Just In
- 34 min ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- 1 hr ago కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- 3 hrs ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 4 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
Don't Miss
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Movies Yuva Movie Collections పునీత్ రాజ్కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. యువ మూవీకి రికార్డు కలెక్షన్లు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
లాక్డౌన్ ఎఫెక్ట్ : ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రక్కులవల్ల ఎంత నష్టమో తెలుసా.. ?
భారతదేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి ఎక్కువగా విస్తరిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ ప్రకటన వల్ల దేశ వ్యాప్తంగా వాహన సేవలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ క్రమంలో ట్రక్కులు మరియు సరకులు రవాణా చేసే వాహనాలు కూడా రాష్ట్ర సరిహద్దులోని నిలిచిపోవలసి వచ్చింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేయడం వల్ల మొత్తం 21 రోజుల పాటు అన్ని రాష్ట్ర సరిహద్దులు మూసివేయబడ్డాయి. ట్రక్కు డ్రైవర్లు మరియు వస్తువుల రవాణా వాహనాలకు లాక్ డౌన్ పెద్ద సమస్యగా మారింది. కాబట్టి ఈ వాహనాలన్నీ రహదారులపైనే చిక్కుకుపోయాయి.
ఆటో నివేదిక ప్రకారం సుమారు 3.5 లక్షల వస్తువులు మోసుకెళ్ళే ఇంటర్-స్టేట్ ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ట్రక్కులు తీసుకెళ్లే వస్తువులలో కార్లు, బైక్లు, రిఫ్రిజిరేటర్లు, ఎసిలు మరియు ఇతర ఎలక్ట్రికల్ వస్తువులు ఉన్నాయి. అంతే కాకుండా ఇతర పాడైపోయే వస్తువులయిన ఆహారం, పౌల్ట్రీ వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ట్రక్కులు తీసుకెళ్లే వస్తువుల ధర దాదాపు రూ. 35,000 కోట్లకు పైగా ఉంటాయి.
MOST READ: ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నవీన్ పట్నాయక్ నిర్ణయం, అదేంటో తెలుసా.. ?
ఈ లాక్ డౌన్ కారణంగా ఇంత మొత్తంలో సరుకు రవాణా నిలిచిపోవడమే కాకుండా డ్రైవర్లు కూడా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. డ్రైవర్లకు ఆహారం, నీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతే కాకుండా ట్రక్ డ్రైవర్లు తమ ట్రక్కుల్లోని పాడైపోయే వస్తువుల గురించి కూడా ఆందోళన చెందుతున్నారు.
ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ "కుల్తారన్ సింగ్ అట్వాల్" మాట్లాడుతూ ట్రక్కర్లు మరియు వేలాది కోట్ల విలువైన వస్తువులు రోడ్లపైనే ఉండిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేయడానికి వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఆహారం, మెడిసిన్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే ట్రక్కుల ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని అట్వాల్ పేర్కొన్నారు.
MOST READ: కారు కొనడానికి ముందు ఏం చేయాలో తెలుసా.. !
ఇప్పటికే చాలా ట్రక్కులు చెక్పోస్టుల వద్ద చిక్కుకుపోయాయి. చాలా మంది డ్రైవర్లు తమ ట్రక్కులను వదిలి ఇంటికి తిరిగి వెళ్లారని నివేదికలు సూచిస్తున్నాయి.
ట్రక్కర్లు ఇప్పుడు బెయిలౌట్ ప్యాకేజీలు మరియు ఇతర రకాల మద్దతును ప్రభుత్వం నుండి కోరుతున్నారు. రహదారి మరియు వస్తువుల పన్ను చెల్లింపులకు ఆరు నెలల టైమ్ తో పాటు, ఆరు నెలల EMI విరామం మరియు అదే సమయంలో జాతీయ అనుమతుల పొడిగింపును కూడా వారు కోరుతున్నారు.
MOST READ: ఏడు రోజులుగా కారులోనే నిద్రించిన డాక్టర్, ఎందుకో తెలుసా.. ?
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం.. !
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వ్యవధి పొడిగించబడుతుందని చెప్పడంతో, ప్రాథమిక అవసరాలు కూడా లేకుండా, రాష్ట్ర సరిహద్దుల వద్ద చిక్కుకున్న ట్రక్ డ్రైవర్ల దుస్థితి చాలా కష్టంగా మారింది. వీరి దుస్థితిని ప్రభుత్వం పరిశీలిస్తుందని, సహాయక చర్యలు కూడా త్వరలో ప్రకటించాలని ఆశిస్తున్నారు.