Just In
- 1 hr ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 5 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 7 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 15 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Movies డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
వాయిదా పడిన 2020 వ్యాలీ రన్ ; అందుబాటులో ఉన్న కొత్త షెడ్యూల్
దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన డ్రాగ్ రేసింగ్ ఈవెంట్ ది వ్యాలీ రన్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దేశంలో ఇప్పటికి ఉన్న కరోనా మహమ్మారి కారణంగా ఈ డ్రాగ్ రేసింగ్ ఈవెంట్ నిర్వాహకులు వచ్చే ఏడాది దీన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ రేసింగ్ ఈవెంట్ యొక్క ఎనిమిదవ ఎడిషన్ డిసెంబర్ 19 మరియు 20 తేదీలలో మహారాష్ట్రలోని అంబి వ్యాలీలో జరగాల్సి ఉంది.
అయితే, స్థానిక పరిపాలన జారీ చేసిన హెచ్చరికలు మరియు ఆంక్షల తరువాత, నిర్వాహకులు షెడ్యూల్ ని 2021 ఫిబ్రవరి 6 మరియు 7 తేదీలకు మార్చారు. ప్రస్తుతం ఈ డ్రాగ్ రేసు వాయిదా వేయడం వల్ల ఈవెంట్ రిజిస్ట్రేషన్ గడువు కూడా పొడిగించబడింది.
కొత్త రిజిస్ట్రేషన్ల గడువు 2021 జనవరి 4 వరకు పొడిగిచబడింది. ఇందులో పాల్గొనాలనుకునే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నిర్వాహకుడి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. డ్రాగ్ రేసు ఎంబి వ్యాలీ యొక్క ప్రైవేట్ ఎయిర్స్ట్రిప్లో జరుగుతుంది.
ఈ ఈవెంట్ కోసం, రెండు స్ట్రిప్స్లో రేస్ ట్రాక్ లు తయారు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు కార్లు మరియు బైక్లతో పాల్గొనవచ్చు. ఈ డ్రాగ్ రేసు స్ట్రైట్ ట్రాక్లో సుమారు ఒక కిలోమీటర్ దూరం ప్రయాణించాలి. ఎవరైతే అతి తక్కువ సమయంలో ఫినిషింగ్ లైన్ చేరుకుంటారో వారు ఈ రేస్ లో విజేతగా ప్రకటించబడతారు.
ఈ రేసులో పాల్గొనే వారు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఇందులో పాల్గొనే పోటీదారుడికి ఒక్కసారి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. దీనికి ల్యాప్ రేసు లేదు. ఈ రేసులో వాహనాన్ని ప్రారంభంలో కూడా సరిగ్గా ప్రారంభించాలి. గతేడాది జరిగిన ఈ రేసు కార్యక్రమానికి 600 మందికి పైగా హాజరయ్యారు.
MOST READ:కుక్క వల్ల అరెస్ట్ అయిన కార్ డ్రైవర్.. ఎందుకు, ఎలాగో మీరే చూడండి ?
డ్రాగ్ రేసింగ్ ఈవెంట్లు వేర్వేరు తరగతులుగా వర్గీకరించబడతాయి. వర్గీకరించినదాని ప్రకారం పాల్గొనే వారు ఇలాంటి వాహనాల ప్రత్యర్థులపై పోటీ పడటానికి సహాయపడతారు. ఇందులో ఏడు ఉప విభాగాలలో 4 వీల్ స్ట్రీట్ పెట్రోల్ వాహనాలు, నాలుగు ఉప విభాగాలలో విదేశీ / సిబియు కార్లు మరియు మరిన్ని ఉన్నాయి. మరోవైపు ద్విచక్ర వాహన విభాగంలో 165 సిసి నుండి 1051 సిసి మరియు అంతకంటే ఎక్కువ బైక్లు ఉన్నాయి.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
కరోనా వైరస్ ప్రపంచంలోని అన్ని రంగాలను ప్రభావితం చేసింది. ఈ కారణంగా అనేవి వాహనాల లాంచ్ లు వాయిదా వేయబడ్డాయి. వాహన లాంచ్ లు మాత్రమే కాదు ఇప్పుడు మోటార్స్పోర్ట్స్ ఈవెంట్లను ప్రభావితం చేస్తుంది. ఏది ఏమైనా ఈ రేసింగ్ ఈవెంట్ తరువాతి తేదీలో నిర్వహించబడుతుందని మేము సంతోషిస్తున్నాము. ఇందులో చాలామంది రేసర్లు పాల్గొంటారు.
MOST READ:హ్యుందాయ్ వెన్యూ ఐఎమ్టి డ్రైవ్ చేస్తూ కనిపించిన టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' [వీడియో]