Just In
- 15 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 16 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 17 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News ముగిసిన నామినేషన్ల పర్వం: బండి సంజయ్ సహా చివరి రోజు నామినేషన్లు వేసింది వీరే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Movies బాయ్ ఫ్రెండ్తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కొత్త స్కీమ్ ప్రవేశపెట్టిన గవర్నమెంట్.. అదేంటో తెలుసా !
ప్రపంచదేశాలు అభివృద్ధివైపు నడుస్తున్న తరుణంలో మనదేశం కూడా రోజు రోజుకి అభివృద్ధి సాధిస్తూనే ఉంది. ఈ తరుణంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్య సమస్యను పరిష్కరించగలదు.
అంతే కాకుండా ముడి చమురు దిగుమతులను తగ్గించవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఫేమ్ ఇండియా స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వడం సహా పలు పథకాలను అమలు చేసింది. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఖరీదైనవి. సబ్సిడీ ఇస్తే ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనడం సులభతరం చేస్తుంది.
కానీ భారతదేశంలో తగిన సంఖ్యలో ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు లేవు. దీనివల్ల ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడానికి వెనుకాడుతున్నారు. ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కువ ఉన్నప్పుడు ఈ సమస్య ఉండే అవకాశం ఉండదు.
MOST READ:ఇల్లుగా మారిన ఇన్నోవా కారు.. చూసారా..!
ఈ సమస్యను పరిష్కరించడానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రణాళికను ముందుకు తెచ్చింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే వారికి 20% లేదా రూ. 10 లక్షలు సబ్సిడీ ఇవ్వడానికి కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది.
రెండింటిలో పెద్దది సబ్సిడీ. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఖర్చవుతుంది. సబ్సిడీ ఇస్తే ప్రజలు ఛార్జింగ్ స్టేషన్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని అధికారులు భావిస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్ల కొరతను తీర్చడానికి త్వరలో ఈ ప్రాజెక్టును ప్రభుత్వ అనుమతి కోసం పంపుతామని అధికారులు చెబుతున్నారు.
MOST READ: ఈ స్టార్ కపుల్స్ పెళ్లి రోజు కొన్న కారు ధర రూ. 2.65 కోట్లు.. ఇంతకీ వారు ఎవరో తెలుసా ?
ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రకటించిన మొదటి రాష్ట్రం కర్ణాటక. 2017 లో కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విధానం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది బెంగుళూరును భారత ఎలక్ట్రిక్ వాహనానికి రాజధానిగా మారుస్తుందని అంటారు. అప్పటి నుండి కర్ణాటక ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిలో పెద్దగా పురోగతి సాధిస్తోంది. బెంగుళూరులో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాలు లేకపోవడం దీనికి ఒక సమస్యగా మారింది.
ఛార్జింగ్ స్టేషన్లు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ విషయాన్నీ ET ఆటో నివేదించింది. ప్రభుత్వం సబ్సిడీ ప్రణాళికను ఆమోదిస్తే, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ముందుకు వస్తారు. ఎక్కువ సంఖ్యలో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పినట్లైతే ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కూడా కొంత పెరిగే అవకాశం ఉంది.
MOST READ:కెమెరాకు చిక్కిన రెడ్ కలర్ ఫోర్స్ గూర్ఖా.. ఇది నిజంగా సూపర్ లుక్ గురూ..!
గమనిక: ఈ ఫోటోలు కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే.