Just In
- 1 hr ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 2 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 3 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 4 hrs ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
Don't Miss
- News టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా?: జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
300 ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్
భవిష్యత్ అంత ఎలక్ట్రిక్ వాహనాలని తేలిపోయినది. రానున్న సంవత్సరాలలో అన్ని వాహనాలను ఎలక్ట్రిక్ గా ఉండాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణఇంచేసింది. ఈ విషయంపై టాటా మోటార్స్ గుర్తించి, వారి అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంటుందని, ముందుగానే ఎంపిక చేసిన నగరాలలో 300 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొన్నాయి. వివరాలలోకి వెళితే..
టాటా మోటార్స్ ఐదు ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం 300 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను వెల్లడించింది. టాటా మోటార్స్ ఈ పనికి వారి అనుబంధ సంస్థ టాటా పవర్ తో కలిసి ఏప్రిల్ 2021 కంటే ముందు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు పూర్తి చేయనున్నారు.
మౌలిక సదుపాయాలు మరియు వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యాలు లేకపోవడం అనేది ఎలక్ట్రిక్ వాహన ప్రపంచానికి ఒక లోటుగా అని చెప్పవచ్చు. కావున ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన ప్రధానమైన వాటిలో ఫాస్ట్ చార్జ్ పరికరాలు కచ్చితమైనవి.
పెట్రోల్ లేదా డీజిల్ ఆధారిత వాహనాలను ఇంధనాన్ని నింపుకోవడానికి కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు, దీని తరువాత వాహనం కొన్ని వందల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. అయితే మరోవైపు ఎలక్ట్రిక్ కార్లు ఛార్జ్ చేయడానికి కొన్ని గంటల సమయం పడుతుంది మరియు దీని ప్రయాణ సామర్థ్యం కూడా అంత ఎక్కువగా ఉండదు.
ఈ చార్జింగ్ స్టేషన్లు టాటా మోటర్స్ డీలర్ల వద్ద, టాటా అనుబంధ సంస్థల ఇతర రిటైల్ అవుట్లెట్ల వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టాటా పవర్ పేర్కొంది. విద్యుత్తో నడిచే వాహనాలకు వేగవంతంగా, సులభంగా చార్జింగ్ చేయడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా మహీంద్రా ఈవెరిటో, టాటా టిగోర్ ఈవి వంటి బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లకు ఇది వర్తిస్తుంది అని చెప్పవచ్చు. అయితే టాటా మోటార్స్ ఈ సమస్యను నిదానంగా పరిష్కరిస్తున్నది అని తెలుస్తోంది. టాటా టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం ఇప్పుడు వార్తలో నిలిచింది.
అయితే, టాటా టిగోర్ ప్రయివేట్ కొనుగోలుదారుల కొరకు లభ్యం కాదు, ఎందుకంటే వ్యక్తిగత కొనుగోలుదారుడి యొక్క ప్రాథమిక ఆవశ్యకతలలో దూర ప్రయాణానికి టాటా టిగోర్ ఈవి ప్రస్తుతం ఆఫర్ చేయడం లేదు. టాటా ఇప్పుడు ప్రైవేట్ కొనుగోలుదారులకు కూడా సాధ్యమయ్యే అప్డేట్ పై పనిచేస్తోంది, దీని పరిధి చాలా వరకు మెరుగుపడుతుంది.
Most Read:కొత్త జనరేషన్ గ్రాండ్ ఐ10 ను వెల్లడించిన హ్యుందాయ్: బుకింగ్లు ప్రారంభం
టాటా టిగోర్ ఈవి ప్రస్తుతం ఒక 16.3 కిలోవాట్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది 3-ఫేజ్ ఎసి ఇండక్షన్ మోటార్ ను కలిగి ఉంది, ఇది సుమారుగా 39.4 బిహెచ్పి మరియు 105 ఎన్ఎమ్ వద్ద అవుట్ పుట్ కలిగి ఉంటుంది.
Most Read:"ఎగిరే కారు" ను ఆవిష్కరించిన జపాన్ ఎలక్ట్రిక్ సంస్థ
ఇది కేవలం వాణిజ్య ఆపరేటర్లకు మాత్రమే కాబట్టి, టాప్ స్పీడ్ ప్రస్తుతం 80 కిమీ/గం కు మాత్రమే పరిమితం చేయబడింది. ఇది ప్రస్తుతం సింగిల్ చార్జ్ పై 142 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది.
Most Read:బజాజ్ పల్సర్ 220ఎఫ్ లాంచ్ చేసిన బజాజ్: ధర, ఫీచర్ వివరాలు
కొత్త అప్డేట్ తో, టాటా మోటార్స్ ఈ రేంజ్ ను 200 కిలోమీటర్లకు పైగా పెంచింది మరియు టాప్ స్పీడ్ 100 కిమీ/గం కు పైగా ఉండే విధంగా తీసుకురానుంది. ఇప్పుడు మౌలిక సదుపాయాల కల్పన మరియు అమలు చేయడానికి కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.
టాటా మోటార్స్, టాటా పవర్ కలిసి బెంగళూరు, ముంబై, పుణె, ఢిల్లీ, హైదరాబాద్ నగరాలలో 300 ఎలక్ట్రిక్ వాహన ఫాస్ట్ ఛార్జింగ్ లను ఏర్పాటు చేయడానికి కలిసి వచ్చాయి. గత వారం పూణేలో ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లు ఏడు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే వివిధ నగరాలలో ఈ ప్లాన్ ను ఖరారు చేసింది.