Just In
- 16 min ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 2 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 16 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 18 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
Don't Miss
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- News AP Elections: నా కాళ్లు పట్టుకున్నావా లేదా ? పెద్దిరెడ్డికి కిరణ్ ఘాటు కౌంటర్.. !
- Technology గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్ గురించి తెలుసా.. రోడ్ ట్రిప్ సహా ప్రయాణాల్లో ఆందోళన ఉండదిక...!
- Movies సుడిగాలి సుధీర్ అమ్మాయిల పిచ్చోడా? జబర్దస్త్ కమెడియన్ ఘాటుగా రియాక్షన్!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెట్రోల్ మరియు డీజల్ లపై సంచలన నిర్ణయం తీసుకొన్న కేంద్రం
పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ దేశంలో డీజిల్, పెట్రోలు వాహనాలను పూర్తిగా నిషేధించే ప్రణాళికలు లేవని, ఎందుకంటే పెరుగుతున్న ఇంధన డిమాండ్ ను శిలాజ ఇంధనాలు, బయో ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాల కలయికతో వస్తున్నాయి అని చెప్పారు.
భారత ప్రభుత్వం రాబోయే సంవత్సరాల్లో విద్యుత్ చైతన్యం పెంచడానికి ప్రణాళికలు చేస్తూ దాని దిశగా పని చేస్తోంది. 2030 నాటికి పెట్రోల్ మరియు డీజల్ టూ వీలర్స్, త్రీ-వీలర్స్, ప్యాసింజర్ కార్లను నిషేధిస్తూ, చమురు దిగుమతులపై చాలా ఖర్చులను తగ్గిస్తూ దేశీయంగా ఆదా చేయాలని నీతి ఆయోగ్లో ఇటీవల సూచించింది.
భారతదేశం తన చమురు డిమాండుకు 80 శాతం దిగుమతులపై ఆధారపడుతుంది. అయితే, పెట్రోల్ మరియు డీజల్ లతో నడిచే కార్లను త్వరలో ఏ సమయంలోనైనా నిషేధించ వచ్చని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.
ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ప్రాధాన్యతాను పొందుతుండగా, అలాగే ఇంధన అవసరాలను బిఎస్-6 గ్రేడ్ పెట్రోల్ మరియు డీజల్, (సిఎన్ జి) కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్, మరియు బయో ఇంధనాల కలయిక ద్వారా ఉంటుందని మంత్రి ధర్మేంద్ర చెప్పారు.
డీజిల్, పెట్రోల్ వాహనాలపై దేశంలో నిషేధాన్నీ విధించక పోతే, ప్రభుత్వం అధిక విద్యుత్ వాహనాల వినియోగాన్నీ ఎలా ముందుకు కొనసాగుతుందని, అందువలన దేశీయంగా భారీగా పెట్రోలు, డీజిల్ దిగుమతిని తగ్గించే అంతిమ లక్ష్యంతో ఉన్నామని ఈ విషయాన్ని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు పోటి
అయితే ఒక నిర్దిష్ట తేదీ నుండి పెట్రోల్ మరియు డీజల్ వాహనాలను నిషేధిస్తూ పేర్కొనే అధికారిక ప్రభుత్వ పత్రం ఇంతవరకు విడుదల చేయలేదు. ఇటీవల జరిగిన సమావేశాలలో కూడా ఎక్కడా వెల్లడించలేదు.
ప్రభుత్వ, నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరంలో చమురు దిగుమతిని భారతదేశం యూఎస్డి 112,000,000,000 ఖర్చు చేసింది. పెట్రోలియం ఆధారిత టూ వీలర్లు, త్రీ వీలర్ల అమ్మకాలను 2025 నాటికి భారత్ నిషేధించాలని ఈ ఏడాది మొదట్లో సిఫార్సు చేసింది.
2030 లో ప్రారంభించని సంస్థల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలపై నిషేధం విధించాలని కూడా సిఫార్సు చేసింది. ఉబెర్ మరియు ఓలా వంటి క్యాబ్ అగ్రిగేటర్స్ కూడా 2030 నుండి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించాలని పిలుపునిచ్చింది.
2030 నుండి నాన్ ఎలక్ట్రిక్ కార్లను నిషేధించాలన్న ప్రతిపాదన అవాస్తవమని విశ్లేషకులు మరియు ఆటో తయారీదారులు భావిస్తున్నారు, ఎందుకంటే ఇంధన డిమాండ్, పెరుగుతున్న జనాభాతో అధిక వాడకం కూడా ఉంది. అయితే 2030 నుంచి పెట్రోలు, డీజిల్ అమ్మకాలన్నిటినీ నిషేధించలేమని దేశ చమురు మంత్రి ఒప్పుకున్నాక కొంత ఊరట లభించి ఉంటుందని తెలుస్తోంది.