితీసింది. పర్యవసానంగా, మేము మా ప్యాసింజర్ వాహనాల్లో ధరల పెంపును చేసాము, ఇది జూలై 1, 2019, నుండి అమలు కానుంది "అని ఆయన తెలిపారు.
Most Read: భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మహీంద్రా రూ. 36,000 వరకు ధర పెంపుదలను మేం పరిగణనలోకి తీసుకోవడం లేదు, అయితే థార్ 700 కొరకు ధరల్లో ఎలాంటి మార్పులు లేవని మేం ఆశిస్తున్నాం. మహీంద్రా వారు చాలా సురక్షితమైన కార్లను మరియు ఎస్యూవి లను తయారు చేస్తున్నారని చెప్పవచ్చు, పెరుగుతున్న ధర సరైనదని మేం భావిస్తున్నాం. దీని వలన వినియోగదారులకు మరింత భద్రత వస్తోంది.