Just In
- 29 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 1 hr ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 3 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 4 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Sports రోహిత్పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Movies ‘సీరియల్స్లో తెలుగు వాళ్లను నీచంగా.. కన్నడ యాక్టర్ల ముందు పని వాళ్లకంటే హీనంగా’
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ఇకపై బస్సులు & ట్రక్కులు కూడా బిఎస్-6 వెర్షన్లోనే అంటున్న భారత్ బెంజ్
ఇండియన్ మార్కెట్లోకి భారత్ బెంజ్ బిఎస్- 6 బస్సులు మరియు ట్రక్కులను ఆవిష్కరించింది. డైమ్లెర్ ఇండియా కమర్షియల్ వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఈ బ్రాండ్ యొక్క కొత్త వాణిజ్య వాహన పోర్ట్ఫోలియోను ప్రకటించింది.
భారతదేశంలో అతిపెద్ద సివి తయాయారుదారులలో ఒకరైన భారత్ బెంజ్ వీరి వాహనాలను బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా తయారు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో వాణిజ్య వాహనాలు కూడా బిఎస్-6 వెర్షన్లో రానున్నాయి.
భారత్బెంజ్ తన కొత్త శ్రేణి ట్రక్కులు మరియు బస్సులను ఇండియన్ మార్కెట్ కోసం ఆవిష్కరించింది. బిఎస్-VI భారత్బెంజ్ ట్రక్కులు మరియు బస్సులు చాలా తక్కువ మార్పులతో వస్తాయి. డిజైన్ మరియు స్టైలింగ్ విభాగంలో మాత్రం కొన్ని మార్పులు చేయబడ్డాయి.
ఈ వాణిజ్య వాహనాలలో కొత్త గ్రిల్, సాలిడ్ బంపర్స్ మరియు కొద్దిగా పునఃరూపకల్పన చేసిన హెడ్ల్యాంప్స్ ఉంటాయి. పవర్ట్రెయిన్ మరియు ఇంటీరియర్ విభాగాలలో కొంత పెద్ద మార్పులు చేయబడ్డాయి. ట్రక్కులు మరియు బస్సులలో ఉపయోగించే ఇంజిన్ మరియు గేర్బాక్స్ల ఇంజిన్లు సామర్థ్యంలో ఒకే విధంగా ఉంటాయి.
ఇంజిన్ మరియు గేర్బాక్స్ కాన్ఫిగరేషన్లు వేర్వేరు ట్రక్ మరియు బస్ మోడళ్లను బట్టి మారుతూ ఉంటాయి. ట్రక్కులు మరియు బస్సులు ఇప్పుడు బెస్ట్-ఇన్-క్లాస్ కనెక్టివిటీ టెక్నాలజీతో రావడంతో క్యాబిన్ లోపల పెద్ద మెరుగుదల కనిపిస్తుంది. టెలిమాటిక్స్ మరియు కనెక్టివిటీ సొల్యూషన్ లో ప్రాఫిట్టెక్నాలజీ, ప్రోసర్వ్, బస్కనెక్ట్ మరియు ట్రక్ కనెక్ట్ వంటివి ఉన్నాయి.
భారత్ బెంజ్ తమ ట్రక్కుల యొక్క సామర్త్యాన్ని మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి కొత్త టెక్నాలజీపై ఆధారపడుతుంది. యజమానుల యొక్క టర్నోవర్ గరిష్టీకరణకు ప్రాఫిట్ టెక్నాలజీ సహాయపడుతుంది. ఇందులో కస్టమర్ సర్వీస్ ప్లాట్ఫామ్ ‘ప్రోసర్వ్' రూపంలో అతిపెద్ద సాంకేతిక నవీకరణ కలిగి ఉంటుంది.
ట్రూకనెక్ట్ మరియు బస్కనెక్ట్ ఫీచర్స్ ప్రోసర్వ్ ప్లాట్ఫామ్ పరిధిలోకి వస్తాయి. ఇది వినియోగదారులు తమ వాహనాలను ట్రాక్ చేయడానికి మరియు విశ్లేషించడానికి అనుమతిస్తుంది. అంతేకాకుండా విడి భాగాలను ఆర్డర్ చేసుకోవడానికి, పొడిగించిన వారంటీ మరియు రోడ్సైడ్ సహాయాన్ని నిర్వహించడానికి అనుమతిస్తుంది.
ఇందులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అదనంగా వాణిజ్య వాహనాలను నిర్వహించడానికి మరియు ఖర్చు సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు. పూర్తిగా కొత్త వాహనాలను రూపొందించడానికి భారత్ బెంజ్ కంపెనీ కృషి చేస్తుంది.