Just In
- 12 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 13 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 14 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 14 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బ్రేకింగ్ న్యూస్.. మోటార్ వెహికల్స్ డాక్యుమెంట్ వాలిడిటీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ?
భారతదేశంలో కరోనా వైరస్ నివారణ కోసం 2020 మార్చి 24 నుంచి లాక్ డౌన్ అమలు చేయబడింది. ఈ క్రమంలో అన్ని రకాల వాహనసేవలు నిలిపివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ రెన్యువల్ వంటి వాటికి ఆటంకం ఏర్పడింది. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లైసెన్స్, రిజిస్ట్రేషన్ మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్ వంటి మోటారు వాహనాలకు సంబంధించిన పత్రాల చెల్లుబాటును ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్ వరకు పొడిగించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన వెల్లడించింది.
ఈ విషయంపై మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన తరువాత, ఈ ఏడాది సెప్టెంబర్ వరకు మోటారు వాహన పత్రాల చెల్లుబాటు తేదీకి పొడిగింపు మంజూరు చేయడంపై అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన చేసింది.
ఫిట్నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేదా మరే ఇతర మోటారు వాహన సంబంధిత డాక్యుమెంట్ యొక్క చెల్లుబాటును మార్చి 30 న విడుదల చేసిన ఇదే విధమైన ఉత్తర్వులను అనుసరిస్తుంది. సాధారణంగా ఈ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్ వాలిడిటీ ఇప్పటికే ముగిసి ఉండాలి. కానీ ఇప్పుడు విడుదల చేసిన ప్రకటన వాహనదారులకు చాలా అనుకూలంగా మారింది.
MOST READ:మీకు తెలుసా.. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ కోసం అమితాబ్ బచ్చన్ వాయిస్
భారతదేశంలో కరోనా వైరస్ ఇప్పటికి ఎక్కువగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రజలందరూ సామాజిక దూరాన్ని పాటించాలని మరియు దీనికి సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి.
కోవిడ్ 19 నివారణ పరిస్థితిని దేశవ్యాప్తంగా ఇంకా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన ప్రయోజనాల కోసం చెల్లుబాటు అయ్యే పత్రాలను సెప్టెంబర్ 30 వరకు ఈ కాలాన్ని పొడిగించాలని సలహా ఇవ్వమని నితిన్ గడ్కరీ తన మంత్రిత్వ శాఖను ఆదేశించారు.
MOST READ:ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఇకపై ఇ-చలాన్ మాత్రమే, ఎక్కడో తెలుసా ?
అదనంగా ఈ ఏడాది మే 21 న మంత్రిత్వ శాఖ ఫీజుల చెల్లుబాటును మరియు అదనపు అమౌంట్ ని సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనలు 1989 లోని రూల్ 32 మరియు రూల్ 81 ప్రకారం 2020 జూలై 31 వరకు సడలించింది.
మోటారు వాహనాల చట్టం 1988 నిబంధనలకు అవసరమయ్యే సడలింపు కోసం ఇతర చట్టాల క్రింద లభ్యమయ్యే ఇతర నిబంధనలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్రాలు కోరినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని వీలుగా ఫీజులు లేదా రెన్యువల్ లేదా ఫైన్ వంటివి మొత్తం మాఫీ చేయడం జరిగింది.
MOST READ:కొత్త లుక్ లో కనిపిస్తున్న మోడిఫైడ్ కాంటెస్సా కారు [వీడియో]