Just In
- 10 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 10 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 11 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 12 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా బాధితుల సహాయం కోసం ఇండియన్ ఆర్మీ మాడిఫై చేసిన బస్
భారతదేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకి మరింత ఎక్కువగా విస్తరిస్తోంది. కరోనా భారిన పడుతున్న వారిని రక్షించడానికి మరియు సహాయం చేయడానికి ఇండియన్ ఆర్మీ ఒక మాడిఫైడ్ చేసిన ఒక బస్సును తయారుచేసింది. ఇండియన్ ఆర్మీ తయారు చేసిన ఈ బస్సు ఏవిధంగా ఉపయోగపడుతుంది అనే దానిని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.. !
దేశంలో కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న రోగులను తీసుకెళ్లేందుకు భారత సైన్యం ఒక బస్సును మాడిఫై చేసింది. ఎడిజి-పిఐ ఇండియన్ ఆర్మీ ట్విట్టర్ లో మాడిఫై చేసిన బస్సు యొక్క చిత్రాన్ని విడుదల చేసింది. ఇది కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది.
ఈ బస్సును వెస్ట్రన్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మాడిఫైడ్ చేసింది. ఇండియన్ ఆర్మీ యొక్క అడిషినల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వారు చేసిన ట్వీట్ ప్రకారం, కోవిడ్ -19 రోగులకు చికిత్స చేయడానికి చేసిన అన్ని మార్పులను డ్రైవర్ మరియు సహ డ్రైవర్ యొక్క భద్రతకు కూడా కట్టుదిట్టమైన చర్యలు త్రీసుకోవడం జరిగింది.
మాడిఫై చేసిన ఈ బస్సులో సింగిల్ ఎంట్రీ, వెంటిలేటర్లతో ట్రీట్మెంట్ చాంబర్ మరియు డ్రైవర్ మరియు కో-డ్రైవర్ వంటివి కూడా ప్రత్యేకనగా తయారుచేయబడింది. ఇందులో భారత సైన్యం యొక్క వెస్ట్రన్ కమాండ్ వైద్య సిబ్బందికి ప్రత్యేక ప్రొటెక్షన్ గేర్ మరియు సామగ్రిని కూడా అందించనుంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 24 న 21 రోజుల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలని ప్రకటించారు. ఈ నేపథ్యంలో భాగంగా దేశంలో భయంకరమైన ఈ కరోనావైరస్ వ్యాప్తి తగ్గించడానికి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించబడింది.
భారతదేశంలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1000 కి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే లాక్ డౌన్ కి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని కోరారు. ఈ లాక్ డౌన్ సమయంలో ఫుడ్ డెలివరీ చేసేవారు, పోలీసులు, మెడికల్స్ వీరు మాత్రం ప్రజలకు బయట ఉండి సేవచేసే అవకాశం కల్పించబడింది.
భారతదేశంలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు తమ తయారీ కేంద్రాల కార్యకలాపాలను నిలిపివేసాయి. కానీ కంపెనీలు పెద్ద ఎత్తున వెంటిలేటర్లు మరియు ఇతర వైద్య పరికరాలను తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. మారుతి సుజుకి, మహీంద్రా మరియు ఇతర సంస్థలు వెంటిలేటర్లు మరియు వైద్య పరికరాల ఉత్పత్తిని ప్రారంభించాయి.
MOST READ: గుడ్ న్యూస్.. లాక్ డౌన్ వల్ల తగ్గిన నగర కాలుష్యం
అంతే కాకుండా ఈ భయంకరమైన వైరస్ ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి సినీ పరిశ్రమవారు, ఆటో మొబైల్ కంపెనీ వారు చాల పెద్ద మొత్తంలో విరాళాలను కూడా అందించడం జరిగింది.
MOST READ:స్పై టెస్టులో కనిపించిన రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350
ఇండియన్ ఆర్మీ మాడిఫైడ్ చేసిన విధంగానే, ఇండియన్ రైల్వే కూడా రైల్ బోగీలను ఐసోలేషన్ గా మార్చడం జరిగింది. ఎందుకంటే కరోనా వల్ల రైల్వే కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయడం వల్ల వీటిని ప్రస్తుత వినియోగిస్తున్నారు.
MOST READ:న్యూ హ్యుందాయ్ వెర్నా ఫేస్లిఫ్ట్ : ధరలు & ఇతర వివరాలు
ఇండియన్ ఆర్మీ మాడిఫై చేసిన ఈ బస్సు ద్వారా ఎక్కువ సంఖ్యలో రోగులకు సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మాడిఫై చేసిన ఈ బస్సు రోగులకు మరింత సులభంగా పరీక్షలు చేయటానికి మరియు తక్షణ వైద్య సహాయం అందించడానికి సహాయపడుతుంది.
MOST READ:లాక్ డౌన్ ఉల్లంఘించిన కర్ణాటక ఎమ్మెల్యే, ఎవరో తెలుసా.. !