Just In
- 43 min ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 2 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 2 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 16 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
Don't Miss
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Movies ఆరియానా గ్లోరీ ఆత్మహత్యాయత్నం.. ఆ ప్రాబ్లమ్స్ వల్లే అంటూ రాసి మరీ!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మనదేశంలో అక్కడ కమర్షియల్ వాహనాలకు రోడ్ టాక్స్ 50% తగ్గింపు, ఎక్కడో తెలుసా
గోవా ప్రభుత్వం ప్రభుత్వం ఇటీవల స్టేట్ కమర్షియల్ వెహికల్ డ్రైవర్లకు ఉపశమనం కల్గిస్తూ రోడ్ టాక్స్ పై 50 శాతం మినహాయింపు ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి వాణిజ్య వాహనాల రోడ్డు పన్నుపై 50 శాతం మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో గురువారం నిర్ణయించారు.
కరోనా లాక్ డౌన్ కమర్షియల్ వెహికల్ డ్రైవర్లపై ఎక్కువ ప్రభావం చూపిందని దీనికి పరిహారంగా 2021 మార్చి 31 వరకు వాణిజ్య వాహనాలపై రోడ్డు పన్నుపై ప్రభుత్వం 50 శాతం తగ్గింపు ఇస్తోందని ప్రభుత్వం తెలిపింది.
కోవిడ్ -19 మహమ్మారి వాణిజ్యంపై ఎక్కువ ప్రభావం చూపడంతో కేబినెట్ సమావేశంలో దీని గురించి చర్చలు జరిగాయి. వాణిజ్య డ్రైవర్ల డిమాండ్ను వినిపించుకోవాలని సమావేశంలో కేబినెట్ ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది.
కమర్షియల్ వెహికల్ ఆపరేషన్ 2020 మార్చి నుంచి ఆరు నెలల వరకు ప్రభావితమైందని మంత్రివర్గ చర్చలో పేర్కొంది. ఈ కాలంలో, డ్రైవర్లు పనిని ఆపవలసి వచ్చింది, ఇది భారీ నష్టాలను కలిగించింది మరియు ఆదాయాన్ని కూడా ప్రభావితం చేసింది.
MOST READ:మీకు తెలుసా.. అత్యంత ఖరీదైన తెలుగు హీరోల కార్లు, వాటి వివరాలు
రోడ్ టాక్స్ మినహాయింపు కోసం రాష్ట్రంలోని చాలా మంది బస్సులు మరియు ట్రక్ డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారని మంత్రివర్గం తెలిపింది. ఆరు నెలలుగా ఆదాయం లేదని, అందువల్ల చాలా మంది వాహన యజమానులు రోడ్డు పన్ను చెల్లించలేరని చెప్పారు.
తమ రాష్ట్రాల్లోని వాణిజ్య వాహన సంఘాల విజ్ఞప్తిని అనుసరించి అనేక ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రోడ్డు పన్నును మినహాయించాయి. గోవాతో పాటు ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాలు రోడ్డు పన్ను మినహాయింపు ఇచ్చాయి.
MOST READ:వాహనాల వేగపరిమితిని పెంచడానికి ఆసక్తి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?
లాక్ డౌన్ ముగిసిన తర్వాత భారత ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా పుంజుకుంటోంది. వ్యక్తిగత వాహనాలతో పాటు వాణిజ్య వాహనాల అమ్మకాలు దేశంలో మరోసారి పెరగడం ప్రారంభించాయి. కరోనా లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించుకోవడానికి వెనుకడుగువేస్తున్నారు.
ఈ కారణంగా సొంతవాహనాలను కలిగి ఉండాలనే నేపథ్యంలో చిన్న కార్ల డిమాండ్ బాగా పెరిగింది. గత నెలలో మారుతి 1,82,448 ప్యాసింజర్ కార్లను విక్రయించింది. అదే సమయంలో, హ్యుందాయ్ దేశీయ మార్కెట్లో 56,605 యూనిట్ కార్ల అమ్మకాలను నమోదు చేయగా, టాటా మోటార్స్ 23,600 కార్లను విక్రయించి మూడవ స్థానంలో నిలిచింది.
MOST READ:ఒక్క ఫోటో ద్వారా లాక్డౌన్ ఫీలింగ్స్ పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. ఆ ఫోటో మీరు చూడండి