Just In
- 14 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 15 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 16 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారత్లో ఇప్పుడు డీజిల్, పెట్రోల్ కంటే కాస్ట్లీ, ఎక్కడో తెలుసా..!
భారతదేశం అంతటా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు గత రెండు వారాలుగా రోజు రోజుకి పెరుగుదల కనపరుస్తున్నాయి. రోజువారీ ధరల స్థిరమైన పెరుగుదల మధ్య, ఢిల్లీలో డీజిల్ ధరలు మొదటిసారిగా పెట్రోల్ కంటే ఖరీదైనవిగా మారాయి.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో (జూన్ 24, 2020) లీటరు డీజిల్ ధర ఇప్పుడు రూ. 79.88. మునుపటి రోజుతో పోల్చితే డీజిల్ ధర నేడు 0.48 రూపాయల చిన్న పెరుగుదల కనిపించింది. డీజిల్ ధరల పెరుగుదలతో ఇప్పుడు పెట్రోల్ ధర కొంత తగ్గిపోయింది. డీజిల్ ఇప్పుడు ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 79.76 రూపాయలు.
భారతదేశం అంతటా ఇంధన ధరలు రోజువారీగా మారుతూ ఉంటాయి. పెట్రోల్ మరియు డీజిల్ రెండింటి ధరలు జూన్ 7, 2020 నుండి స్థిరంగా పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇంధన పెరుగుదలలు మనం గమనించినట్లయితే గత రెండేళ్ళలో ఇంత ఎక్కువ పెరుగుదల కనిపించలేదు.
MOST READ:ఇండియన్ మార్కెట్లో 73,336 రూపాయలకే హోండా గ్రాజియా
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ నేపథ్యంలో ఇంధన అమ్మకాలు భారతదేశంలో భారీగా పడిపోయాయి. ఇటీవల లాక్ డౌన్ కి కొన్ని సడలింపులు కల్పించడంతో మే మధ్యకాలం నుండి ఇంధనం యొక్క డిమాండ్ బాగా పెరిగింది.
దీనికి సంబంధించిన మునుపటి నివేదికల ప్రకారం, కరోనా లాక్ డౌన్ కాలంలో పెట్రోల్ మరియు డీజిల్ డిమాండ్ వరుసగా 61 శాతం మరియు 56.7 శాతం పడిపోయింది. జెట్ ఇంధనం డిమాండ్ దాదాపు 91% పైగా క్షీణించింది. ఈ విధంగా పడిపోవడానికి ప్రధాన కారణం దేశీయ మరియు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు కూడా మూసివేయబడటమే.
MOST READ:కొత్త బిఎస్ 6 హ్యుందాయ్ ఎలంట్రా డీజిల్ : ధర & ఇతర వివరాలు
ఢిల్లీతో పాటు బెంగుళూరులో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటరుకు రూ .82.35 మరియు లీటరు 75.96 గా ఉన్నాయి. భారతదేశంలోని అనేక ఇతర నగరాలు కూడా రోజువారీ ఇంధనంలో ఇదే విధమైన ధరల పెరుగుదలను ఎదుర్కొంటున్నాయి.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ వ్యవధిలో రెండున్నర నెలల కాలంలో భారతదేశంలో అమ్మకాలు మరియు ఇంధన డిమాండ్ భారీ తేడాతో నష్టపోయింది. ఇప్పుడు కార్యకలాపాలు మరియు వ్యాపారాలు తిరిగి తెరవబడటం మరియు ఎక్కువ మంది వాహనదారులు రోడ్లపైకి రావడంతో పెట్రోల్ మరియు డీజిల్ డిమాండ్ మళ్ళీ సాధారణ స్థాయికి చేసురుకుంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
MOST READ:టాటా నెక్సాన్ ఆక్సిడెంట్ : ఎగిరి బయట పడ్డ ఇంజిన్, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్