Just In
- 25 min ago కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- 27 min ago Fujiyama EV Classic రూ. 79,999 కే క్లాసిక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 120 కి.మీ రేంజ్, బుకింగ్స్ ఓపెన్
- 15 hrs ago రైలు కదిలేముందు జర్క్ ఎందుకు ఇస్తుంది.??.. ఆసక్తికర విషయాలివే.!!
- 17 hrs ago మార్కెట్లో వీటికి తిరుగే లేదు.. కొత్త బైక్ కొనాలనుకుంటే ఈ లిస్ట్ అస్సలు మిస్ అవ్వకండి
Don't Miss
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Movies బ్రహ్మముడిని భారీ దెబ్బ కొట్టిన కార్తీక దీపం 2.. వంటలక్క, డాక్టర్ బాబు రీఎంట్రీతో అంతా ఛేంజ్!
- News బీఆర్ఎస్ అస్తిత్వంపై బలంగా కొడుతున్న తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి!!
- Finance IT News: CEO మైండ్ బ్లాంక్ చేసిన IT ఉద్యోగి.. నెట్టింట పోస్ట్ వైరల్.. ఆ ఒక్క మాటతో..
- Lifestyle మీ బాయ్ఫ్రెండ్/గర్ల్ఫ్రెండ్లో ఈ మార్పులు ఉంటే మిమ్మల్ని చీట్ చేయడానికి పన్నాగం పడుతున్నారని అర్థం జాగ్రత్త
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
కరోనా పరీక్షలో మారుతి భద్రతా సిబ్బందికి పాజిటివ్, ఆపై పరారీ!
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న భద్రతా సిబ్బందికి కోవిడ్ -19 పరీక్షలు చేయడంతో వారిలో కొందరికి పాజిటివ్ ఫలితాలు వచ్చాయి, ఆ తర్వాత ఈ సిబ్బందిలో 17 మంది కనిపించకుండా పరారైనట్లు కంపెనీ ప్రకటించింది. పరారైన వారంతా దేశంలోనే అత్యంత పాపులర్ సెక్యూరిటీ కంపెనీ ఎస్ఐఎస్ ఇండియాకి చెందిన వారు కావటం గమనార్హం. భద్రతా చర్యల్లో భాగంగా జూన్ 17న ఈ సిబ్బందికి నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్ రిజల్ట్స్ రావటంతో, వారిని క్వరెంటైన్ చేయాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో, పాజిటివ్ వచ్చిన సిబ్బంది మొత్తం పరారయ్యారు. పారియిన పోయిన సిబ్బందిపై ఇండస్ట్రియల్ సెక్టార్-7లో కంపెనీ ఓ ఎఫ్ఐర్ కూడా నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం, గుర్గావ్లోని పిహెచ్సి భాంగ్రోలా కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యుడు సదరు ఉద్యోగులను పరీక్షించిన వెంటనే వారి మేనేజర్ జూన్ 17న ఈ పాజిటివ్ పరీక్షల గురించి కంపెనీకి సమాచారం అందించారు.
కరోనా పాజిటివ్ రిజల్ట్స్ గురించి తెలియగానే, సదరు మేనేజర్ ఆ ప్రాంతంలోని సంబంధిత వైద్యాధికారులకు సమాచారం అందించారని, ఆ వెంటనే వారికి క్వరెంటైన్ చేశారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
MOST READ: మీ ఐఫోన్తో మీ BMW కారుని అన్లాక్ చేయొచ్చు; ఎలాగో తెలుసా..?
కానీ తమ వైద్య బృందం జూన్ 18న సైట్కి చేరుకున్నప్పుడు, ఈ 17 మంది కరోనా రోగులు అప్పటికే ఎటువంటి సమాచారం లేకుండా పరారైనట్లు గుర్తించాని, ఈ నేపథ్యంలో వారిపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్య తీసుకోవాలని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ అధికార ప్రతినిధి సదరు ఉద్యోగుల వైరస్ పరీక్ష ఫలితాలను ధృవీకరించారు, పాజిటివ్ ఫలితాలు వచ్చిన వ్యక్తులు మారుతి సుజుకి ఉద్యోగులు కాదని, వారు సంస్థతో నియమించబడిన అవుట్సోర్స్ / కాంట్రాక్టు విజిలెన్స్ సిబ్బందని ఆయన తెలిపారు.
MOST READ: వినియోగదారులకు గుడ్ న్యూస్ : రాపిడో స్టోర్స్ ప్రారంభించిన రాపిడో
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో, ఉద్యోగుల భద్రత మరియు వారి ఆరోగ్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన అన్ని మార్గదర్శకాలను, ఆదేశాలను పాటిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిన ఉద్యోగులు మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్కు నేరుగా పనిచేస్తున్న ఉద్యోగులు కానందున, ఈ ప్లాంట్ ఉత్పత్తి కార్యకాలాపాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయంపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా, ఈ విషయంపై కామెంట్ చేయటానికి ఎస్ఐఎస్ ఇండియా అందుబాటులో లేదు.
మారుతి సుజుకి ఇటీవలే తమ మానేసర్ ప్లాంట్లో పాక్షికంగా ఉత్పత్తి కార్యకాలాపాలు ప్రారంభించిన నేపథ్యంలో, అక్కడ ఓ ఉద్యోగికి కోవిడ్-19 పాజిటివ్ రావటంతో ప్లాంట్ను కొద్ది రోజుల పాటు మూసివేసి, ఇటీవలే తిరిగి ప్రారంభించింది. దాదాపు 55 రోజుల నిర్విరామ లాక్డౌన్ తర్వాత కంపెనీ ఇప్పుడు ఉత్పత్తిని పూర్తిగా ప్రారంభించింది.
MOST READ: బిడది ప్లాంట్లో టొయోటా సేవలు పునఃప్రారంభం
మారుతి మానేసర్ ప్లాంట్లో కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న ఆల్టో, స్విఫ్ట్, డిజైర్, ఎస్-ప్రెసో, ఎర్టిగా మరియు బాలెనో వంటి కార్లను ఉత్పత్తి చేస్తుంది. కాగా, గుర్గావ్ ప్లాంట్లో ఎస్-క్రాస్, విటారా బ్రీజ్జా, ఇగ్నిస్, మరియు సూపర్ క్యారీ ఎల్సివి వాహనాలను తయారు చేస్తోంది.
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కాకుండా, ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్ మరియు హ్యుందాయ్ మోటార్ ఇండియా కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్లో కోవిడ్-19 పాజిటివ్ కేసులు గుర్తించినట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే.
MOST READ: నదిలో పడిపోయిన కొత్తగా పెళ్లి చేసుకున్న జంట ఉన్న హోండా సిటీ, తర్వాత ఏం జరిగిందంటే ?
మారుతి సుజుకి భద్రతా సిబ్బందికి కరోనా సోకడంపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
భద్రతా ఏజెన్సీకి చెందిన 17 మంది సిబ్బందికి ఒకేసారి కోవిడ్-19 పాజిటివ్ రావటం విచారకరం. వాస్తవానికి ఫ్యాక్టరీలోని భద్రతా సంస్థలలో సాధారణంగా 20 మంది గార్డులు అందరూ కలిసి ఒకేచోట ఉంటుంటారు. ప్లాంట్లోకి వచ్చే, పోయే ఉద్యోగులను తనిఖీ చేస్తూ, ఒకే ప్రాంతంలో ఉండటం వలన వైరస్ వ్యాప్తి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తమ సిబ్బంది విషయంలో ఎస్ఐఎస్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.