Just In
- 34 min ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 2 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
- 3 hrs ago సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- 6 hrs ago 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
Don't Miss
- News AP Volunteers: 62 వేలకు చేరిన వాలంటీర్ల రాజీనామాలు-ఈసీకి హైకోర్టు కీలక ఆదేశం.. !
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Movies నీకెంత బలుపు? ఆర్కే నాయుడుపై సీనియర్ నటి సీరియస్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
హ్యుందాయ్ కంపెనీ ఫస్ట్ మినీ ఎలక్ట్రిక్ బస్
దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన వాహన తయారీదారు హ్యుందాయ్ మోటార్స్ భారత మార్కెట్లో ఇప్పటికే చాల వాహనాలను విడుదలచేసింది. హ్యుందాయ్ బ్రాండ్ వాహనాలు ఎక్కువ ప్రజాదరనను కూడా పొందాయి. ఇటీవల కాలంలో కంపెనీ ఎలక్ట్రిక్ మినీ బస్సును విడుదల చేసింది. హ్యుందాయ్ కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.
హ్యుందాయ్ మోటార్ తన మొదటి ఎలక్ట్రిక్ మినీ బస్సుకు కంట్రీ ఎలక్ట్రిక్ అని పేరు పెట్టింది. డీజిల్ ఇంజిన్ బస్సుల కంటే ఆర్థికంగా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఈ మినీ బస్సును ఇటీవల సంస్థ విడుదల చేసింది.
హ్యుందాయ్ కంట్రీ ఎలక్ట్రిక్ బస్సులో 15 నుండి 33 సీట్లు ఉన్నాయి. ఈ మినీ బస్సు పొడవు 7,710 మిమీ వరకు ఉంటుంది. ఈ మినీ ఎలక్ట్రిక్ బస్సులో128 kWh లిథియం-అయాన్ బ్యాటరీ అమర్చారు. ఈ బ్యాటరీ ఈ మినీ ఎలక్ట్రిక్ బస్సుకు శక్తినిస్తుంది.
MOST READ:ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన కెటిఎమ్
ఈ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయితే, కంట్రీ ఎలక్ట్రిక్ మినీ బస్సు దాదాపు 250 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ తెలిపింది. ఈ బ్యాటరీని ప్రామాణిక కాంబో 1 డిసి సిస్టమ్ కలిగి ఉండటం వల్ల కేవలం 72 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
హ్యుందాయ్ కంట్రీ ఎలక్ట్రిక్ బస్సులోని బ్యాటరీని హోమ్ అవుట్లెట్లలోని 220-వోల్ట్స్ నుండి ఛార్జ్ చేయవచ్చు. కానీ ఈ విధంగా ఛార్జ్ చేయడానికి 17 గంటలు పడుతుంది. 220 వోల్ట్స్ హోమ్ ఛార్జర్తో ఈ బస్సుకు హ్యుందాయ్ ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది.
MOST READ:విధి నిర్వహణలో ఉన్న పోలీసును తన్నిన మాజీ MP, ఎవరో తెలుసా ?
హ్యుందాయ్ ప్రస్తుతం ఈ బస్సును దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రమే విడుదల చేసింది. కొత్త ఎలక్ట్రిక్ మినీ బస్సు డీజిల్ బస్సుల కంటే 30% వేగంగా ఉందని హ్యుందాయ్ ప్రకటించింది.
ఈ బస్సులో ఎసి, ఎయిర్ ఓవర్ హైడ్రాలిక్స్ బ్రేక్ సిస్టమ్స్ ఉన్నాయి. హ్యుందాయ్ ఈ బస్సును అధునాతన పద్ధతిలో నిర్మించింది. అంతే కాకుండా కంపెనీ ఈ బస్సు యొక్క డోర్స్ దగ్గర రకరకాల సెన్సార్లను ఏర్పాటు చేసింది.
MOST READ:డీలర్షిప్ చేరుకున్న కొత్త ట్రయంఫ్ టైగర్ 900 బైక్
ప్రయాణీకులు దిగినప్పుడు లేదా బస్సు ఎక్కేటప్పుడు ఈ సెన్సార్లు డోర్స్ మూసుకోవు. బదులుగా వారు ప్రయాణీకులను సులభంగా ఎక్కడానికి మరియు దిగడానికి అనుమతించబడుతుంది. ప్రయాణీకులు డోర్స్ మధ్యకు వస్తే సెన్సార్లు వెంటనే డోర్స్ ఓపెన్ చేసే విధంగా చేస్తాయి. సోదాహరణంగా ఎలక్ట్రిక్ బస్సుల వల్ల వాయు కాలుష్యం జరగదు. అంతే కాకుండా ప్రపంచం అభివృద్ధి వైపు పరుగులుపెడుతున్న తరుణంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తప్పనిసరి కూడా..!