Just In
- 3 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 6 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 9 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 12 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Movies Paarijatha Parvam Review సునీల్, చైతన్య రావు క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే? పారిజాత పర్వం రివ్యూ
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
భారతదేశంలో నిలిపివేయబడిన మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్, ఎందుకో తెలుసా..!
భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుగాంచిన మారుతి సుజుకి ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో సియాజ్ డీజిల్ పవర్ట్రెయిన్ వాహనాన్ని నిలిపివేసింది. ఎందుకు నిలిపివేసింది అనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం!
మారుతి సుజుకి భారత మార్కెట్లో తన సియాజ్ సెడాన్ నుండి డీజిల్ పవర్ట్రెయిన్ను నిలిపివేసింది. మారుతి సియాజ్ డీజిల్ ఇకపై మార్కెట్లో అందుబాటులో ఉండదని కంపెనీ అధికారికంగా తెలిపింది.
మారుతి సియాజ్ డీజిల్ పవర్ట్రైన్ 1.5 లీటర్ నాలుగు సిలిండర్ యూనిట్ రూపంలో వచ్చింది. ఇది 94 బిహెచ్పి మరియు 225 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆరు-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో జత చేయబడింది. ఇది ఏప్రిల్ 2020 నాటికి డీజిల్ ఇంజిన్ లను దశలవారీగా మార్చాలని మారుతి సుజుకి ప్రణాలికను సిద్ధం చేసింది. అంతే కాకుండా బిఎస్ 6 కంప్లైంట్ డీజిల్ ఇంజిన్లకు మంచి డిమాండ్ ఉంటే వారు దానిని చేయగలరని కంపెనీ పేర్కొంది.
డీజిల్ పవర్ట్రెయిన్ను నిలిపివేయడంతో, మారుతి సుజుకి సియాజ్ను ఇప్పుడు ఒకే బిఎస్ 6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజిన్తో అందిస్తున్నారు. ఇది 1.5 లీటర్ యూనిట్ రూపంలో 103 బిహెచ్పి మరియు 138 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ఐదు-స్పీడ్ మాన్యువల్ లేదా నాలుగు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జతచేయబడుతుంది.
సియాజ్లో డీజిల్ ఇంజిన్ను నిలిపివేయడం మినహా, ఇతర మార్పులు చేయలేదు. కానీ మారుతి సుజుకి ఇటీవల సియాజ్ ఎస్ అని పిలువబడే సెడాన్ యొక్క స్పోర్టియర్ వెర్షన్ను ప్రవేశపెట్టింది.
కొత్త మారుతి సుజుకి సియాజ్ ఎస్ టాప్-స్పెక్ ‘ఆల్ఫా' వేరియంట్పై ఆధారపడి ఉంటుంది. ఈ వేరియంట్ యొక్క ధర రూ. 10.08 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందించబడుతుంది. కొత్త సియాజ్ ఎస్ సెడాన్ అనేక నవీనీకరణలను పొందింది. ఫీచర్స్ కూడా కొంత వరకు అప్డేట్ చేయబడి ఉంటాయి.
మారుతి సుజుకి సియాజ్ కాకుండా,సుజుకి కొత్త 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ను ఎర్టిగా ఎమ్పివిలో కూడా అందిస్తున్నారు. కంపెనీ దీనిని ప్రముఖ విటారా బ్రెజ్జా ఫేస్లిఫ్ట్లో కూడా ప్రవేశపెట్టనుంది. ఇది త్వరలో అమ్మకాలకు సిద్ధం కానుంది. కొత్త మారుతి విటారా బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ పెట్రోల్ను తొలిసారిగా ఆటో ఎక్స్పో 2020 లో ప్రదర్శించారు. అంతే కాకుండా త్వరలో దీనిని విడుదల చేయనున్నారు.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మారుతీ సుజుకి బిఎస్-6 ఉద్గార ప్రమాణాల తర్వాత డీజిల్ ఇంజిన్ ను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. ఎందుకంటే కొత్త నిబంధనలకు అనుగుణంగా డీజిల్ ఇంజన్లను నవీకరించడానికి అవసరమైన అదనపు ఖర్చులే దీనికి ప్రధాన కారణం. కానీ వీటికి మార్కెట్లో తగినంత డిమాండ్ ఉంటే తరువాతి దశలో బిఎస్ 6-కంప్లైంట్ డీజిల్ యూనిట్ను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నమని కంపెనీ పేర్కొంది.