Just In
- 3 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 5 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 13 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 19 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- News వల్లభనేని వంశీకి షాకిచ్చేలా యార్లగడ్డతో చంద్రబాబు వ్యూహం!!
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Finance Medicines News: కిరాణా కొట్టులో మందుల విక్రయం.. మోదీ సర్కార్ సంచలన నిర్ణయం..!!
- Lifestyle ప్రాణాలకు ముప్పు ఉందని తెలిపే హీట్ స్ట్రోక్ లక్షణాలు
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
లెక్సస్ ఇండియా వినియోగదారులకి గుడ్ న్యూస్, అదేంటో తెలుసా..?
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలన్నింటిని పట్టి పీడిస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి మద్దతుగా చాలా ఆటో పరిశ్రమలు ప్రభుత్వంతో చేతులు కలిపాయి. అంతే కాకుండా చాలా కంపెనీలు తమ వినియోగదారులకు అనేక విధాలుగా సహాయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో లెక్సస్ కంపెనీ కూడా ఒక అడుగు ముందుకు వేసింది.
లెక్సస్ ఇండియా విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం తమ వినియోగదారుల వాహనాల యొక్క వారంటీని పొడిగించడమే కాకుండా సర్వీస్ టైం ని కూడా పొడిగించినట్లు తెలిపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా సర్వీస్ చేయలేని వినియోగదారులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. అదనంగా వారంటీ వ్యవధిని కూడా పొడిగించబడింది.
లెక్సస్ ఇండియా యొక్క సర్వీస్ టైమ్ ని మే 31 వరకు పొడిగిస్తామని ప్రకటించింది. అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో గడువు ముగిసే కస్టమర్ల కోసం ఈ వ్యవధి వచ్చే నెల చివరి వరకు పొడిగించబడుతుంది.
MOST READ:కొత్త డిజైన్తో రానున్న టయోటా యారిస్ క్రాస్ ఎస్యువి
ఈ కాలంలో వినియోగదారులకు సర్వీస్ చేయాలని డీలర్లను లెక్సస్ కోరారు. ఇతర కంపెనీల మాదిరిగానే లెక్సస్ కూడా తన వినియోగదారులకు సహాయం చేస్తోంది. మిగతా కంపెనీలు కూడా తమ డీలర్లకు పరిహారం చెల్లించాయి.
లెక్సస్ ఇండియా దీనికి సంబంధించిన ఈ సమాచారాన్ని తన అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. వినియోగదారులు తమ సమీప డీలర్లను సందర్శించడం ద్వారా దీని గురించి సమాచారం పొందవచ్చు. సంక్షోభం సంభవించినప్పుడు లెక్సస్ తన వినియోగదారులకు అన్ని విధాలుగా సహాయం చేయనున్నట్లు ప్రకటించింది.
MOST READ:భారత ప్రభుత్వానికి మద్దతుగా టాటా మోటార్స్, ఏం చేసిందంటే ?
కంపెనీ వినియోగదారులకు తమ మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది. ప్రస్తుతానికి వినియోగదారులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని కంపెనీ ప్రకటించింది. కోవిడ్ -19 విషయంలో అన్ని కార్ల కంపెనీలు తమ వినియోగదారులకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి.
లెక్సస్ ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లెక్సస్ ఎల్సి 500 హెచ్ కారును ఆవిష్కరించింది. ఇది కంపెనీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనం. లెక్సస్ సంస్థ ఇప్పుడు హైబ్రిడ్ వాహనాల ఉత్పత్తిపై దృష్టి పెట్టింది.
MOST READ:లారా దత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నడపడం చూసారా ?
కరోనా కారణంగా ప్రస్తుతం వాహనాల ఉత్పత్తి నిలిపివేయబడింది. ఉత్పత్తిని ప్రారంభించడానికి కంపెనీలకు పాక్షికంగా అనుమతి ఉంది. లాక్ డౌన్ పూర్తిగా తొలగించబడిన తరువాత వాహనాల ఉత్పత్తి తిరిగి ప్రారంభిస్తామని కూడా తెలిపింది. కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరిస్తున్న కారణంగా బహుశా ఈ లాక్ డౌన్ ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తోంది.