Just In
- 1 hr ago గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- 2 hrs ago భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- 3 hrs ago రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- 5 hrs ago ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
Don't Miss
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Movies Tillu Square Collections సిద్దూ జొన్నలగడ్డ రికార్డుల మోత.. టిల్లు స్క్వేర్ మూవీకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ అంటే?
గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణా సర్కార్ ; ఈ వెహికల్స్ కొనే వారికీ భారీ ఆఫర్స్
ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులుపెడుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం బాగా పెరుగుతోంది. భారతదేశంలో కూడా దాదాపు అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు అమ్మకాలను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల తెలంగాణా రాష్ట్రం కొత్త విధానాన్ని అమలు చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే విధానంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో కొనుగోలు చేసి నమోదు చేసుకున్న మొదటి రెండు లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు 100 శాతం రోడ్ టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపును అందిస్తున్నట్లు స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ తెలిపింది.
2020 నుండి 2030 వరకు అమలులోకి వచ్చే ఈ విధానాన్ని తెలంగాణ మంత్రులు కెటి రామారావు, అజయ్ కుమార్ ఈ రోజు ప్రారంభించారు. ప్రస్తుత పాలనల ప్రకారం రాష్ట్రంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుపై 100 శాతం మినహాయింపు ఇస్తుంది.
MOST READ:నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా
తెలంగాణను EV మరియు ESS (ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్) రంగాలకు ప్రధాన స్థావరంగా మార్చడం మరియు 4.0 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. అంతే కాకుండా 2030 నాటికి 120,000 మందికి ఉపాధి కల్పించడం, షేర్డ్ మొబిలిటీలో EV ల ద్వారా, మౌలిక సదుపాయాల అభివృద్ధి ఈ విధానం ద్వారా జరుగుతాయి.
దీని ద్వారా బ్యాటరీ తయారీకి సైడ్ ప్రోత్సాహకాలను అందించడం, బ్యాటరీ నిల్వ పరిష్కారాల కోసం డిమాండ్ సృష్టించండి జరుగుతుంది. ప్రారంభ దశలో EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు ముందుగానే మద్దతు ఇస్తారు.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే
ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీటెక్నాలజీ మరియు అటానమస్ వాహనాలు వంటి ఇతర అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలలో అత్యాధునిక పరిశోధన మరియు ఆవిష్కరణల కోసం తెలంగాణను అభివృద్ధి చేయాలని ఈ విధానం ద్వారా పిలుపునిచ్చింది. హైదరాబాద్ మరియు ఇతర పట్టణాల్లో స్టార్టింగ్ బ్యాచ్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను దశలవారీగా, స్థానిక సంస్థలు మరియు ప్రైవేట్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సదుపాయం కల్పిస్తుంది.
కేస్ టు కేస్ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం తగిన ప్రయోజనాలను విస్తరించాలి. ప్లాంట్ మరియు యంత్రాలకు రూ. 200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం లేదా 1,000 మందికి పైగా ఉపాధి కల్పించడం, ఈ విధానం ప్రకారం మెగా ప్రాజెక్టుగా వర్గీకరించబడుతుంది.
తెలంగాణ చాలా సమగ్రమైన విధానంతో ముందుకు వచ్చింది. ఎనర్జీ స్టోరీ పాలసీ EV పాలసీతో ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ రెండూ గట్టిగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఐదు సంస్థలతో ప్రభుత్వం శుక్రవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఏది ఏమైనా ఈ విధానం ద్వారా తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ హబ్ గా మారనుంది.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?