Just In
- 12 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 14 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 17 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 18 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
2020 మహీంద్రా థార్ లాంచ్ ఎప్పుడో తెలుసా !
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మహీంద్రా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐకానిక్ ఆఫ్-రోడర్ 2020 థార్ విడుదలకు సిద్ధమవుతోంది. భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో ఎక్కువ కాలం నడుస్తున్న ఎస్యూవీ ఈ థార్ అని మహీంద్రా ప్రకటించింది. ఈ కొత్త మహీంద్రా థార్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ప్రస్తుతం కొనసాగుతున్న మూడవ దశ లాక్డౌన్లో కొన్ని నియమాలతో సడలించబడ్డాయి. కొన్ని సడలింపులతో కొన్ని కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతించింది.
మహీంద్రా నాసిక్లోని తయారీ కేంద్రం సమీపంలో ఇటీవల థార్ ఎస్యూవీకి స్పాట్ టెస్ట్ నిర్వహించింది. లాక్ డౌన్ తర్వాత మహీంద్రా విడుదల చేసిన మొదటి వాహనం థార్ అవుతుంది. త్వరలో ఈ ఎస్యూవీకి బుకింగ్ ప్రారంభించాలని ఆశిస్తున్నాము.
MOST READ:మొబైల్ క్లినిక్లుగా మారిన KSRTC బస్సులు
కొత్త థార్ అనేక కొత్త ఫీచర్లు కలిగి ఉంటుంది. ఇందులో ఫ్లోటింగ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఉన్నాయి.
కొత్త 2020 థార్ లోని కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ దాని బ్రాండ్ సిరీస్, టియువి 300 ఎస్యూవీలోని క్లస్టర్ను పోలి ఉంటుంది. కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో డిజిటల్ డిస్ప్లే యూనిట్తో రెండు అనలాగ్ డయల్లు కలిగి ఉన్నాయి.
MOST READ:రాబోయే రోజుల్లో విడుదల కానున్న 5 కార్లు ఇవే, చూసారా..!
కొత్త మహీంద్రా థార్లో మూడు మోడ్లు ఉన్నాయి. అవి 2 డబ్ల్యుడి (RWD) హై, 4 డబ్ల్యుడి హై మరియు 4 డబ్ల్యుడి అనే మోడ్లు. 2020 మహీంద్రా థార్ ఎస్యూవీని రెండు డోర్ బాడీ స్టైల్స్లో అందించనున్నారు. అవి సాఫ్ట్ టాప్ మరియు హార్డ్ టాప్.
ఎస్యూవీ వెలుపలి భాగంలో జీప్ తరహా డిజైన్ ఉండగా, ఇంటీరియర్ బాగా అప్డేట్ చేయబడింది. థార్ 2.5 లీటర్ డీజిల్ బిఎస్ 4 ఇంజన్ మార్కెట్లో ఉంది. ఈ ఇంజన్ 105 బిహెచ్పి పవర్ మరియు 247 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్బాక్స్తో జతచేయబడి ఉంటుంది.
MOST READ:ప్రజల పొట్టకొడుతున్న కరోనా, ఏమైందో తెలుసా
కొత్త థార్లో బిఎస్ 6, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది 120 బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఫీచర్స్ పెద్ద బాడీ మరియు బలమైన బిఎస్ 6 డీజిల్ ఇంజిన్తో కూడిన కొత్త థార్ మునుపటికంటే కొంత ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. కొత్త 2020 థార్లో 5 స్పోక్ పెద్ద అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ 235 లేదా 245 సెక్షన్ టైర్లతో అందించబడతాయి. కొత్త మహీంద్రా ఎస్యూవీని త్వరలో కొత్త ఫీచర్లతో లాంచ్ చేయనున్నారు.