Just In
- 39 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 59 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- News తెలంగాణ జెన్కో, ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
- Sports Tilak Varma:అతని కోసమే ఆ సంబరాలు! వీడియో
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!
భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్ వాహనాన్ని నిలిపివేసింది. ఎందుకు నిలిపివేసింది అనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!
మారుతి సుజుకి భారత మార్కెట్లో తన సియాజ్ సెడాన్ నుండి డీజిల్ పవర్ట్రెయిన్ను నిలిపివేసింది. మారుతి సియాజ్ డీజిల్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదని కంపెనీ అధికారికంగా తెలిపింది.
మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రైన్ 1.5 లీటర్ నాలుగు సిలిండర్ యూనిట్ రూపంలో వచ్చింది. ఇది 94 బిహెచ్పి మరియు 225 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడింది. ఇది ఏప్రిల్ 2020 నాటికి డీజిల్ ఇంజిన్ లను దశలవారీగా మార్చాలని మారుతి సుజుకి ప్రణాలికను సిద్ధం చేసింది. అంతే కాకుండా బిఎస్ 6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్లకు మంచి డిమాండ్ ఉంటే వారు దానిని చేయగలరని కంపెనీ పేర్కొంది.
డీజిల్ పవర్ట్రెయిన్ను నిలిపివేయడంతో, మారుతి సుజుకి సియాజ్ను ఇప్పుడు ఒకే బిఎస్ 6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్తో అందిస్తున్నారు. ఇది 1.5 లీటర్ యూనిట్ రూపంలో 103 బిహెచ్పి మరియు 138 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.
సియాజ్లో డీజిల్ ఇంజిన్ను నిలిపివేయడం మినహా, ఇతర మార్పులు చేయలేదు. కానీ మారుతి సుజుకి ఇటీవల సియాజ్ ఎస్ అని పిలువబడే సెడాన్ యొక్క స్పోర్టియర్ వెర్షన్ను ప్రవేశపెట్టింది.
కొత్త మారుతి సుజుకి సియాజ్ ఎస్ టాప్-స్పెక్ ‘ఆల్ఫా' వేరియంట్పై ఆధారపడి ఉంటుంది. ఈ వేరియంట్ యొక్క ధర రూ. 10.08 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందించబడుతుంది. కొత్త సియాజ్ ఎస్ సెడాన్ అనేక నవీనీకరణలను పొందింది. ఫీచర్స్ కూడా కొంత వరకు అప్డేట్ చేయబడి ఉంటాయి.
మారుతి సుజుకి సియాజ్ కాకుండా,సుజుకి కొత్త 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను ఎర్టిగా ఎమ్పివిలో కూడా అందిస్తున్నారు. కంపెనీ దీనిని ప్రముఖ విటారా బ్రెజ్జా ఫేస్లిఫ్ట్లో కూడా ప్రవేశపెట్టనుంది. ఇది త్వరలో అమ్మకాలకు సిద్ధం కానుంది. కొత్త మారుతి విటారా బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ పెట్రోల్ను తొలిసారిగా ఆటో ఎక్స్పో 2020 లో ప్రదర్శించారు. అంతే కాకుండా త్వరలో దీనిని విడుదల చేయనున్నారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతీ సుజుకి బిఎస్-6 ఉద్గార ప్రమాణాల తర్వాత డీజిల్ ఇంజిన్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే కొత్త నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజన్లను నవీకరించడానికి అవసరమైన అదనపు ఖర్చులే దీనికి ప్రధాన కారణం. కానీ వీటికి మార్కెట్లో తగినంత డిమాండ్ ఉంటే తరువాతి దశలో బిఎస్ 6-కంప్లైంట్ డీజిల్ యూనిట్ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నమని కంపెనీ పేర్కొంది.