Just In
- 8 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 9 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 10 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 11 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టెస్లా కార్ కంపెనీని భారత్కు ఆహ్వానించిన టెస్లా; ప్లాంట్ కూడా అక్కడేనా?
ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' వచ్చే ఏడాది భారత్లోకి ప్రవేశించినున్నట్లు తెలుగు డ్రైవ్స్పార్క్ ఇదివరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, తాజాగా ఇందుకు సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం టెస్లాను భారత్కు రావల్సిందిగా ఆహ్వానించింది.
దేశంలో పెట్టుబడులు పెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం టెస్లా అధికారులను కోరింది. ఈ మేరకు టెస్లా అధికార ప్రతినిధులతో కంపెనీ ఓ సమావేశాన్ని కూడా నిర్వహించింది. మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఆయన చేసిన ట్వీట్ ప్రకారం, రాష్ట్రంలో పెట్టుబడుల గురించి చర్చించడానికి ఆయన, రాష్ట్ర పరిశ్రమల మంత్రి సుభాష్ దేశాయ్ గురువారం టెస్లా బృందంతో వీడియో కాల్ ద్వారా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
MOST READ:68 ఏళ్ల వయసులో అందరిని ఆశ్చర్యపరిచిన వృద్ధ మహిళ.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా?
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలదే పైచేయిగా మారుతుందని, ఇందుకు సంబంధించిన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు, పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.
మరోవైపు టెస్లా పరిశ్రమను దేశానికి రప్పించేందుకు ఇతర రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నాయి. ఇటీవలి కథనాల ప్రకారం, టెస్లా భారతదేశంలో తమ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని (ఆర్ అండ్ డి) ఏర్పాటు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వంతో కూడా చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం.
MOST READ:అశోక్ లేలాండ్ నుంచి రెండు కొత్త వెహికల్స్ లాంచ్ : ధర & ఇతర వివరాలు
దేశంలో అంకితమైన ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని ప్రకటించిన తొలి భారత రాష్ట్రం కర్ణాటక. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు ప్రభుత్వం నుండి రాయితీలను ఇవ్వడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు యాజమాన్య వ్యయాన్ని తగ్గించడమే ఈ రాష్ట్రం యొక్క ప్రధాన లక్ష్యం. బెంగుళూరు కేంద్రంగా ఇప్పటికే అనేక ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
తమిళనాడు రాష్ట్రం కోసం టెస్లా కంపెనీ భారత్కు ఆహ్వానించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి, టెస్లా సిఇఒ ఎలన్ మస్క్తో సహా 11 మంది గ్లోబల్ ఆటోమోటివ్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్లను తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు.
MOST READ:సైకిల్ రిపేర్ షాప్ ఓనర్ తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్.. ఎలా ఉందో చూసారా ?
కాగా, టెస్లా సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ భారత్లోకి ప్రవేశించడాన్ని పరోక్షంగా ధృవీకరించారు. ఎలన్ మస్క్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, వచ్చే ఏడాది భారత మార్కెట్లో టెస్లా కార్లను విడుదల చేస్తామని సమాధానమిచ్చారు.
టెస్లా క్లబ్స్ ఇండియాలో ఓ టీ-షర్టు ఫొటోను పోస్టు చేశారు, ఆ టీ-షర్టుపై ‘ఇండియా వాంట్స్ టెస్లా' అని ప్రింట్ చేయబడి ఉంది. దీనిని గుర్తించిన ఓ అభిమాని, అంటే దీనర్థం భారత్కు టెస్లా వస్తుందనా? అయితే ఎప్పుడు? అని ప్రశ్నించ ఎలోన్ మస్క్ ‘వచ్చే ఏడాది ఖచ్చితంగా' అంటూ సమాధానం ఇచ్చారు.
MOST READ:హ్యుందాయ్ ట్యుసాన్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ ; ఫీచర్స్ & ఇతర వివరాలు
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టాప్ ఎలక్ట్రిక్ ఆటోమోటివ్ తయారీదారుల్లో టెస్లా మార్కెట్ లీడర్గా ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), అటానమస్ డ్రైవింగ్, సుధీర్ఘ బ్యాటరీ రేంజ్, విలాసవంతమైన ఫీచర్లు, ధృడమైన నిర్మాణం వంటి ఎన్నో విశిష్టలతో టెస్లా ఎలక్ట్రిక్ కార్లు తయారవుతాయి.
మహారాష్ట్ర ప్రభుత్వం టెస్లా ఎలక్ట్రిక్ కార్ కంపెనీని భారత్కు ఆహ్వానించడంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
టెస్లా కార్ కంపెనీ భారత్కు రావటమే ఓ పెద్ద విశేషం. అలాంటి, ఈ కార్ కంపెనీ భారత్లో ఏ రాష్ట్రానికి వచ్చినా సంతోషమే. మహారాష్ట్రలో టెస్లా ఏర్పాటు కావల్సిన అన్ని మౌళిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీతో మహారాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు సఫలమైతే, వచ్చే ఏడాది నాటికి భారత రోడ్లపై టెస్లా కార్లు పరుగులు పెట్టే ఆస్కారం ఉంది.