Just In
- 8 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 9 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 12 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 14 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బిఎస్ 6 మహీంద్రా ఎక్స్యువి : ధర & ఇతర వివరాలు
మహీంద్రా తన బిఎస్ 6 ఎక్స్యువి 500 ఎస్యువిని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఇండియన్ మార్కెట్లో మహీంద్రా ఈ ఎస్యువి యొక్క బుకింగ్స్ అధికారికంగా బుధవారం నుంచి ప్రారంభించింది. బిఎస్ -6 ఎక్స్యువి 500 ఎస్యూవీకి రూ. 5 వేల ధరతో బుక్ చేసుకోవచ్చు.
భారతదేశంలో కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంది. కరోనా లాక్డౌన్ గడువు ముగిసిన తర్వాత ఈ ఎస్యువిని డెలివరీ చేయడానికి కంపెనీ అనుమతిస్తుంది.
కొత్త మహీంద్రా ఎక్స్యువి 500 ఎస్యువి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి డబ్ల్యూ 5, డబ్ల్యూ 7, డబ్ల్యూ 9, డబ్ల్యూ 11 (ఓ) అనే నాలుగు వేరియంట్స్. ఇండియన్ షోరూమ్ ప్రకారం కొత్త మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యువి ధర రూ. 13.20 లక్షలు కాగా, టాప్ స్పెక్ డబ్ల్యూ 11 (ఓ) వేరియంట్ ధర రూ. 17.70 లక్షల వరకు ఉంటుంది.
MOST READ:భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ వారి కొత్త పాలసీ, ఏంటో తెలుసా ?
ఈ కొత్త మహీంద్రా ఎక్స్యువి 500 బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా తయారుచేయబడింది. కొత్త ఎక్స్యువి 500 ఎస్యువిలో 2.2 లీటర్ ఎంహెచ్ఓసి డీజిల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 155 బిహెచ్పి పవర్ మరియు 360 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో అమర్చబడి ఉంటుంది.
మహీంద్రా తరువాతి తరం ఎక్స్యువి 500 ఎస్యువిని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోంది. తరువాతి తరం ఎక్స్యూవీ 500 ఎస్యువిని ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
MOST READ:రూ. 2 లక్షల లోపు బిఎస్ 6 బైక్ కొంటున్నారా, అయితే ఈ 5 బైక్స్ చూడండి
2020 మహీంద్రా ఎక్స్యువి 500 ఎస్యువి డిజైన్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కొత్త ఎస్యూవీలో గ్రిల్ క్రోమ్, స్ప్లిట్ టెయిల్ లైట్లు, ఎల్ఈడీ డిఆర్ఎల్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్, ట్విన్ ఎగ్జాస్ట్, రియర్ స్పాయిలర్ మరియు స్టైలిష్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్ ఉన్నాయి.
అంతే కాకుండా అప్హోల్స్టరీ, ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలతో 2020 మహీంద్రా ఎక్స్యూవీ 500 ఎస్యూవీ లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఇతర ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.
కొత్త మహీంద్రా ఎక్స్యువి 500 ఎస్యువి యొక్క కొలతలను గమనించినట్లయితే దీని పొడవు 4,585 మి.మీ, 1,890 మి.మీ వెడల్పు మరియు 1,785 మి.మీ ఎత్తు మరియు 2,700 మి.మీ వీల్బేస్ కలిగి ఉంటుంది.
MOST READ:మళ్లీ, మళ్లీ యూస్ చేసుకోవడానికి మావోక్స్ రీసైకిల్ ఫేస్ షీల్డ్
భారతీయ మార్కెట్లో కొత్త మహీంద్రా ఎక్స్యూవీ 500 అత్యంత ప్రాచుర్యం పొందిన ఎస్యూవీలలో ఒకటి. ఈ ఎస్యూవీ కియా సెల్టోస్, టాటా హారియర్, ఎంజి హెక్టర్, హ్యుందాయ్ క్రెటా, జీప్ కంపాస్ మరియు ఫాక్స్ వాగన్ టి-రాక్ ఎస్యూవీలకు ప్రత్యర్థిగా ఉంటుంది.