Just In
- just now హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 1 hr ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
- 2 hrs ago జనరల్ టికెట్ ప్యాసింజర్స్తో ఫుల్ రష్గా రిజర్వ్డ్ కోచ్లు.. ప్రయాణికుడి కంప్లెయింట్, రైల్వే శాఖ సీరియస్
- 4 hrs ago ఫ్రీ బస్సులో వాటికి ప్రత్యేకంగా సీటు.. బామ్మ, మనవరాలికి షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
Don't Miss
- Movies స్కిట్ కోసం నాలుక కోసేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. షాక్లో జడ్జిలు!
- Sports హార్దిక్పై కోపంగా మలింగ.. కారణమదేనా? Video
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- News బీజేపీకి అనపర్తి సీటు కేటాయింపు వెనుక వైసీపీ..!?
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Finance Rain Tax: ఆ నగరంలో ప్రజలపై వర్షం టాక్స్..! ఏప్రిల్ నుంచి దబిడిదిబిడేనా..??
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!
ఆటో మోటార్స్ ఇండియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం రెనాల్ట్ రాబోయే సంవత్సరంలో డీజిల్ తో నడిచే వాహనాల యొక్క మోడళ్ల ఉత్పత్తులను నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు. బిఎస్ -6 యొక్క కొత్త ఉద్గార నిబంధనలను అమలుచేసిన తర్వాత డీజిల్ ఇంజిన్లయొక్క ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. డీజిల్ ఇంజిన్లను నిలిపివేసిన తరువాత 2020 ఏప్రిల్ నుంచి రెనాల్ట్ కంపెనీ పెట్రోల్ తో నడిచే వాహనాలను మాత్రమే విక్రయిస్తుందని ఫ్రెంచ్ బ్రాండ్ నిర్దారించింది.
రెనాల్డ్ ప్రస్తుతం రెండు రకాలైన డీజిల్ తో నడిచే వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. అవి డస్టర్ మరియు లాడ్జి క్యాప్టూర్ వంటి మోడళ్ళు. ఇప్పుడు కొన్ని కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టడంతో డీజిల్ తో నడిచే ఈ వాహనాలను నవీనీకరించడం సాధ్యం కాదు.
డీజిల్ ఇంజన్లను నిలిపివేయడంతో పాటు భారతీయ మార్కెట్లో లాడ్జీ ఎమ్పివి ఉత్పత్తి మరియు అమ్మకాలను నిలిపివేస్తామని రెనాల్ట్ ధృవీకరించింది. ప్రస్తుతం 1.5-లీటర్ కె 9 కె డీజిల్ యూనిట్ ద్వారా శక్తినిచ్చే రెనాల్ట్ లాడ్జి పూర్తిగా బ్రాండ్ యొక్క పోర్ట్ఫోలియో నుండి నిలిపివేయబడుతుంది.
రెనాల్ట్ ఇండియా సీఈఓ "వెంకట్రామ్ మామిళ్ళపల్లె" మాటాడుతూ ఇకపై డీజిల్ ఇంజిన్లతో నడిచే వాహనాలను తయారు చేసే ఆలోచన కంపెనీకి లేదని చెప్పారు. రెనాల్ట్ బ్రాండ్ నుండి భవిష్యత్ లో వచ్చే అన్ని వాహనాలు ప్రీమియం క్యాప్టూర్ ఎస్యూవీతో సహా అన్నింటికీ పెట్రోల్ ఇంజిన్లు మాత్రమే ఉంటాయి అని నిర్థారించారు. రెనాల్ట్ లాడ్జి యొక్క ఉత్పత్తి ఇకపై ముగుస్తుంది అని ఈ మోడల్ ను పునరుద్దరించే ప్రణాళికలు ఏ మాత్రం లేవు అని స్పష్టం చేసారు.
ప్రస్తుత 1.5-లీటర్ కె 9 కె డీజిల్ ఇంజన్ లాడ్జీకి శక్తినిస్తుంది 1461 సిసి నాలుగు సిలిండర్ యూనిట్ రూపంలో వస్తుంది. ఇది 108బిపిహెచ్ మరియు 245ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.
డీజిల్ ఇంజన్లు మరియు లాడ్జీల ఉత్పత్తిని నిలిపివేయడమే కాకుండా, త్వరలో రాబోతున్న బిఎస్- VI ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వారి తాజా సబ్ -4 మీటర్ కాంపాక్ట్-ఎంపివి అప్డేట్ అవుతుందని రెనాల్ట్ ధృవీకరించింది. రెనాల్ట్ జనవరి 2020 లో బిఎస్ 6 ట్రైబర్ ఎమ్పివిని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మనకు తెలుస్తుంది.
Read More:2 సంవత్సరాల వారంటీని 4 సంవత్సరాలకు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్!
రెనాల్ట్ లాడ్జీ డీజిల్ ఇంజిన్లపై ఆలోచనలు:
ఇప్పుడు రెనాల్ట్ భారత మార్కెట్లో డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తికి దూరంగా ఉంది. డీజిల్ ఇంజిన్ యొక్క నవీకరణలకు పెట్రోల్ యూనిట్ల కంటే ఎక్కువ పెట్టుబడి అవసరం కాబట్టి వీటి ఉత్పత్తిని విరమించుకున్నారు. మరోవైపు రెనాల్ట్ లాడ్జీ దేశంలో అమ్మకాల కోసం చాలా కష్టపడుతోంది. కాబట్టి ఈ వాహనాలను ఇంకా తయారుచేయడం నిరర్ధకం అనే చెప్పాలి.