Just In
- 2 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 5 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 8 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 10 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
Don't Miss
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2020 కల్లా విడుదల కానున్న కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో.
భారతదేశంలో అతి పెద్ద వాహన సంస్థ అయిన మారుతి సుజుకి వచ్చే సంవత్సరం తన మార్కెట్ను అభివృద్ధి చేసుకోవడానికి కావలసిన ప్రణాళికలను ఇప్పటి నుంచే మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే పాత తరం వాహనాలను కొత్త హంగులతో తీసుకురానుంది.
మారుతి సుజుకి తమ తరువాతి తరం మోడల్ అయిన సెలెరియో హ్యాచ్ బ్యాక్ ను భారత్ లో లాంచ్ చేయనుంది. దీనిని వచ్చే ఏడాది 2020లో విదుదల చేయనున్నట్టు మీడియా వర్గాల ద్వారా తెలిసింది.
మారుతి సుజుకి సెలెరియో ఎక్కువ కాలం బాగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలలో ఉంది, కానీ ఈ హ్యాచ్ బ్యాక్ కొంచెం పాతదని మనందరికీ తెలుసు మరియు ఇతర వాహనాల పోటీ నుండి మారుతి సుజుకి సెలెరియో అమ్మకాలను గణనీయంగా పడిపోయాయి.
మొదటగా 2014 లో మారుతీ సుజుకి సెలెరియో విడుదల చేసారు. దీని యొక్క అద్భుతమైన విశ్వనీయత మరియు ఆహ్లాదకరమైన రూపకల్పన వలన భారత మార్కెట్లో విజయాన్ని పొందింది.
తిరిగి 2017 లో మారుతీ సుజుకి సెలెరియో పేస్లిఫ్ట్ ను లాంచ్ చేసింది, దీనిలో కొన్ని డిజైన్ మార్పులను మరియు లక్షణాలను జోడించారు. మారుతి సుజుకి సెలెరియో పాత డిజైన్, ఒక పాత ప్లాట్ ఫాం ఆధారంగా ఉంది.
అందువల్ల మారుతి సుజుకి వారు వచ్చే తరం మోడల్ కోడెమ్డ్ వైఎన్సి ను ప్రారంభించడం ద్వారా తిరిగి విజయాన్ని ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుండి 12-18 నెలల లోపు మారుతి సుజుకి వారు వైఎన్సి ను ప్రారంభించనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఒక నివేదికలో ధ్రువీకరించింది.
Most Read: భారతదేశపు అత్యంత విలాసవంతమైన బస్సు...దీనిని ఎప్పుడూ చూసిఉండరు!
తదుపరి తరం సెలెరియోలో, మారుతి సుజుకి భద్రత అంశం మీద దృష్టిసారించనున్నారు. ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, సీట్ బెల్ట్ వార్నింగ్, స్పీడ్ లిమిట్ వార్నింగ్ మరియు ఎబిఎస్ స్టాండర్డ్ ఫిట్ మెంట్ ఫీచర్లతో వస్తుంది. ఇందులో అధిక భద్రత ఫీచర్లతో ఉన్నత నమూనాలు గా వస్తాయి.
Most Read: ఆరు జిల్లాలలో డీజిల్ నిషేధం అంటున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ??
ఇది కేవలం భద్రత మాత్రమే కాదు, సమర్థత మరియు పర్యావరణానికి స్నేహపూరితంగా ఉంటుంది, ఇది వచ్చే తరం మారుతి సుజుకి సెలెరియో గా నిలుస్తుంది.
Most Read: సముద్రంలో కొట్టుకుపోతున్న మారుతి సుజుకి ఎర్టిగాని ఎలా కాపాడారో వీడియో చూడండి !
కొత్త తరం మోడల్ లో 1.0-లీటర్, 3-సిలిండర్ సహజంగా యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 67బిహెచ్పి యొక్క గరిష్ట పవర్ అవుట్ పుట్ మరియు 90ఎన్ఎమ్ పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు 5-స్పీడ్ ఎఎంటి గేర్ బాక్స్ లను జత చేసారు.