Just In
Don't Miss
- News ఓటర్లను బెదిరించిన డీకేపై ఎఫ్ఐఆర్, అయ్యా అలా అనలేదని హైకోర్టులో పిటిషన్, అపార్ట్ మెంట్ లో ?
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పిల్లల హెల్మెట్స్ కోసం భారీగా పెరిగిన డిమాండ్.. ఎందుకో తెలుసా?
ఇటీవల కాలంలో బెంగళూరు నగరంలో పిల్లల హెల్మెట్స్ కోసం డిమాండ్ బాగా పెరుగుతోంది. నగర ట్రాఫిక్ పోలీసులు మరియు ఇతర రవాణా అధికారులు హెల్మెట్లెస్ రైడర్స్ డ్రైవింగ్ లైసెన్స్ను మూడు నెలల నిలిపివేయడం ప్రారంభించినందున ఈ డిమాండ్ పెరిగింది. ఇందులో పిలియన్స్ మరియు నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల హెల్మెట్స్ ఉన్నాయి.
TOI అందించిన నివేదిక ప్రకారం తమ ద్విచక్ర వాహనాలను డ్రైవ్ చేస్తున్నప్పుడు పిల్లలు (నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు) హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని రవాణా అధికారులు పేర్కొన్నారు.
అలాగే, 2019 మోటారు వాహనాల (సవరణ) చట్టం కూడా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం డ్రైవ్ చేస్తే 1000 రూపాయల జరిమానా వసూలు చేస్తుంది, అంతే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ మూడు నెలల వరకు రద్దుచేయబడుతుంది. అయితే, ప్రజల దీనికి వ్యతిరేకత చూపించడం వల్ల, తరువాత జరిమానాను 500 రూపాయలకు తగ్గించారు, కానీ లైసెన్స్ సస్పెన్షన్ నిబంధనను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.
MOST READ:ఆర్సి, డిఎల్ వ్యవధి మళ్ళీ పొడిగింపు ; సెంట్రల్ గవర్నమెంట్
దీనితో, బెంగళూరులోని లాల్బాగ్ రోడ్ మరియు జెసి రోడ్లోని హెల్మెట్ దుకాణాలు అమ్మకాలలో పెరుగుదలను చూస్తున్నాయి. హెల్మెట్ షాప్ ఓనర్స్ కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమ్మకాలు తక్కువగా ఉన్నాయని, ఇటీవల కాలంలో వినియోగదారులు తమ పిల్లల కోసం చిన్న హెల్మెట్స్ కోసం ఇప్పుడు వస్తున్నారు అని తెలిపారు.
పిల్లల కోసం హెల్మెట్ కొనడానికి తల్లిదండ్రులు ఎక్కువ ఆసక్తి చూపించారు. కానీ ప్రమాదాలు జరిగితే పెద్దవారికంటే పిల్లకే ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అంతే కాకుండా ఈ ప్రమాదాలలో ఎక్కువగా గాయాలకు గురవుతారు.
MOST READ:తొలి సూపర్ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ను ప్రారంభించిన ఎమ్జి మోటార్స్; ఎక్కడో తెలుసా?
తల్లిదండ్రులు పిల్లలు హెల్మెట్ ధరించకపోవడానికి మరొక ప్రధాన కారణం పిల్లలకు సరిపోయే రకాలు అందుబాటులో లేకపోవడం. బెంగళూరులోని కొన్ని హెల్మెట్ స్టోర్ యజమానుల ప్రకారం, పిల్లల కోసం కొన్ని రకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, వీటి ధర రూ. 500 నుంచి రూ. 1000 వరకు ఉంటుంది. వీటిలో చాలా తేలికైనవి కావు, కావున పిల్లలు ఎక్కువ సమయం ధరించడానికి అసౌకర్యంగా ఉంటుంది .
కేంద్ర రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం, 2019 లో రోడ్డు ప్రమాదాల వల్ల మొత్తం 11,168 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారని సూచించింది. ఇందులో 460 మంది కర్ణాటక రాష్ట్రానికి చెందినవారు ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహనదారులు అందరూ తప్పకుండా హెల్మెట్ ఉపయోగించుకోవాలి. అప్పుడే ప్రమాదాల నుంచి కొంత వరకు బయట పడే అవకాశం ఉంటుంది.
MOST READ:ఖరీదైన లగ్జరీ కారుకి నిప్పంటించిన యూట్యూబ్ ఛానల్ ఓనర్ ; ఎందుకో తెలుసా ?
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
సిటీలో ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించేలా చూడటానికి ఇది ఒక అద్భుతమైన ఆలోచన. హెల్మెట్ ఒక ముఖ్యమైన ప్రొటెక్షన్ పార్ట్. ఇది పిల్లలతో సహా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న ప్రతి ఒక్కరూ ధరించాల్సిన అవసరం ఉంది. ఇది వారి భద్రతను నిర్ధారిస్తుంది. హెల్మెట్స్ ఏదైనా ప్రమాదం జరిగితే తీవ్రమైన గాయాల నుండి వారిని కాపాడుతుంది.
Note: Images are representative purpose only.