Just In
- 25 min ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 14 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 16 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 17 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇకపై బస్సులు & ట్రక్కులు కూడా బిఎస్-6 వెర్షన్లోనే అంటున్న భారత్ బెంజ్
ఇండియన్ మార్కెట్లోకి భారత్ బెంజ్ బిఎస్- 6 బస్సులు మరియు ట్రక్కులను ఆవిష్కరించింది. డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ బ్రాండ్ యొక్క కొత్త వాణిజ్య వాహన పోర్ట్ఫోలియోను ప్రకటించింది.
భారతదేశంలో అతిపెద్ద సివి తయాయారుదారులలో ఒకరైన భారత్ బెంజ్ వీరి వాహనాలను బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో వాణిజ్య వాహనాలు కూడా బిఎస్-6 వెర్షన్లో రానున్నాయి.
భారత్బెంజ్ తన కొత్త శ్రేణి ట్రక్కులు మరియు బస్సులను ఇండియన్ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. బిఎస్-VI భారత్బెంజ్ ట్రక్కులు మరియు బస్సులు చాలా తక్కువ మార్పులతో వస్తాయి. డిజైన్ మరియు స్టైలింగ్ విభాగంలో మాత్రం కొన్ని మార్పులు చేయబడ్డాయి.
ఈ వాణిజ్య వాహనాలలో కొత్త గ్రిల్, సాలిడ్ బంపర్స్ మరియు కొద్దిగా పునఃరూపకల్పన చేసిన హెడ్ల్యాంప్స్ ఉంటాయి. పవర్ట్రెయిన్ మరియు ఇంటీరియర్ విభాగాలలో కొంత పెద్ద మార్పులు చేయబడ్డాయి. ట్రక్కులు మరియు బస్సులలో ఉపయోగించే ఇంజిన్ మరియు గేర్బాక్స్ల ఇంజిన్లు సామర్థ్యంలో ఒకే విధంగా ఉంటాయి.
ఇంజిన్ మరియు గేర్బాక్స్ కాన్ఫిగరేషన్లు వేర్వేరు ట్రక్ మరియు బస్ మోడళ్లను బట్టి మారుతూ ఉంటాయి. ట్రక్కులు మరియు బస్సులు ఇప్పుడు బెస్ట్-ఇన్-క్లాస్ కనెక్టివిటీ టెక్నాలజీతో రావడంతో క్యాబిన్ లోపల పెద్ద మెరుగుదల కనిపిస్తుంది. టెలిమాటిక్స్ మరియు కనెక్టివిటీ సొల్యూషన్ లో ప్రాఫిట్టెక్నాలజీ, ప్రోసర్వ్, బస్కనెక్ట్ మరియు ట్రక్ కనెక్ట్ వంటివి ఉన్నాయి.
భారత్ బెంజ్ తమ ట్రక్కుల యొక్క సామర్త్యాన్ని మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి కొత్త టెక్నాలజీపై ఆధారపడుతుంది. యజమానుల యొక్క టర్నోవర్ గరిష్టీకరణకు ప్రాఫిట్ టెక్నాలజీ సహాయపడుతుంది. ఇందులో కస్టమర్ సర్వీస్ ప్లాట్ఫామ్ ‘ప్రోసర్వ్' రూపంలో అతిపెద్ద సాంకేతిక నవీకరణ కలిగి ఉంటుంది.
ట్రూకనెక్ట్ మరియు బస్కనెక్ట్ ఫీచర్స్ ప్రోసర్వ్ ప్లాట్ఫామ్ పరిధిలోకి వస్తాయి. ఇది వినియోగదారులు తమ వాహనాలను ట్రాక్ చేయడానికి మరియు విశ్లేషించడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా విడి భాగాలను ఆర్డర్ చేసుకోవడానికి, పొడిగించిన వారంటీ మరియు రోడ్సైడ్ సహాయాన్ని నిర్వహించడానికి అనుమతిస్తుంది.
ఇందులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అదనంగా వాణిజ్య వాహనాలను నిర్వహించడానికి మరియు ఖర్చు సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. పూర్తిగా కొత్త వాహనాలను రూపొందించడానికి భారత్ బెంజ్ కంపెనీ కృషి చేస్తుంది.