Just In
- 2 min ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 3 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 5 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 13 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
Don't Miss
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, ఇదే కొత్త ధరల జాబితా!
అందరూ ఊహించినట్లుగానే హ్యుందాయ్ కార్స్ ఇండియా లిమిటెడ్ తమ వాహనాల ధరలను పెంచింది. పెరిగిన ధరలు జనవరి 1, 2021వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ అందిస్తున్న క్రెటా, వెన్యూ, వెర్నా, శాంత్రో, గ్రాండ్ ఐ 10 నియోస్, ఔరా మరియు ఐ20 మోడళ్ల ధరలను పెంచింది. మోడల్ను బట్టి వీటి ధరలు రూ.7,521 నుండి రూ.32,880 మేర పెరిగాయి.
హ్యుందాయ్ నుండి అత్యధికంగా అమ్ముడవుతున్న మిడ్-సైజ్ ఎస్యూవీ క్రెటా ధరలు రూ.27,335 మేర పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో దీని ధరలు రూ.9.82 లక్షల నుండి రూ.17.33 లక్షల మధ్యలో ఉన్నాయి. కంపెనీ ఇటీవలే, ఇందులో ఫేస్లిఫ్ట్ వెర్షన్ను మార్కెట్లో విడుదల చేసింది.
హ్యుందాయ్ అందిస్తున్న కాంపాక్ట్ ఎస్యూవీ వెన్యూ ధరను కంపెనీ రూ.25,672 మేర పెంచింది. మార్కెట్లో దీని ధరలు రూ.6.76 లక్షల నుండి రూ.11.66 లక్షల మధ్యలో ఉన్నాయి. గడచిన అక్టోబర్ 2020లో కంపెనీ ఈ మోడల్ ధరలను రూ.5,000 నుండి రూ.12,000 మేర పెంచింది.
MOST READ:కొత్త స్టైల్లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు
హ్యుందాయ్ అందిస్తున్న ప్రీమియం సెడాన్ వెర్నా ధరలను కంపెనీ అత్యధికంగా రూ.32,880 మేర పెంచింది. ప్రస్తుతం మార్కెట్లో దీని ప్రారంభ ధర రూ.9.03 లక్షలుగా ఉంది. ఇకపోతే, హ్యుందాయ్ అందిస్తున్న ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ శాంత్రో ధరను కంపెనీ రూ.9,112 మేర పెంచింది.
హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్బ్యాక్ ధర రూ.8,652 మేర పెరగగా, సిఎన్జి వెర్షన్ ధర రూ.14,556 మేర పెరిగింది. కంపెనీ ఇటీవలే ఇందులో కొత్త వెర్షన్ను ప్రవేశపెట్టింది. స్టాండర్డ్ ఐ10 మోడల్తో పాటుగా కంపెనీ కొత్త ఐ10 నియోస్ అమ్మకాలను కూడా కొనసాగిస్తోంది.
MOST READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి
హ్యుందాయ్ ఎక్సెంట్ స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు వచ్చిన సరికొత్త మోడల్ ఔరా ధరను కూడా కంపెనీ పెంచింది. హ్యుందాయ్ ఔరా కాంపాక్ట్ సెడాన్ ధర రూ.11,745 మేర పెరగగా, సిఎన్జి వెర్షన్ ధర రూ.17,988 మేర పెరిగింది.
హ్యుందాయ్ తాజాగా మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త 2020 మోడల్ ఐ20 ప్రీమియం హ్యాచ్బ్యాక్ ధరలను మాత్రం కంపెనీ స్వల్పంగా పెంచింది. రూ.7,521 మేర కంపెనీ ఈ మోడల్ ధరలను పెంచింది. హ్యుందాయ్ లైనప్లో అత్యల్ప ధరల పెరుగుదలను అందుకున్నది ఐ20 మాత్రమే.
MOST READ:ఇంద్రభవనం లాంటి విమానం.. ఇది చూస్తే ఒక్కసారైనా వెళ్లాలనిపిస్తుంది.. ఓ లుక్కేసెయ్యండి
హ్యుందాయ్ మోటార్ ఇండియా, అనుబంధ సంస్థ అయిన కియా మోటార్స్ కూడా జనవరి 2021 నుండి ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కియా మోటార్స్ ప్రోడక్ట్ లైనప్లో కార్నివాల్ మినహా ఇతర మోడళ్ల ధరలు పెరిగే అవకాశం ఉంది.
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న సప్లయ్ చైన్, ప్రభావితమైన దిగుమతులు, పెరిగిన ముడిపదార్థాల ధరలు మరియు పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులు మొదలైన కారణాల వలన కొత్త సంవత్సరంలో ఆటోమొబైల్ కంపెనీలు ధరల పెంపుకు సిద్ధమవుతున్నాయి.
MOST READ:రూ. 41,500 జరిమానాతో సీజ్ చేయబడిన డ్యాన్స్ స్కార్పియో ; కారణం ఏంటో తెలుసుకోండి