Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన మహీంద్రా
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఆటో దిగ్గజం మహీంద్రా & మహీంద్రా దేశంలో COVID-19 కి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇస్తున్న కామపెనీలలో ముందున్న వారిలో ఒకరు. కరోనా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి కరోనా వైరస్ మహమ్మారిపై పోరాడటానికి మహీంద్రా కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తుంది.
దేశవ్యాప్తంగా వెంటిలేటర్లు మరియు ఇతర పిపిఇ పరికరాల ఉత్పత్తి మరియు పంపిణీని పెంచడానికి సంస్థ వివిధ ఇతర సంస్థలతో కలిసి పనిచేస్తోంది. మహీంద్రా కంపెనీ ఫేస్ మాస్క్లు, ఫేస్ షీల్డ్స్ మరియు ఏరోసోల్ బాక్స్ల వంటి వాటిని వైద్య నిపుణులు మరియు ఆరోగ్య సంరక్షణ అధికారులకు పంపిణీ చేస్తోంది. మహీంద్రా కూడా పేదవారికి వివిధ ప్రదేశాలలో నిరాశ్రయులకు మరియు వలస కూలీలకు ఫుడ్ ప్యాకెట్లను కూడా విరాళంగా ఇచ్చారు.
మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ఇటీవల తన సహచరుల కృషికి ఫలితంగా వారిని మహీంద్రా యొక్క COVID-19 యోధులు అని పిలిచారు. గత మూడు నెలల్లో 4 లక్షల ఫేస్ షీల్డ్స్, 12 లక్షల ఫేస్ మాస్క్లు మరియు 600 కి పైగా ఏరోసోల్ బాక్సులతో పాటు, అవసరమైన వారికి 2.5 లక్షల భోజనం పంపిణీ చేయగలిగింది.
MOST READ:డామినార్ 250 బైక్ టివిసి విడుదల చేసిన బజాజ్ ఆటో
ఇటీవల మహీంద్రా 12 మొబైల్ అంబులెన్స్లను మహారాష్ట్రలోని ముంబై నగరంలో కరోనా బాధితుల సేవలకు అందించింది. COVID-19 రోగులు చికిత్స మరియు వైద్య సదుపాయాలను వేగంగా పొందగలిగేలా కొత్త మహీంద్రా సుప్రో అంబులెన్స్లను రాష్ట్రంలో పంపిణీ చేసింది. ఈ ఆంబులెన్సుల ద్వారా వేగవంతమైన వైద్య సేవలు అందించగలుగుతున్నారు.
ఈ అంబులెన్స్లను ఆదిత్య ఠాక్రేకు అందజేశారు. మహీంద్రా భారత మార్కెట్లో సుప్రో అంబులెన్స్ను లాంచ్ చేయడానికి కూడా ముందడుగు వేసింది. మొదటి బ్యాచ్ అంబులెన్సులను మహారాష్ట్రలో ఇప్పటికే పంపిణీ చేయడం జరిగింది.
MOST READ:భారత్ & చైనా వివాదం : ఆలస్యమైన హైమా బర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ లాంచ్
మహీంద్రా కంపెనీకి సంబంధించిన ఇతర నివేదికల ప్రకారం మహీంద్రా ఎక్స్యువి 500, స్కార్పియో మరియు థార్ ఎస్యూవీల విడుదల తేదీలను ధృవీకరించింది. కొత్త తరం థార్ ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతుందని, తరువాత తరం ఎక్స్యూవీ 500, స్కార్పియో వంటివి వచ్చే ఆర్థిక సంవత్సరంలో విక్రయించబడే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
కొత్త మహీంద్రా థార్ కరోనా లాక్ డౌన్ ముగిసిన వెంటనే అమ్మకాలు జరపనున్నట్లు భావించవచ్చు. ఏదేమైనా COVID-19 మహమ్మారి మరియు పొడిగించిన లాక్ డౌన్ నిబంధనల మధ్య మహీంద్రా టెస్ట్ తరువాతి తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించుకుంది.
MOST READ:హ్యుందాయ్ కంపెనీ ఫస్ట్ మినీ ఎలక్ట్రిక్ బస్
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
దేశంలో కరోనా మహమ్మారిపై పోరాడటానికి కేంద్ర మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడంలో మహీంద్రా కంపెనీ చాలా కృషి చేస్తోంది. ఈ కంపెనీ పేస్ మాస్కులు, పేస్ షీల్డ్ లు వంటి వాటిని అందించడమే కాకుండా వైద్య సేవలను మరింత త్వరితగతిన జరపడానికి మహీంద్రా అంబులెన్సులు కూడా అందించింది. ఏది ఏమైనా కరోనా మహమ్మారి సమయంలో మహీంద్రా కంపెనీ తన మద్దతు తెలిపి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా నిలిచింది.