Just In
- 9 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 13 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 15 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 18 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
2020కి డీజిల్ ఇంజిన్లను నిలిపివేయనున్న రెనాల్ట్!
ఆటో మోటార్స్ ఇండియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం రెనాల్ట్ రాబోయే సంవత్సరంలో డీజిల్ తో నడిచే వాహనాల యొక్క మోడళ్ల ఉత్పత్తులను నిలిపివేయనున్నట్లు చెబుతున్నారు. బిఎస్ -6 యొక్క కొత్త ఉద్గార నిబంధనలను అమలుచేసిన తర్వాత డీజిల్ ఇంజిన్లయొక్క ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలుస్తుంది. డీజిల్ ఇంజిన్లను నిలిపివేసిన తరువాత 2020 ఏప్రిల్ నుంచి రెనాల్ట్ కంపెనీ పెట్రోల్ తో నడిచే వాహనాలను మాత్రమే విక్రయిస్తుందని ఫ్రెంచ్ బ్రాండ్ నిర్దారించింది.
రెనాల్డ్ ప్రస్తుతం రెండు రకాలైన డీజిల్ తో నడిచే వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. అవి డస్టర్ మరియు లాడ్జి క్యాప్టూర్ వంటి మోడళ్ళు. ఇప్పుడు కొన్ని కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టడంతో డీజిల్ తో నడిచే ఈ వాహనాలను నవీనీకరించడం సాధ్యం కాదు.
డీజిల్ ఇంజన్లను నిలిపివేయడంతో పాటు భారతీయ మార్కెట్లో లాడ్జీ ఎమ్పివి ఉత్పత్తి మరియు అమ్మకాలను నిలిపివేస్తామని రెనాల్ట్ ధృవీకరించింది. ప్రస్తుతం 1.5-లీటర్ కె 9 కె డీజిల్ యూనిట్ ద్వారా శక్తినిచ్చే రెనాల్ట్ లాడ్జి పూర్తిగా బ్రాండ్ యొక్క పోర్ట్ఫోలియో నుండి నిలిపివేయబడుతుంది.
రెనాల్ట్ ఇండియా సీఈఓ "వెంకట్రామ్ మామిళ్ళపల్లె" మాటాడుతూ ఇకపై డీజిల్ ఇంజిన్లతో నడిచే వాహనాలను తయారు చేసే ఆలోచన కంపెనీకి లేదని చెప్పారు. రెనాల్ట్ బ్రాండ్ నుండి భవిష్యత్ లో వచ్చే అన్ని వాహనాలు ప్రీమియం క్యాప్టూర్ ఎస్యూవీతో సహా అన్నింటికీ పెట్రోల్ ఇంజిన్లు మాత్రమే ఉంటాయి అని నిర్థారించారు. రెనాల్ట్ లాడ్జి యొక్క ఉత్పత్తి ఇకపై ముగుస్తుంది అని ఈ మోడల్ ను పునరుద్దరించే ప్రణాళికలు ఏ మాత్రం లేవు అని స్పష్టం చేసారు.
ప్రస్తుత 1.5-లీటర్ కె 9 కె డీజిల్ ఇంజన్ లాడ్జీకి శక్తినిస్తుంది 1461 సిసి నాలుగు సిలిండర్ యూనిట్ రూపంలో వస్తుంది. ఇది 108బిపిహెచ్ మరియు 245ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.
డీజిల్ ఇంజన్లు మరియు లాడ్జీల ఉత్పత్తిని నిలిపివేయడమే కాకుండా, త్వరలో రాబోతున్న బిఎస్- VI ఉద్గార నిబంధనలకు అనుగుణంగా వారి తాజా సబ్ -4 మీటర్ కాంపాక్ట్-ఎంపివి అప్డేట్ అవుతుందని రెనాల్ట్ ధృవీకరించింది. రెనాల్ట్ జనవరి 2020 లో బిఎస్ 6 ట్రైబర్ ఎమ్పివిని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు మనకు తెలుస్తుంది.
Read More:2 సంవత్సరాల వారంటీని 4 సంవత్సరాలకు పెంచిన రాయల్ ఎన్ఫీల్డ్!
రెనాల్ట్ లాడ్జీ డీజిల్ ఇంజిన్లపై ఆలోచనలు:
ఇప్పుడు రెనాల్ట్ భారత మార్కెట్లో డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తికి దూరంగా ఉంది. డీజిల్ ఇంజిన్ యొక్క నవీకరణలకు పెట్రోల్ యూనిట్ల కంటే ఎక్కువ పెట్టుబడి అవసరం కాబట్టి వీటి ఉత్పత్తిని విరమించుకున్నారు. మరోవైపు రెనాల్ట్ లాడ్జీ దేశంలో అమ్మకాల కోసం చాలా కష్టపడుతోంది. కాబట్టి ఈ వాహనాలను ఇంకా తయారుచేయడం నిరర్ధకం అనే చెప్పాలి.