Just In
- 33 min ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 14 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 15 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 18 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
Don't Miss
- News ఎన్నికల ప్రచారానికి నేటితో తెర: ఈ రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Movies కట్టె పుల్లకు చీరకట్టినా.. మగాళ్ల ప్రవర్తనపై బిగ్బాస్ బ్యూటీ హిమజ హాట్ కామెంట్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విమానయాన సంస్థకు సమస్యగా మారిన మిడతలు
కరోనా వైరస్ మహమ్మారి నుంచి భారత్ బయట పడక ముందే మరో కష్టం ఎదురైంది. ప్రస్తుతం భారతదేశంలో ప్రవేశించిన మిడతలు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ మిడతలు ప్రస్తుతం రైతులకు మాత్రమే కాకుండా విమానాలకు కూడా ప్రమాదం కలిగిస్తాయి.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిర్లైన్ పైలట్లు మరియు ఇంజనీర్లకు సర్క్యులర్ జారీ చేసింది. మిడతల సమూహం విమానాలకు ప్రమాదకరమని డిజిసిఎ నివేదించింది. మిడత కిందికి ఎగురుతుంది. ఈ కారణంగా టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది.
21 సంవత్సరాల తరువాత ఈ ఎడారి మిడతల సమస్యను భారత్ ఎదుర్కొంటోంది. పాకిస్తాన్ ద్వారా ఎడారి మిడతలు బృందం రాజస్థాన్లోకి ప్రవేశించాయి. తరువాత ఇది పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్ వరకు వ్యాపించింది. ఇవి ఎక్కడికి వెళ్లినా పంటలను నాశనం చేస్తున్నాయి.
MOST READ:కరోనా ఎఫెక్ట్ : క్యాబ్లలో AC వాడకం నిషేధం, ఎందుకో తెలుసా !
సాధారణంగా మిడతలు భూమి యొక్క ఉపరితలానికి దగ్గర ఎగురుతాయి. ఇది ఎక్కువ ప్రమాదం కలిగిస్తుందని సర్క్యులర్ తెలిపింది. ఈ సందర్భంలో పైలట్లు టేకాఫ్ చేసేటప్పుడు లేదా ల్యాండింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెబుతారు.
విమానం సమీపించగానే మిడుతలు విమానంలోకి ప్రవేశించే అవకాశం ఉందని కూడా సర్క్యులర్ పేర్కొంది. మిడత ఇంజిన్ ఎయిర్ కండీషనర్ ప్యాక్ మరియు కార్గోను దెబ్బతీస్తుంది.
MOST READ:కవాసకి నింజా 1000 SX బైక్ : ధర & ఇతర వివరాలు
మిడత విమానాల వైర్లెస్ కనెక్టివిటీ, విండ్ స్పీడ్ మరియు డైరెక్షన్ డిటెక్షన్ పరికరాలను కూడా దెబ్బతీస్తుందని డిజిసిఎ సర్క్యులర్ పేర్కొంది. ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వానికి అత్యవసర ప్రణాళికను అమలు చేయాలని కోరుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్కు పిటిషన్ దాఖలైంది.
NGO దాఖలు చేసిన పిటిషన్లో, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు అత్యవసర ప్రణాళికలు ఉన్నప్పటికీ ఫిబ్రవరి నుంచి మిడతల దాడిని ఎదుర్కొంటున్నాయని, అనేక ప్రాంతాల్లో పరిస్థితి మరింత దిగజారిందని అన్నారు. కరోనా వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుండగా, ఇప్పుడు అనుకోని ఉపాంతం భారతదేశంపై పడింది. ఈ మిడతలు రైతులకు చాలా ఇబ్బందులను కల్గించడమే కాకుండా పంటలు మొత్తాన్ని నాశనం చేస్తున్నాయి.