Just In
- 1 hr ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 2 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 2 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 4 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
Don't Miss
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్కి స్పోర్ట్స్ కారు..!!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
ట్రక్కులలో స్లీపింగ్ బెర్త్ లు పెట్టించాలంటున్న సిపిఐ ఎంపి బినాయ్ విశ్వం, ఎందుకంటే.. ?
భారతదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సంవత్సరానికి దాదాపు కొన్ని వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటికి పూర్తికా అరికట్టడానికి వీలు లేకపోయినా కొంత వరకు అయినా నివారించడానికి ప్రభుత్వం తనవంతు కృషి చేయాలని సిపిఐ ఎంపి బినాయ్ విశ్వం, కేంద్ర రహదారి రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కోరారు.
సాధారణంగా వాహనదారులు ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు అనుకోకుండా జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో తమిళనాడు తిరుపూర్లో జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో బెంగళూరు, ఎర్నాకుళం నుంచి ప్రయాణిస్తున్న బస్సు రవాణా ట్రక్కును ఢీ కొట్టడంతో 19 మంది ప్రయాణికులు మరణించారన్న విషయం అందరికి తెలిసిందే.
భారతదేశంలో సుదూర ప్రాంతాలకు రవాణా చేయడానికి ట్రక్కులను ఉపయోగిస్తారు. ట్రక్కులు చాలా దూరం ప్రయాణిస్తాయి. కాబట్టి ట్రక్కులకు ఒకే డ్రైవర్ ఉండటం వల్ల కొన్ని అనియంత్రిత కారణాల వల్ల ప్రమాదం జరుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సిపిఐ ఎంపి బినాయ్ విశ్వం ఈ విధంగా చెప్పారు.
సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ట్రక్కులలో కనీసం ఇద్దరు డ్రైవర్లు ఉండేట్లు చూడాలి. అంటే కాకుండా డ్రైవర్లకు నిద్రపోవడానికి ట్రక్కులలో తప్పని సరిగా సదుపాయం కల్పించాలి. దానికి తగిని ఏర్పాట్లు కూడా ట్రక్కులలో కల్పించాలి అన్నారు.
పాలక్కాడ్ ఆర్టీఓ నివేదిక ప్రకారం విశ్వం గడ్కరీకి రాసిన లేఖలో, లారీ డ్రైవర్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని, అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నిద్రలోకి జారుకున్నందున ప్రమాదం జరిగిందని స్పష్టం చేసారు.
మోటార్ వాహన చట్టం నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2018 సవరణకు ముందు, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి రవాణా వాహనాలకు కనీసం ఇద్దరు డ్రైవర్లు అవసరం అవుతుందని నిర్దారించారు. కానీ తరువాత కాలంలో దూర ప్రయాణాలకు కూడా ఒక్క డ్రైవర్ మాత్రమే చేపట్టాలని నిర్ణయించారు. ఈ విధంగా చేయడం వల్ల ఒక డ్రైవర్ బాగా అలసిపోయినప్పుడు ప్రమాదాలు ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది.
మోటార్ వాహన చట్టంలో సరైన మార్పులు చెయాలేకపోతే అమాయక ప్రజలు ఎందరో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని బినాయ్ విశ్వం తెలియజేసారు. రవాణా చట్టాలను కఠినంగా అమలు చేయడం వల్ల భవిష్యత్తులో ఇటువంటి విషాదాల అవకాశాలు తగ్గుతాయి" అని ఆయన చెప్పారు. తప్పని సరిగా ట్రక్కులలో నిద్రపోవడానికి అవసరమైన సదుపాయాలు కూడా కల్పించాలని కేంద్ర రవాణా మంత్రిని కోరారు.