Just In
- 14 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 16 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 16 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 18 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News గన్నవరం వైసీపీపై తాజా నివేదిక..వల్లభనేని వంశీ పరిస్థితి ఎలా ఉందంటే..?
- Movies Guppedantha Manasu April 18th: కాలేజీ నుంచి వెళ్లిపోయిన మహేంద్ర.. మను దత్తత.. టెన్షన్లో దేవయాని!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ప్రస్తుతానికి ఇంతే, 300 ఈ-బస్సులు ఇప్పట్లో లేనట్లే!
ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా (ఫేమ్) 2 పథకం కింద 300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే అవకాశం ఇప్పట్లో లేదని బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (బిఎమ్టిసి) ప్రకటించింది.
ఫేమ్ 2 పథకం కింద 300 ఎలక్ట్రిక్ బస్సులను తగ్గించాలని బిఎమ్టిసి అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి శ్రీ లక్ష్మణ సావాడి అలాగే కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ప్రభుత్వ సంస్థల మంత్రి ప్రకాష్ జవదేకర్లకు అభ్యర్థన చేస్తూ, ఇటువంటి వాహనాలపై సబ్సిడీని పెంచాలని బిఎమ్టిసి కోరింది.
300 ఈ-బస్సులకు కిలోమీటరుకు రూ.90 చొప్పున హైదరాబాద్ నుంచి బిడ్డింగ్ తరువాత ఈ అభ్యర్థన తెరపైకి వచ్చింది. డీజిల్తో నడిచే ఎయిర్ కండిషన్డ్ బస్సుల కోసం ప్రస్తుత కిలోమీటరుకు రూ.80 నిర్వహణ వ్యయం కంటే ఇది ఎక్కువ అని బిఎమ్టిసి పేర్కొంది.
MOST READ:వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్
ఈ బస్సులను రాష్ట్ర రవాణా సంస్థలకు లీజుకు ఇవ్వాల్సి ఉంది, ఇందులో తయారీదారులు మూలధన ఖర్చులు మరియు నిర్వహణ ఖర్చులను భరించాలి. ఫేమ్-1 పథకం కింద ప్రవేశపెట్టిన 80 ఎలక్ట్రిక్ బస్సులకు ఇప్పటికే 80 కోట్ల రూపాయల సబ్సిడీని కోల్పోయినట్లు బిఎమ్టిసి తెలిపింది.
ఫేమ్-1 పథకం సమయంలో ఈ 80 బస్సులకు గాను ప్రతి బస్సుకు రూ.1 కోటి సబ్సిడీ ఇవ్వడానికి అనుమతించగా, కిలోమీటరుకు రూ.37 బిడ్ అందుకున్నట్లు బిఎమ్టిసి తెలిపింది.
MOST READ:కొడుకుని కలవడానికి 1800 కి.మీ ప్రయాణించిన నిరుద్యోగ మహిళ ; ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు
అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం సబ్సిడీ మొత్తాన్ని రూ.50 లక్షలకు తగ్గించి బస్సుల సంఖ్యను పెంచింది. కాగా, బిఎమ్టిసి మాత్రం ఈ సబ్సిడీ మొత్తాన్ని రూ.1 కోటికి పెంచాలని డిమాండ్ చేస్తోంది.
కేంద్ర భారీ పరిశ్రమల మరియు ప్రభుత్వ సంస్థల మంత్రిత్వ శాఖకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా పంపిన లేఖ ప్రకారం, "లాక్డౌన్కు ముందు బిఎమ్టిసి 6,500 డీజిల్ బస్సులను నడిపేది, కాగా ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారి కారణంగా కేవలం 2,400 డీజిల్ బస్సులను మాత్రమే నడుపుతోంది. ఇది కార్పోరేషన్కు చాలా నష్టం కలిగించే విషయం."
MOST READ:బైకర్పై పోలీసులకు పిర్యాదు చేసిన జయ బచ్చన్ : ఎందుకంటే ?
సబ్సిడీని రూ.1 కోటికి పెంచినంత కాలం 150 ఈ-బస్సులను ప్రవేశపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని బిఎమ్టిసి తెలిపింది. ఈ మొత్తాన్ని పెంచకపోతే ఆపరేషన్ ఆర్థికంగా సాధ్యం కాదని కార్పొరేషన్ పేర్కొంది.
బిఎమ్టిసి ఈ-బస్సుల నిర్వహణ వైఫల్యంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
డీజిల్ బస్సులతో పోల్చుకుంటే, ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలదే పైచేయిగా మారుతుంది, ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
MOST READ:జెసిబి ప్రమాదంలో బైకర్ ప్రాణాలు కాపాడిన మహీంద్రా బొలెరో; ఎలాగో తెలుసా ?