Just In
Don't Miss
- Sports
టీమిండియాకు షాక్.. హెట్మయిర్, హోప్ సెంచరీలు.. వెస్టిండీస్ ఘన విజయం!!
- News
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం: భవనాలు ధ్వంసం, ముగ్గురి మృతి, వందలాది మందికి గాయాలు
- Movies
RRRలో జరుగుతున్న దానిపై ఇద్దరు హీరోల ఫ్యాన్స్ హ్యాపీ.. ఆ సెంటిమెంట్ను గుర్తు చేస్తున్నారు.!
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్లకు వెళ్లండి!
అన్ని కార్లలో సరికొత్త ఇంజన్.. మారుతి షాకింగ్ నిర్ణయం
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ సరికొత్త బిఎస్-6 డీజల్ ఇంజన్ను తమ అన్ని కార్లలో అందించాలనే నిర్ణయం తీసుకుంది. తాజాగా అందిన రిపోర్ట్స్ మేరకు, మారుతి సుజుకి వచ్చే ఏడాది నాటికల్లా సరికొత్త 1.6-లీటర్ బిఎస్-6 డీజల్ ఇంజన్ను పరిచయం చేస్తున్నట్లు సమాచారం.

బిఎస్-6 ప్రమాణాలను పాటించే ఈ సరికొత్త ఇంజన్ను ఫియట్ నుండి సేకరించారు. మారుతి సజుకి ఇండియా లైనప్లో ఉన్న వితారా బ్రిజా కాంపాక్ట్ ఎస్యూవీ, ఎస్-క్రాస్ క్రాసోవర్, ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 ఎంపీవీ కార్లలో ఈ ఇంజన్ అందించే అవకాశాలు ఉన్నాయి.

అతి త్వరలో పరిచయం కానున్న ఇంజన్ ఎస్-క్రాస్ మోడల్తో బిఎస్-4 ప్రమాణాలతో గతంలోనే వచ్చింది. కానీ ఆశించిన సేల్స్ సాధించడంలో విఫలమవడంతో మార్కెట్ నుండి వైదొలగింది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్ అనుసంధానంతో లభించే ఇంజన్ 118బిహెచ్పి పవర్ మరియు 320ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

మారుతి సుజుకి ఏప్రిల్ 2019 నుండి తమ కార్లలో బిఎస్-6 ప్రమాణాలను పాటించే పెట్రోల్ ఇంజన్లను అందివ్వడం ప్రారంభించింది. బిఎస్-6 పొందిన తొలి మారుతి మోడల్ బాలెనో హ్యాచ్బ్యాక్. 1.2-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ కంపెనీ యొక్క తొలి బిఎస్-6 ఇంజన్.

బిఎస్-6 ఇంజన్లను తప్పనిసరిగా అందించాలని ప్రభుత్వం ప్రకటించిన గడువులోపే వ్యాగన్ఆర్, స్విఫ్ట్ మరియు డిజైర్ కార్లలో బిఎస్-6 ఇంజన్ వచ్చింది. ఇటీవల విడుదలైన ఎర్టిగా ఎంపీవీ మరియు ఎర్టిగా ఆధారిత ప్రీమియం వెర్షన్ ఎక్స్ఎల్6 ఎంపీవీ కార్లలో అదే విధంగా తాజాగ మార్కెట్లోకి వచ్చిన మారుతి ఎస్-ప్రెస్సో స్మాల్ కార్లో కూడా బిఎస్-6 ఇంజన్ వచ్చింది.

మారుతి సుజుకి అన్ని ఇంజన్ వేరియంట్లను మార్కెట్ నుండి తొలగిస్తున్నట్లు ఇది వరకే ఓ ప్రకటనలో పేర్కొంది. బిఎస్-6 ప్రమాణాలను పాటించే డీజల్ ఇంజన్ను డెవలప్ చేయడానికి అధికం వ్యయం వెచ్చించాల్సి వస్తుందని ఈ నిర్ణయం తీసుకుంది. అధిక పెట్టుబడుల కారణంగా తమ ఉత్పత్తుల ధరలను పోటీతత్వంతో నిర్ణయించాల్సి వస్తుంది. ఇదే జరిగితే ధరలు పెరుగుతాయని, డీజల్ ఇంజన్ వేరియంట్లకు స్వస్తి పలకాలని భావించింది.

అయితే, ఇటీవల కాలంలో ఎస్యూవీ మోడళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వదులుకునేందుకు మారుతి సిద్దంగా లేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ కెపాసిటీ గల డీజల్ ఇంజన్ను బిఎస్-6 ప్రమాణాలతో ప్రత్యేకించి ఎస్యూవీ మరియు ఎంపీవీ మోడళ్ల కోసం తీసుకురావాలని భావించింది.

ఎస్-క్రాస్ మరియు వితారా బ్రిజా మోడళ్లు అతి త్వరలో 1.5-లీటర్ బిఎస్-6 SHVS పెట్రోల్ ఇంజన్తో రానున్నాయి. ఈ ఇంజన్ను ఇప్పటికే ఎర్టిగా మరియు ఎక్స్ఎల్6 మోడళ్లలో అందించింది. అయితే, ప్రస్తుతం ఉన్న 1.3-లీటర్ డీజల్ను శాస్వతంగా తొలగిస్తున్నారు మరియు దీనిని బిఎస్-6 ప్రమాణాలతో తీసుకొచ్చే ఆలోచన కూడా లేదు.

ఏప్రిల్ 1, 2020 నుండి మార్కెట్లోకి అమ్ముడయ్యే ప్రతి కారు కూడా బిఎస్-6 ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. ఈ ప్రమాణాల ద్వారా ఇంజన్లు తక్కువ ఉద్గారాలు విడుదల చేస్తాయి.

"బిఎస్-6 డీజల్ ఇంజన్లు ఇకపై ఉండబోవని.." మరోసారి డిమాండ్ ఎక్కువగా ఉందని "సరికొత్త ఇంజన్ ఆప్షన్లో మళ్లీ బిఎస్-6 డీజల్ ఇంజన్ వేరియంట్లను కొనసాగిస్తామని" ఇలా రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ కస్టమర్లను తికమక పట్టించింది.
కానీ, ఏదేమైనప్పటికీ బిఎస్-6 డీజల్ వేరియంట్లను తమ అన్ని మోడళ్ల లాంచ్ చేస్తామని ప్రకటించింది. మారుతి కార్లను డీజల్ వేరియంట్లలో కొనాలనుకునే కస్టమర్లకు ఇదొక గొప్ప అవకాశం.