Just In
- 9 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 10 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 12 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 15 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
అత్యధిక మైలేజ్తో మారుతి సుజుకి ఎర్టిగా: ఇప్పుడే తెలుసుకోండి
ఇండియాలో అత్యధికంగా ప్యాసింజర్ కార్లను విక్రయిస్తున్న మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) అతి త్వరలో ఎర్టిగా ఎంపీవీని మరో కొత్త వెర్షన్లో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఎర్టిగా ఎంపీవీలలో ఈ వెర్షన్ అత్యంత ఖరీదైన మోడల్గా నిలవనుంది. అంతే కాకుండా, ఈ వేరియంట్ను కేవలం నెక్సా షోరూమ్ల ద్వారా మాత్రమే విక్రయించాలనే భావిస్తోంది.
మారుతి ఎర్టిగా కొత్త వెర్షన్ గురించి పూర్తి వివరాలను ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి...
మారుతి సుజుకి తమ సరికొత్త ఎర్టిగా ఎంపీవీ వేరియంట్ను ఆగష్టు 21, 2019 న విడుదల చేసి, విక్రయాలకు సిద్దంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. డిజైన్ పరంగా ప్రస్తుతం ఉన్న మోడల్నే పోలి ఉన్నప్పటికీ, ఖరీదైన వెర్షన్ కోరుకునే కస్టమర్ల కోసం క్రాసోవర్ మోడల్ అనిపించేందుకు ఇందులో పలు మార్పులు చేర్పులు చేస్తున్నారు.
మారుతి ఎర్టిగా క్రాస్ అని పిలుచుకునే ఈ మోడల్ మునుపటి ఎర్టిగా వెర్షన్ కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. ఇంటీరియర్, ఎక్ట్సీరియర్ మరియు టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సరికొత్త ఎర్టిగాలోని మరో ప్రత్యేకత ఏమిటంటే... అధునాతన 6-సీటర్ క్యాబిన్ ఫార్మాట్లో రావడం.
మారుతి సుజుకి తమ సరికొత్త ఎర్టిగా క్రాస్ మోడల్ను సీఎన్జీ ఇంజన్ వేరియంట్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి అయితే ఎర్టిగా ఎంపీవీ 1.5-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. వీటకి అదనంగా సీఎన్జీ ఇంజన్ వేరియంట్ను కూడా పరిచయం చేస్తున్నారు.
సెకండ్ జనరేషన్ ఎర్టిగా ఎంపీవీలో సీఎన్జీ ఇంజన్ అందించాలనే కంపెనీ ఆలోచన ఎర్టిగా మోడల్తో పాటు, మార్కెట్లో కంపెనీకి మంచి బలాన్నిస్తుంది. మారుతి ఇటీవల విడుదల చేసిన సియాజ్ ఫేస్లిఫ్ట్ కారులో వచ్చిన సరికొత్త 1.5-లీటర్ కె15బి పెట్రోల్ ఇంజన్ ఆధారంగానే సీఎన్జీ ఇంజన్ డెవలప్ చేస్తున్నారు.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
ఈ కె15బి పెట్రోల్ ఇంజన్ ఎర్టిగా మరియు సియాజ్ కార్లలో ఇప్పటికే అందుబాటులో ఉంది. అదనంగా కంపెనీ డెవలప్ చేసిన SHVS అనే మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ జోడింపుతో ఈ ఇంజన్లు లభిస్తున్నాయి. సాధారణ ఇంజన్తో పోల్చితే హైబ్రిడ్ సిస్టమ్ ఉన్న మోడళ్లు మంచి మైలేజ్ ఇస్తాయి.
పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్లతో పోల్చుకుంటే సీఎన్జీ ఇంజన్ల నుండి వెలువడే కర్బన ఉద్గారాలు మోతాదు తక్కువగా ఉంటుంది. పర్యావరణహితమైన ఇవి అత్యుత్తమ మైలేజ్ ఇస్తాయి. మార్కెట్లో పెట్రోల్ మరియు డీజల్తో పోల్చుకుంటే సీఎన్జీ ఇంధన ధర కూడా తక్కువగానే ఉంది.
మునుపటి జనరేషన్ మారుతి ఎర్టిగా సీఎన్జీ వేరియంట్ ఒక కిలో సీఎన్జీ ఇంధనానికి 22.8కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగా, సీఎన్జీ మరియు మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ జోడింపుతో వస్తున్న సరికొత్త మారుతి ఎర్టిగా క్రాస్ సీఎన్జీ వేరియంట్ గరిష్టంగా 25కిలోమీటర్ల మైలేజ్నిస్తుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇప్పటికే అమ్మకాల్లో ఉన్న మారుతి ఎర్టిగా సీఎన్జీ మంచి మైలేజ్ ఇస్తోంది, కానీ సీఎన్జీకి తోడుగా మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్ కూడా కలవడంతో త్వరలో రానున్న ఎర్టిగా క్రాస్ మోడల్ మరింత ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కాలుష్యాన్ని కాపాడుకుంటూనే సేల్స్ మరియు కస్టమర్ల ఆకట్టుకునేందుకు నూతన టెక్నాలజీని అభివృద్ది చేసి, ఇప్పటికే అందుబాటులో ఉన్న మోడళ్లలో పరిచయం చేస్తోంది.