Just In
- 11 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 12 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 15 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 17 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టయోటా నుంచి బుకింగ్ కి సిద్దమవుతున్న మరో రెండు కార్లు!
ఇండియాలో ఎక్కువగా కార్లు అమ్ముడవుతున్న సంస్థలలో ఒకటి టయోటా. ఇప్పుడు టయోటా ఇన్నోవా క్రిస్టా బిఎస్ 6 మరియు టయోటా ఫార్చ్యూనర్ బిఎస్ 6 మోడల్స్ జనవరి 6 నుండి బుకింగ్ కోసం అధికారికంగా తెరవబడతాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కానీ అవి ఈ నెల రెండవ వారంలో వచ్చే అవకాశం ఉంది. అయితే డీలర్లు మాత్రం ఇప్పుడే అనధికారికంగా రూ.50 వేల బుకింగ్లను అంగీకరిస్తున్నారు.
టయోటాలో అనధికారిక బుకింగ్లు ప్రారంభమైనట్లు పూణేకు చెందిన డీలర్ ధృవీకరించారు. దేశవ్యాప్తంగా బిఎస్ 6 కి కంప్లైంట్ ఫ్యూయల్ లభించే వరకు టయోటా వేచి ఉండాలని కంపెనీ కోరుకుంటున్నందున ఫిబ్రవరి చివరి లేదా మార్చి ఆరంభానికి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది. కాబట్టి వినియోగదారులు అప్పటిదాకా వేచి చూడాల్సిందే.
డీలర్లు తమ బిఎస్ 4 యొక్క స్టాక్లన్నింటినీ అయిపోయాయని, మరియు ఫార్చ్యూనర్ మరియు ఇన్నోవా మోడళ్లు ఇప్పుడు అత్యధికంగా అమ్ముడయ్యే వాహనాలు అని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు యారిస్ బిఎస్ 6 మోడల్ కోసం కూడా డీలర్లు అధికారికంగా బుకింగ్లను అంగీకరిస్తున్నారు.
ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ భారత మార్కెట్లో టయోటా యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడల్స్. వీటి ధర కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ వాహనాలలో మరింత అధునాతన సెలెక్టివ్ కాటలిటిక్ రిడక్షన్ టెక్నాలజీ మరియు కొత్త డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్ కారణంగా ధరలు సుమారు రూ.1.5 లక్షలు పెరగనున్నాయి.
ఇన్నోవా క్రిస్టా మరియు ఫార్చ్యూనర్ సంస్థ యొక్క భారతీయ పోర్ట్ఫోలియోలో స్థానికంగా తయారు చేయబడిన డీజిల్ వాహనాలు. ఇవి ఏప్రిల్ 2020 నుండి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇప్పుడు సంస్థ యొక్క ఎటియోస్ శ్రేణి కార్లు దశలవారీగా తొలగించబడుతున్నాయి. ఇప్పుడు మనకు యారిస్ మరియు గ్లాంజా మోడళ్లు పెట్రోల్ ఇంజన్లతో మాత్రమే లభిస్తాయి.
టయోటా సంబంధిత వార్తల ప్రకారం సంస్థ యొక్క అత్యధికంగా అమ్ముడైన కారు టయోటా గ్లాంజా అని చెప్పవచ్చు. 2019 జూన్ మరియు మధ్య కంపెనీ మొత్తం 13,824 యూనిట్లను విక్రయించిందని తెలుస్తుంది. ఈ వాహనం కంప్లైంట్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో లభిస్తుంది.
టయోటా ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ కోసం ప్రారంభమయ్యే అధికారిక మరియు అనధికారిక బుకింగ్ల గురించి ఆలోచనలు:
టయోటా ఇన్నోవా మరియు టయోటా ఫార్చ్యూనర్ రెండూ కూడా మార్కెట్లో విజయవంతమయ్యాయి. నగరాల్లో మరియు హైవే రోడ్లపై నడపడానికి ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ రెండు కూడా చాలా అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఇవి మార్కెట్లో చాలా తొందరగా అమ్ముడవుతున్నాయి.
Read More:ఈ వోక్స్వ్యాగన్ బీటిల్ నిజానికి మారుతి స్విఫ్ట్.... మీరే చూడండి?
ఈ విధంగా ఎక్కువగా అమ్ముడవుతున్న రెండు ఎస్యూవీల కోసం అనధికారిక బుకింగ్లను త్వరలో తెరవడం జరుగుతుంది. బుకింగ్ వాల్యూ అనేది ఎప్పటిలాగే ఉంటాయని డీలర్లు ఖచ్చితంగా చెప్పలేరు. కానీ వీటి బుకింగ్ వాల్యూ అధికారికంగా బుకింగ్ ప్రారంభించిన తర్వాతా వెల్లడించే అవకాశం ఉంది. ఏది ఏమైనా వీటికోసం వినియోగదారు ఇంకొంత సమయం ఎదురు చూడాల్సిందే!
Read More:ఇండియాలో ప్రారంభించబోయే బెనెల్లి 302 ఎస్, టిఎన్టి 300 ని భర్తీ చేయనుందా....?