ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

ముంబై నగరం అంటేనే మొదట గుర్తుకొచ్చేవి అక్కడ మనకు కనిపించే బ్లాక్ అండ్ ఎల్లో కలర్ టాక్సీలు. 1980 వ సంవత్సరంలోనే అక్కడ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ టాక్సీలు సర్వసాధారణంగా మారాయి. ముంబైలో ఇప్పటికి ఈ టాక్సీలు ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ఈ టాక్సీలు 1974 లో ముంబైలో ప్రారంభించబడ్డాయి.

ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

అప్పటి నుండి ఈ టాక్సీలు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ముంబైలో వలసదారులతో సహా చాలా మందికి ఉపయోగకరంగా మారాయి. ఇప్పుడు ముంబై మహానగరంలో ఈ టాక్సీల రద్దీని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 2020 నాటికి మిగిలిన టాక్సీలు అన్ని రద్దుచేయబడే అవకాశం కనిపిస్తోంది.

ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

ముంబైలో ఉపయోగిస్తున్న ఈ బ్లాక్ అండ్ ఎల్లో టాక్సీలు ప్రీమియర్ పద్మిని కార్లు. ఇవి రాకముందు ముంబైలో టాక్సీల కంపెనీలు చాలా ఉన్నాయి. ఫియట్ మిలెంటో, ఎలిఫేంట్ టాక్సీ సర్వీస్ లు ముంబైలో కొనసాగాయి.

MOST READ:జెమోపాయ్ మిసో మినీ ఎలక్ట్రిక్ స్కూటర్ : ధర & ఇతర వివరాలు

ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

1960 సంవత్సరం చివరలో, ఫియట్ సూపర్ సెలెక్ట్ మరియు ఫియట్ కార్లు దాదాపు 1100 టాక్సీలుగా ఉపయోగించారు. తరువాత, టాక్సీ సేవలను అందించడానికి ఆస్టిన్స్, హిల్మాన్ మింక్స్ మార్క్ 3, ఫోర్డ్స్ పర్ఫెక్ట్, స్టాండర్డ్ సూపర్ టెన్, చేవ్రొలెట్ ఫ్లీట్ మాస్టర్ మరియు ప్లైమౌత్ పి-10 వంటి వాటిని ఉపయోగించారు. 1972 లో ప్రీమియర్ ప్రెసిడెంట్ మరియు 1974 లో ప్రీమియర్ పద్మిని. ప్రీమియర్ పద్మిని టాక్సీలు 1994 వరకు ప్రాచుర్యం పొందాయి.

ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

తరువాత కొంతకాలానికి ముంబైలోని టాక్సీ డ్రైవర్లు ఈ కార్లలోని ఇంజిన్‌ల స్థానంలో జపనీస్ ఇంజన్లను ఉపయోగించడం ప్రారంభించారు. డీజిల్ ఇంజిన్ కార్లు 1990 లలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ ఇంజిన్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఎక్కువ కాలుష్యం సంభవించింది.

MOST READ:న్యూస్ పేపర్ తో రైల్ నమూనా నిర్మించిన స్కూల్ స్టూడెంట్

ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

వాయు కాలుష్యం పెరిగిన నేపథ్యంలో కమర్షియల్ కార్లలో పాత ఇంజిన్ల వాడకాన్ని బొంబాయి హైకోర్టు నిషేధించింది. ఈ ఆర్డర్ తరువాత, హ్యుందాయ్ సాంట్రో వంటి కార్లు ముంబై టాక్సీ సర్వీసులో బాగా ప్రసిద్ధి చెందాయి.

ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

ప్రీమియర్ పద్మిని కారులో 1089 సిసి కార్బ్యురేటర్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 40 బిహెచ్‌పి శక్తి మరియు 83 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 4-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి వెనుక చక్రాలకు శక్తిని పంపుతుంది.

MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి కొత్త స్కీమ్ : హీరో ఎలక్ట్రిక్

ముంబైలో కనుమరుగు కానున్న ప్రీమియర్ పద్మిని టాక్సీలు, ఎందుకో తెలుసా ?

ప్రీమియర్ పద్మిని గంటకు 0 - 60 కిమీ 27.4 సెకన్లలో వేగవంతం చేస్తుంది. ఈ కారు యొక్క గరిష్ట వేగం గంటకు 125 కి.మీ. ఈ కారు ధర 1974 లో రూ. 30,000. ఇప్పుడు మంచి స్థితిలో ఉన్న ప్రీమియర్ పద్మిని కారు ధర సుమారు రూ. 2 లక్షలు.

Most Read Articles

English summary
Premier Padmini Taxis In Mumbai To Be Scrapped By July 2020. Read in Telugu.
Story first published: Saturday, June 27, 2020, 9:56 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X