Just In
- 11 min ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 3 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
- 3 hrs ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago బిలినీయర్ మనసుదోచిన ఆటో ఇదే!.. ధర తెలిస్తే మీరు కొనేస్తారు
Don't Miss
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Sports ఆ చెత్త నిర్ణయమే ఆర్సీబీ కొంపముంచింది- ఫించ్
- News ముందస్తుగానే ఏపీ ఎన్నికల ఫలితాలు - గెలుపెవరిది..!!
- Finance Debt Free: అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా..?? ఇవిగో 5 మార్గాలు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
విపణిలోకి కొత్త మారుతి డిజైర్.. ధర & పూర్తి వివరాల కోసం
2019 జూలై 01 నుండి అమ్ముడయ్యే ప్రతి ప్యాసింజర్ కారు కూడా నూతన భద్రత ప్రమాణాలను పాటించాలి. ఈ క్రమంలో పలు కార్ల సంస్థలు తమ కార్లలో నూతన సేఫ్టీ ఫీచర్లను అప్గ్రేడ్ చేసి కొత్త ధరలను నిర్ణయించి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అందులో భాగంగానే నూతన భద్రతా ప్రమాణాలతో మారుతి సుజుకి డిజైర్ కాంపాక్ట్ సెడాన్ కారును లాంచ్ చేసింది. వేరియంట్ల వారీగా ధరలు కూడా పెంచింది.
మారుతి సుజుకి మాత్రమే కాదు, దేశీయ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కూడా తమ అన్ని ప్యాసింజర్ వాహనాలలో సేఫ్టీ ఫీచర్లను అందించి, సుమారుగా రూ. 36,000 వరకు ధరలు పెంచినట్లు ప్రకటించింది. ఇదే బాటలో మారుతి సుజుకి ప్రస్తుతం విక్రయిస్తున్న అన్ని కార్లలో తప్పనిసరి సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఈ వారంలో స్విఫ్ట్ మరియు వ్యాగన్ ఆర్ మోడళ్లను అప్గ్రేడ్ చేసింది.
మారుతి సుజుకి నూతన భద్రత ఫీచర్లను అందివ్వడంతో పాటు 2020 నుండి అమల్లోకి వచ్చే బిఎస్-6 ఇంజన్ను కూడా అందించి డిజైర్ కారును లాంచ్ చేసింది. మారుతి డిజైర్ బిఎస్-6 మోడల్ ధరల శ్రేణి రూ. 5.82 లక్షలతో మొదలుకొని రూ. 9.75 లక్షలు ఎక్స్-షోరూమ్(ఇండియా)గా ఉన్నాయి. అంటే మునుపటి ధరలతో పోల్చుకుంటే దాదాపు రూ. 15,000 వరకు పెరిగాయి.
సాంకేతికంగా మారుతి డిజైర్ అవే మునుపటి 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.3-లీటర్ డీజల్ ఇంజన్ ఆప్షన్లలో లభ్యమవుతోంది. కానీ ప్రస్తుతం ఉన్న ఇవే ఇంజన్లు బిఎస్-4 ప్రమాణాలను పాటిస్తున్నాయి. ఏప్రిల్ 01, 2020 నుండి వీటి స్థానంలో బిఎస్-6 ప్రమాణాలు పాటించే ఇంజన్లు తప్పనిసరి కావడంతో బిఎస్-6 మోడళ్లను ముందుగానే ప్రవేశపెడుతున్నారు.
ప్యాసింజర్ కార్లలో ప్రయాణాలు మరింత సురక్షితంగా ఉండటం మరియు వాహనాలు వెలువరించే కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఈ నూతన ప్రమాణాలను అమల్లోకి తీసుకొస్తోంది.
కార్ల తయారీ సంస్థలు విక్రయించే తమ అన్ని కార్లలోని అన్ని వేరియంట్లలో పలు కీలక సేఫ్టీ ఫీచర్లను తప్పనిసరి చేసింది. అందులో, ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ రిమైండర్స్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్.
అన్ని సంస్థలు పైన పేర్కొన్న భద్రతా ఫీచర్లను అన్ని వేరియంట్లలో తప్పనిసరిగా అందివ్వాలి. అదనపు సేఫ్టీ ఫీచర్లను వేరియంట్ల వారీగా కల్పించనా పర్వాలేదు. ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ AIS-145 ప్రకారం ఈ నూతన భద్రతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి.