Just In
- 13 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 15 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 16 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 18 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
త్వరలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనున్న ఫెరారీ
నేడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో క్షీణించింది. ఎందుకంటే ప్రమాదకరమైన ఈ వైరస్ ప్రభావం వల్ల చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ వైరస్ ప్రభావం ఒక్క ప్రజల మీద మాత్రమే కాకుండా ఆటో పరిశ్రమపై కూడా పడింది. అంతర్జాతీయ వ్యాపార కార్యకలాపాలు, రవాణా అన్ని నిలిచిపోయాయి. ఈ కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతినింది.
ఈ కరోనా ప్రభావం ఆటో మొబైల్ పరిశ్రమలపై చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్రభావానికి లోనైనా వాటిలో ఒకటి, లగ్జరీ కార్ల తయారీ సంస్థ అయిన ఫెరారీ. సాధారణంగా ఫెరారీ సంస్థ ఇటలీకి చెందినది.
ఫెరారీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్ల తయారీదారులలో ఒకరు. ప్రపంచంలో కరోనా వల్ల చనిపోతున్న బాధితుల సంఖ్య అధికంగా ఉన్న దేశాలలో ఒకటి ఇటలీ.
ఇటలీలో ఇప్పటికే సుమారు 86,500 మందికి కరోనా వైరస్ సోకింది. అంతే కాకుండా ఈ భయంకరమైన ఈ వైరస్ వల్ల ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య 9,000 మందికి పైగా ఉన్నారు. ఎక్కువగా వ్యాపించిన కరోనా వైరస్ వల్ల ఫెరారీ కార్ల ఉత్పత్తి పూర్తిగా నిలిపివేసింది. కరోనా సమస్య రోజురోజుకు తీవ్రతరం అవుతోంది.
ఫెరారీ వచ్చే నెలలో ఇటలీలోని తన తయారీ కర్మాగారంలో కార్ల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనుంది. విడిభాగాలు సరఫరా చేస్తే, ఉత్పత్తిని పునఃప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కరోనా వైరస్ సమస్య వచ్చే నెల మధ్య నాటికి పరిష్కరించే అవకాశం ఉందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
MOST READ:కరోనా నివారణకు 1,500 కోట్లు విరాళం ప్రకటించిన టాటా గ్రూప్స్
ఉద్యోగుల భద్రత మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు అవసరమని కంపెనీ తెలిపింది. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కృషి చేస్తామని కంపెనీ తెలిపింది.అంతే కాకుండా ఉత్పత్తి నష్టాలను రూపుమాపడానికి యోచిస్తున్నట్లు కూడా కంపెనీ తెలిపింది. ఫెరారీ కంపెనీ తన త్రైమాసిక లాభాలను మరియు వాటాదారుల ఫలితాలను మే 4 న ప్రకటించనున్నట్లు తెలిపింది.
MOST READ:కరోనాపై అవగాహన కల్పించడానికి కరోనా హెల్మెట్ ధరించిన పోలీస్