Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 12 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అత్యవసర సేవా వాహనాలకు ఫ్రీ సర్వీస్ అంటున్న పిట్స్టాప్
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశం మొత్తం లాక్ డౌన్ చేయబడింది. ఈ నేపథ్యంలో భాగంగా అన్ని రకాల రవాణా సేవలు రద్దు చేయబడ్డాయి. కానీ అత్యవసర సేవలను అందించే వాహనాలకు మాత్రం ఈ లాక్ డౌన్ లో మినహాయింపు ఉంది. ఈ వాహనాలు ఉచిత సేవలను అందించనున్నట్లు పిట్స్టాప్ ప్రకటించింది.
బెంగుళూరులో ప్రధాన కార్యాలయంగా ఉన్న పిట్స్టాప్ కారు మరమ్మతులు మరియు సేవా సంస్థ. సంస్థ వినియోగదారులకు కారు సేవలను అందిస్తోంది.
లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సంస్థ వారు ఫైర్ ట్రక్కులు, పోలీసు వాహనాలు, అంబులెన్సులు మరియు వైద్య సిబ్బందికి ఉచిత సేవలను అందిస్తామని పిట్స్టాప్ తెలిపింది. అత్యవసర సేవలను అవసరమైనప్పుడు 6262621234 కు కాల్ చేయాలని పిట్స్టాప్ పేర్కొంది.
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ముంబై, ఢిల్లీ, నోయిడా, గుర్గావ్ మరియు ఫరీదాబాద్ లలో వాహనాల మరమ్మతులు మరియు సేవలను అందించే ప్రముఖ సంస్థ పిట్స్టాప్. అవసరమైతే టోల్ ఫ్రీ సేవలను కూడా అందిస్తామని, అవసరమైన చోట వాహనాలను మరమ్మతులు చేస్తామని కంపెనీ తెలిపింది.
పిట్స్టాప్ సిఇఓ మరియు వ్యవస్థాపకుడు మిహిర్ మోహన్ మాట్లాడుతూ కరోనాకు వ్యతిరేఖంగా పోరాడుతున్న వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. మా సహాయం కోసం మా టెలిఫోన్ నంబర్ లేదా www.getpitstop.com ద్వారా మాకు తెలియజేయడం ద్వారా మా వాహనాలను ఎప్పుడైనా ఉచితంగా ఉపయోగించవచ్చని ఆయన అన్నారు.
భారత్ మొత్తం 21 రోజులు లాక్ డౌన్ లో ఉన్న నేపథ్యంలో వాహన సేవా కేంద్రాలు మరియు మెకానిక్ షాపులు మూసివేయబడ్డాయి. వాహన మరమ్మతు సమస్య ఏదైనా వచ్చినట్లైతే పిట్స్టాప్ సహాయపడుతుంది. అంతే కాకుండా స్థానిక ప్రభుత్వ అధికారులతో మరియు పోలీసు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా పిట్స్టాప్ తెలిపింది.
MOST READ: కరోనా బాధితుల సహాయం కోసం ఇండియన్ ఆర్మీ మాడిఫై చేసిన బస్