Just In
- 1 hr ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 2 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 3 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 5 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- News టీడీపీలో ప్రకంపనలు..పార్టీకి గుడ్ బై చెబుతున్న నేతలు
- Sports Gautam Gambhir: నిద్రలో కూడా ఆర్సీబీనే కలవరిస్తా..! వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్యూవీపై బుకింగ్స్ ప్రారంభం: రూ. 50 వేలకే!!
ఎంజీ మోటార్ ఇండియా "ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ"ని ఇటీవల దేశీయ విపణిలోకి ఆవిష్కరించింది. ఎంజీ మోటార్ ఇప్పుడు తమ రెండవ మోడల్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మీద అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ మరియు ముంబాయ్ నగరాల్లో మాత్రమే బుకింగ్స్ ప్రారంభించినట్లు ఎంజీ మోటార్ పేర్కొంది.
ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కావాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా లేదా పైన పేర్కొన్న నగరాల్లోని ఏదైనా ఎంజీ మోటార్ డీలర్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ ధర రూ. 50,000 చెల్లించి ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీని బుక్ చేసుకోవచ్చు.
సరికొత్త ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ హెక్టర్ తర్వాత ఇండియన్ మార్కెట్లో కంపెనీ యొక్క రెండవ మోడల్. ఈ కొత్త మోడల్ జనవరి 2020 నుండి అమ్మకాల్లోకి రానుంది. ఒక్కసారి విడుదలైతే దీని ధర సుమారుగా రూ. 23 లక్షల వరకు ఉండొచ్చు, హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీకి గట్టి పోటీనిస్తుంది.
ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో సాంకేతికంగా 44.5kWh లిథియం-అయాన్ బ్యాటరీ సిస్టమ్ ఉంది, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141బిహెచ్పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సింగల్ ఛార్జింగ్తో సుమారు 340కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఫాస్ట్ ఛార్జర్ మరియు స్టాండర్డ్ (సాధారణ) రెండు రకాల ఛార్జింగ్ టెక్నాలజీని అందించారు. ఫాస్ట్ ఛార్జర్తో కేవలం 60 నిమిషాల్లోనే బ్యాటరీ 80శాతం ఛార్జ్ అవుతుంది, సాధారణ ఛార్జర్తో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్కు సుమారుగా 6 నుండి 8 గంటల సమయం పడుతుంది.
ఎంజీ మోటార్ ఇండియన్ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ ఎస్యూవీని విడుదల చేయడంతో పాటు, దేశవ్యాప్తంగా ఛార్జింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఎంజీ జడ్ఎస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీలో ఇచ్చిన ఛార్జింగ్ కేబుల్ ద్వారా 15ఆంపియర్స్ సాకెట్ ఉపయోగించి ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు. AC ఫాస్ట్-ఛార్జర్ను కస్టమర్ ఇంట్లో లేదా ఆఫీసులో ఏర్పాటు చేసుకోవచ్చు.
ఎంజీ మోటార్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని షోరూముల్లో సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ ఛార్జింగ్ స్టేషన్లు కస్టమర్లకు 24x7 గంటలు అందుబాటులో ఉంటాయి. ఫోర్టం కంపెనీ భాగస్వామ్యంతో ఎంజీ మోటార్ ఇటీవల తమ తొలి 50kW సామర్థ్యం గల ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ను గురుగ్రామ్లో ఏర్పాటు చేసింది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ కార్లే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, కార్ల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. దిగ్గజ సంస్థలైన టాటా మోటార్స్, ఎంజీ మోటార్ మరియు హ్యుందాయ్ కంపెనీలు ఇప్పటికే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఇప్పటికే మార్కెట్లోకి విడుదల చేశాయి. మొదట్లో ధర కాస్త ఎక్కువే అనిపించినప్పటికీ పెట్రోల్ మరియు డీజల్ కార్ల తరహాలో ఇంధనం నింపాల్సిన అవసరం ఉండదు. అతి తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చు. దీనికి తోడు కంపెనీలు కూడా 8 ఏళ్ల పాటు వారంటీ మరియు అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నాయి. 20 నుండి 25 లక్షల మధ్య కారు కొనాలని చూస్తుంటే ఇలాంటి ఎలక్ట్రిక్ ఎస్యూవీలను ఎంచుకోవడం ఎంతో మంచిది.