Just In
- 15 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 15 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 16 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ లు ఏవో తెలుసా
భారత మార్కెట్లోకి రానున్న ఏడాదిలో మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ ప్రారంభించనున్నట్లు మహీంద్రా ధ్రువీకరించింది. మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు ఈ-కేయూవీ100, ఈ-ఎక్స్యూవి300, మహీంద్రా బడ్జెడ్ ఫోర్డ్ ఆస్పైర్ ల ఎలక్ట్రిక్ వర్షన్ లవ్ వస్తాయి.
మూడు మహీంద్రా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ప్రకటనను పవన్ గోయెంకా(ఎండి మహీంద్రా) ద్వారా మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సమయంలో విడుదల చేయబడింది. ఈ-కేయూవీ100 కొంత ఆలస్యంగా-2019 అమ్మకానికి వెళుతుందని ఆయన పేర్కొన్నారు.
2020 లో ఎలక్ట్రిక్ ఎక్స్యూవి300 విడుదల కానుండగా, మహీంద్రా బడ్జెడ్ ఫోర్డ్ ఆస్పైర్ యొక్క ఎలక్ట్రిక్ వర్షన్ 2021 నుండి అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే దేశంలో అందుబాటులో ఉన్న మహీంద్రా ఈ-వెరిటో తో పాటు మొత్తం మూడు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి.
దేశంలో ఇప్పటికే ప్రకటించిన కఠినతరమైన భద్రత, క్రాష్ టెస్ట్ నిబంధనలను పాటించకపోవడం వలన మహీంద్రా ఎలక్ట్రిక్ ఇప్పటికే భారత మార్కెట్ లో వారి ఈ2ఓ ఎలక్ట్రిక్ వెహికల్ ను నిలిపివేశారు.
అలాగే ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు, మహీంద్రా భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా కొత్త ప్లాట్ ఫామ్ ను అభివృద్ధి చేసేందుకు యోచిస్తోంది. వారి సంబంధిత ఐసి ఇంజిన్ వెర్షన్ల నుండి ఎలక్ట్రిక్ వాహనాల లోకి మార్చిన ప్రస్తుత మోడళ్ల వలె కాకుండా, ఈ బ్రాండ్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తయారీ చేయడానికి ఈ కొత్త ప్లాట్ ఫామ్ ను వినియోగిస్తారు.
ఈ కొత్త మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికలను 2022 - 2023 మధ్య కాలానికి భారతదేశంలో అమ్మకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుంది. ఇటీవల విద్యుత్ వాహనాలపై జీఎస్టీ రేట్లను 12 నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పట్ల తమ నిబద్ధతను మరింత బలపర్చిందని కూడా పవన్ గోయెంకా తెలిపారు.
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జర్స్ పై కూడా జిఎస్టి రేట్లను గత 18శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం జరిగింది, ఇది దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ నిర్మించడానికి వేగవంతంగా సహాయపడుతుంది.
Most Read: రాయలసీమలో తయారైన తొలికారును ప్రారంభించిన కియా మోటార్స్
మహీంద్రా ఈ-కేయూవీ100, ఎలక్ట్రిక్ వర్షన్ ఎక్స్యూవి300 పలు సందర్భాల్లో భారత రోడ్లపై ఇప్పటికే రహస్య పరీక్షలు జరిపింది. ఈ ఏడాది తర్వాత ఈ మూడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రపంచ వ్యాప్తంగా మొదటి స్థానంలో ఉన్న మహీంద్రా ఈ-కేయూవీ100 ఒకసారి ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 120 కి.మీ దూరాన్ని ప్రయాణించే అంచనా ఉంది.
Most Read: హీరో స్ల్పెండర్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ బైక్ ఇలానే ఉంటుంది
ఇది 40 కిలోవాట్ (53బిహెచ్పి) మరియు 120 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 16 కిలో వాట్/గం బ్యాటరీని ద్వారా పవర్ అందించబడుతుంది. మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు స్వదేశీ తయారీదారుల మధ్య మహీంద్రా పోటీని పెంచేందుకు ప్రయత్నిస్తోంది.
Most Read: మారుతీ సుజుకి ఎక్స్ఎల్6 Vs మారుతీ సుజుకి ఎర్టిగా...మధ్య తేడా ఏంటి ?
కంపెనీ ఇప్పటికే మునుపటి ఈ2ఓలో అందుబాటులో ఉన్న సాంకేతికతను మరియు మార్కెట్ లో ప్రస్తుత ఇ-వెరిటోతో పాటు, ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో తన పోర్టుఫోలియోను విస్తరించాలని చూస్తుందని పేర్కొంది.