Just In
- 1 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఎర్టిగా ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్న మారుతీ సుజుకి
మారుతి సుజుకి తమ మోస్ట్ పాపులర్ ఎంపివి కొత్త తరం ఎర్టిగా కారును విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది మార్కెట్లో మంచి విజయాన్ని సాధించింది. పాత తరం ఎర్టిగాతో పోల్చితే, ఈ కొత్త తరం ఎర్టిగా ఎంపివిని అధునాతన డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అయితే మారుతీ సుజుకి దీని ఆధారంగా మరో ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. మరి దీని గురించి వివరంగా తెలుసుకొందాం రండి..
మారుతి సుజుకి వారి మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2020 లో ఇండియన్ మార్కెట్లో వ్యాగన్ ఆర్ ఆధారంగా ఉంటుందని నిర్ధారించారు. ఇప్పుడు ఆ సంస్థ తన రెండో ఎలక్ట్రిక్ వాహనాన్ని మార్కెట్ తీసుకురావడం కోసం పనిచేస్తోందని తెలిసింది. భారతదేశంలో సుజుకి నుండి రెండవ ఎలక్ట్రిక్ వాహన తయారీ, బాగా ప్రజాదరణ పొందిన ఎర్టిగ ఎంపివి ఆధారంగా ఉంటుంది.
కొత్త మారుతి ఎర్టిగా ఎలెక్ట్రిక్ పూర్తిగా భిన్నమైన కొలతలు, రూపకల్పనతో ఒక కొత్త బ్రాండ్ పేరు కూడా పెట్టినట్లు తెలిసింది. అయితే ఈ రెండో ఎలక్ట్రిక్ వాహనంకు సంబంధించిన ప్రణాళికను ఇంకా ఫైనలైజ్ చేయాలని రిపోర్టులు సూచించాయి. అయితే భారత మార్కెట్లో మారుతి సుజుకి ఎటువంటి స్థానం ఉందో మనకి తెలుసు.
లక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్ లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇతర బ్రాండ్ ల నుంచి పోటీని ఎదురుకోవడానికి మారుతీ సుజుకీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మారుతి సుజుకి ప్రస్తుతం దేశంలో వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్ 50 లను పరీక్షిస్తోంది. ఎలక్ట్రిక్ వ్యాగన్ ఆర్ ను మార్కెట్ లో, అనేక విభిన్న సందర్భాలలో విస్తృతంగా పరీక్షిస్తున్నారు.
అంతేగాక మారుతి వ్యాగన్ ఆర్ ఎలక్ట్రిక్ ను లాంచ్ చేసి గుజరాత్ లో లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంటును నెలకొల్పేందుకు కూడా ఈ సంస్థ కసరత్తు చేస్తోంది. అయితే, దీని ప్రత్యర్థులు టాటా మోటార్స్ కూడా ఇటీవల గుజరాత్ లో ఇదే తరహా లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంటును నెలకొల్పేందుకు తమ ప్రణాళికలను ప్రకటించింది.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
మారుతి సుజుకి ఈ ఏడాది మొదట్లో రెండవ తరం ఎర్టిగా ఎంపివి ను దేశీయంగా ప్రారంభించింది. అప్పటినుండి, మారుతి ఎర్టిగా మార్కెట్లో అత్యంత విజయంతో ఆదరణ పొందింది, ఈ ఎంపివి సెగ్మెంట్ కు మంచి అమ్మకాలు నమోదు జరిగింది.
ఇండియన్ మార్కెట్లో మల్టీ పర్పస్ వెహికల్ విజయం సాధించడం వలన మారుతి ఎర్టిగా ఎంపివిని ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎంచుకోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి. మారుతి సుజుకి ఎర్టిగా ప్రస్తుతం పెట్రోల్ మరియు డీజల్ ఇంజన్ ఆప్షన్లలో రెండింటిలోను అందుబాటులో ఉంది.
ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, 1.3-లీటర్ డీజల్ మరియు ఒక 1.5-లీటర్ డీజల్ కూడా ఉన్నాయి. అలాగే మారుతి ఒక ట్రాన్స్ మిషన్ ఆప్షన్ లను కూడా అందిస్తోంది. కొత్త మారుతి సుజుకి ఎర్టిగా రూ. 7.44 లక్షలు, ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం భారత మార్కెట్లో ఎర్టిగా ఎంపివి మరింత ప్రీమియమ్ సిక్స్ సీటర్ వర్షన్ ను కూడా ప్రవేశపెట్టేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. కొత్త ప్రీమియం ఎర్టిగా ఈ ఏడాది ఆగస్టు 21 వ తేదీ నుంచి అమ్మకానికి రానుంది.
డ్రైవ్స్ స్పార్క్ తెలుగు అభిప్రాయం
మారుతీ సుజుకీ భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన సెగ్మెంట్ దిశగా దూకుడు వ్యూహాని రచిస్తోంది. 2020 లో భారతదేశంలో ప్రారంభించటానికి ఎలక్ట్రిక్ వ్యాగన్ ఆర్ సిద్ధం అవుతోంది, ఎలక్ట్రిక్ ఎర్టిగా ఎంపివి తరువాత దశలో మార్కెట్ లోకి బహుశా 2021 లో వస్తుందని ఆశించవచ్చు. అయితే మారుతి సుజుకి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.