Just In
- 1 hr ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 3 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 11 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 17 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Finance Iran-Israel War: స్టాక్ మార్కెట్లపై ఇరాన్-ఇజ్రాయెల్ వార్ ప్రభావం ఇదే..!! జాగ్రత్త..
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీ వలన ఉత్పత్తిలో జాప్యం: సియాం
భారత్-చైనా సరిహద్దుల వద్ద నెలకొన్ని అనిశ్చితి ఆటోమొబైల్ పరిశ్రమపై కూడా పడనుంది. చైనా నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, దేశంలో వాహనాల ఉత్పత్తి ఆలస్యం అవుతుందని భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) ఆందోళన వ్యక్తం చేసింది.
ఓరియంట్ నుండి దిగుమతి చేయబడిన అన్ని విడి భాగాలను ఇప్పుడు మాన్యువల్ తనిఖీలకు లోబడి ఉంటాయి, వీటికి క్లియరెన్స్ సర్టిఫికెట్ రావటంలో ఆలస్యం అవుతుంది. ఈ కొత్త విధానం వలన పరిశ్రమలో ఇప్పటికే అస్థిరమైన సప్లయ్ చైన్పై మరింత ఒత్తిడిని పెంచుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
ఈ విషయంపై సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) ప్రెసిడెంట్ రాజన్ వాధేరా మాట్లాడుతూ, "ఓడరేవు వద్ద రద్దీ కారణంగా క్లియరెన్స్లో అధిక జాప్యం జరగడం, అది చివరికి భారతదేశంలో వాహనాల తయారీని ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికే పరిశ్రమ వృద్ధి తగ్గుముఖంలో ఉంటే, తాజా నిర్ణయంతో వాహనాల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి ఈ వృద్ధి రేటు మరింత క్షీణించే అవకాశం ఉందని" అన్నారు.
MOST READ: ల్యాండ్ రోవర్ డిఫెండర్ హార్డ్టాప్ కమర్షియల్ మోడల్ ఖరారు - వివరాలు
ఆటో కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఎసిఎంఎ) అధ్యక్షుడు మిస్టర్ దీపక్ జైన్ ఈ విషయంపై స్పందిస్తూ.. "ఆటోమోటివ్ వాల్యూ చైన్ చాలా క్లిష్టమైనది, సమగ్రమైనది మరియు పరస్పర ఆధారితమైనది, వాహన తయారీకి అవసరమైన ఒక్క భాగం కూడా లభించకపోయినా వాహన ఉత్పత్తి నిలిచిపోతోంది."
"లాక్డౌన్ తరువాత, వాహన అమ్మకాల పెరుగుదలకు అనుగుణంగా కాంపోనెంట్ పరిశ్రమలో ఉత్పత్తి ప్రక్రియ కూడా క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా నిర్ణయం ఇటు పరిశ్రమకు అటు ఆర్ధికవ్యవస్థకు కలిగే మంచి ప్రయోజనాలకు ఆటంకం కలిగిస్తుందని" ఆయన చెప్పారు.
MOST READ: కొత్త 2020 హీరో ఎక్స్ట్రీమ్ 160ఆర్ విడుదల - ధర, ఫీచర్లు, వివరాలు
భారతదేశంలో ఆటోమోటివ్ సప్లయ్ చైన్ విలువ సుమారు 118 బిలియన్ డాలర్లు, వీటిలో విడిభాగాల దిగుమతులు 4.75 బిలియన్ డాలర్లు, ఇది మొత్తం ఆటో ఇండస్ట్రీ టర్నోవర్లో సుమారు 4 శాతంగా ఉంటుంది.
ఇంజన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్ విడిభాగాలు వంటి కొన్ని క్లిష్టమైన భాగాలను చైనా నుండి దిగుమతి అవుతున్నాయని, దేశీయ భాగాల తయారీదారుల వద్ద ఇప్పటికీ అలాంటి విడిభాగాలు అందుబాటులో లేవని సియామ్ తెలిపింది.
MOST READ: విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?
ఆటోమొబైల్ కంపెనీలు స్థానికంగా తయారు చేసే మోడళ్ల విషయంలో విడిభాగాలన్నీ దాదాపు లోకల్గానే లభ్యమవుతాయి కాబట్టి అలాంటి మోడళ్లు ఈ ప్రభావాన్ని తట్టుకుంటాయి. కాకపోతే, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలపై ఆధారపడిన మోడళ్లు మాత్రం ఉత్పత్తిలో అంతరాయాన్ని ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా ప్రీమియం విభాగంలోని వాహనాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
చైనా నుండి దిగుమతి చేసుకున్న విడిభాగాల మాన్యువల్ తనిఖీపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ఆటోమొబైల్ పరిశ్రమకు ఇది శుభవార్త కాదు. దిగుమతులపై ఆంక్షలు విధించడం వెనుక ఉన్న భావోద్వేగాలను మేము అర్థం చేసుకున్నప్పటికీ, వాటిని దాదాపు తక్షణ ప్రాతిపదికన అమలు చేయడం వలన ఓవైపు కరోనా మహమ్మారి మరోవైపు ఆర్థిక మాంద్యంతో పోరాడుతున్న పరిశ్రమను ఇది ఎక్కువగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని అర్థం చేసుకొని పరిశ్రమను ఆదుకునేందుకు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.