Just In
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 3 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 3 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
Don't Miss
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఉద్యోగుల కోసం గృహ నిర్మాణాలను చేపడుతున్న మారుతి సుజుకి; వివరాలు
భారతదేశంలో ప్రముఖ కార్ల తయారీదారుగా ప్రసిద్ధి చెందిన కొన్ని కంపెనీలలో మారుతి సుజుకి కూడా ఒకటి. మారుతి సుజుకి తమ ఉద్యోగుల సంక్షేమ పథకం కింద సంస్థ తన ఉద్యోగులకు గృహాలను నిర్మించింది. సంస్థ తన ఉద్యోగులకు సరసమైన, ఆధునిక గృహాలను అందించింది.
మారుతి సుజుకి పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ ఇళ్లను డిజైన్ చేసింది. ఇది ఈ కొత్త ఇంటి యొక్క ప్రత్యేక లక్షణం. మారుతి సుజుకి ఈ గృహాలను హర్యానాలోని ధారుహెరాలోని తన ఉద్యోగులకు అప్పగించింది. ఈ అప్పగించే కార్యక్రమం (డిసెంబర్ 23) బుధవారం జరిగింది.
మారుతి సుజుకి తన ఉద్యోగుల కోసం 360 కి పైగా గృహాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో కొన్ని ఇళ్లను కంపెనీ యొక్క ఉద్యోగులకు అప్పగించారు. వీలైనంత త్వరగా మిగిలిన గృహాలను అప్పగించే ప్రక్రియ పురోగతిలో ఉంది.
MOST READ:నిజంగా ఈ బైకర్స్ అదృష్టవంతులే సుమీ.. ఎందుకో వీడియో చూడండి
మారుతి సుజుకి మొట్టమొదట 1989 లో తన ఉద్యోగుల కోసం ఒక హోసింగ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఆ సమయంలో సకర్పూర్ ప్రాంతంలో ఉద్యోగుల కోసం ఇళ్ళు నిర్మించారు. అప్పుడు 1994 లో, గురుగ్రామ్ లోని పాండ్సి ప్రాంతంలో రెండవసారి గృహాలను నిర్మించబడింది.
హర్యానాలోని ధారుహెరాలో మూడోసారి మారుతి సుజుకి ఎన్క్లేవ్ పేరుతో కొత్త ఇళ్ళు నిర్మిస్తున్నారు. ఈ కంపెనీ నిర్మించిన కొత్త గృహాలు తమ ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా నిర్మించబడ్డాయి. విశేషమేమిటంటే, ఈ ఇళ్లను మారుతి సుజుకి కంపెనీ నిర్వహిస్తుంది.
MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కోసం 32 లక్షలు వేలం పాడాడు.. కానీ చివరికి ఏమైందంటే ?
ఈ గృహాలు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం మరియు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మించబడ్డాయి. ప్రభుత్వ గృహనిర్మాణ పథకాలైన ప్రధాన్ మంత్రి ఆవాస్, దీన్ దయాల్ ఆవాస్ పథకాలు ఈ ఇళ్లకు వర్తిస్తాయి. ఇది మారుతి సుజుకి ఉద్యోగులకు సబ్సిడీ పొందటానికి వీలు కల్పిస్తుంది.
ప్రస్తుతం ఉన్న సిబ్బందికి ఇస్తున్న ఇళ్లతో మారుతి సుజుకి ఏమి చేస్తుందో తెలియదు. ఈ గృహాలు చూడటానికి చాలా లగ్జరీగా కనిపిస్తాయి. ఈ ఇళ్ళు పార్క్, ఎల్ఈడి స్ట్రీట్ లైటింగ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి అన్ని వసతులు ఇందులో కల్పించబడ్డాయి.
ఏది ఏమైనా కంపెనీ తమ ఉద్యోగుల కోసం గృహాలను నిమించడం చాలా అరుదు. కంపెనీలు ఈ విధంగా నిర్మించడం వల్ల ఉద్యోగులకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీని ప్రభుత్వాలు కూడా వీలైనంతవరకు సహకరించాలి. అప్పుడే ఇవన్నీ పూర్తిగా సాధ్యమవుతాయి.