Just In
- 7 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 8 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సనంద్ ప్లాంట్లో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించిన మాక్క్సిస్ ఇండియా
భారతదేశంలో కరోనా లాక్ డౌన్ ప్రస్తుతం కొన్ని సడలింపులు కల్పించబడటంతో గుజరాత్లోని సనంద్ తయారీ కేంద్రంలో పాక్షికంగా తిరిగి కార్యకలాపాలు ప్రారంభించినట్లు మాక్క్సిస్ ఇండియా ప్రకటించింది. అధికారులు మరియు ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ -19 భద్రతా మార్గదర్శకాలను అనుసరించడానికి కార్మికులకు శిక్షణ ఇవ్వడం ద్వారా సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభిస్తుంది.
2020 మార్చి 23 న కంపెనీ తన తయారీ కేంద్రంలో 42 రోజుల పాటు తన కార్యకలాపాలను మూసివేసింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా పూర్తి లాక్ డౌన్ జారీ చేసిన తరువాత తాత్కాలిక సస్పెన్షన్ ని కంపెనీ ఆదేశించింది.
కొనసాగుతున్న కోవిడ్ -19 మహమ్మారి సమయంలో గుజరాత్ రాష్ట్రం మరియు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడానికి కొన్ని సడలింపులను ప్రకటించాయి. దీని ఫలితంగా మాక్సిస్ ఇండియా ఇప్పుడు కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది.
MOST READ:హ్యార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ రాడ్ బిఎస్6 బైక్పై రూ.55,500ల భారీ డిస్కౌంట్
పరిమితం చేయబడిన కార్మికులతో సంస్థ షిప్ట్ విధానం ద్వారా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనుంది. ఉద్యోగులందరూ ప్లాంట్లో పనిచేసేటప్పుడు మాస్క్ మరియు గ్లౌజులు వంటి (పిపిఇ) వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించుకుంటారు. కర్మాగారం లోపల అన్ని సమయాల్లో ఒకదానికొకటి కనీసం ఆరు అడుగుల వరకు కచ్చితమైన సామాజిక దూరాన్ని కొనసాగించాలని కూడా వారు కోరారు.
దీనికి తోడు ఉద్యోగులందరూ ప్లాంట్లోకి ప్రవేశించే ముందు క్రిమిసంహారక సొరంగం గుండా ప్రవేశిస్తారు. ఇది కాకుండా భద్రతా ప్రోటోకాల్ యొక్క క్రమ శిక్షణ మరియు తయారీ సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కంపెనీ సూచిస్తుంది. కోవిడ్ -19 కారణంగా కంపనీ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేటప్పుడు ఉద్యోగుల భద్రతను నిర్ధారించడానికి కంపెనీ ఇటువంటి చర్యలను తీసుకుంది.
MOST READ:కియా కార్నివాల్ ఎంపివిని కొనుగోలు చేసిన మాజీ ఇండియన్ క్రికెటర్
ప్రభుత్వ నిబంధనలు మరియు మార్గదర్శకాలను పాటించడం ద్వారా అన్ని కార్యకలాపాలు జరిగేలా కంపెనీ నిర్ధారిస్తుందని మాక్సిస్ ఇండియా ప్లాంట్ హెడ్ లియు చున్ సువాన్ పేర్కొన్నారు. గుజరాత్లోని సనంద్లోని అత్యాధునిక సదుపాయంలో ఇది తన ఉద్యోగులకు భద్రత మరియు పరిశుభ్రత యొక్క అత్యున్నత ప్రమాణాలను అందిస్తుంది.
ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆదేశించిన లాక్ డౌన్ కి మద్దతుగా కంపెనీ తన లోగోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పునఃరూపకల్పన చేసింది. వారి సవరించిన లోగో బ్రాండ్ పేరుతో విలీనం చేయబడిన రోమన్ సంఖ్యల ద్వారా ప్రదర్శించబడే ప్రారంభ నుంచి 21-రోజుల లాక్డౌన్ను సూచిస్తుంది. సంస్థ "21 రోజులు జీవితాలను మార్చగలదు, స్టే ఇన్, స్టే సేఫ్" అనే సందేశాన్ని కూడా ఇచ్చింది.
MOST READ:భారీగా పెరిగిన బిఎస్ 6 బజాజ్ ప్లాటినా 100 & 110 ధరలు : దేనిపై ఎంతో తెలుసా
దీనికి సంబంధించిన ఇతర వార్తల ప్రకారం మాక్సిస్ టైర్స్ మరియు యమహా దేశంలో కో-బ్రాండెడ్ టైర్ల తయారీకి వ్యూహాత్మక భాగస్వామ్యంలోకి ప్రవేశించాయి. కో-బ్రాండెడ్ మాక్సిస్ టైర్లు దేశవ్యాప్తంగా యమహా మరియు మాక్సిస్ డీలర్షిప్లలో రిటైల్ అవుతాయి.
సనంద్ ప్లాంట్లో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడం డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
కోవిడ్ -19 మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించిన కారణంగా లాక్ డౌన్ ప్రకటించబడింది. ఈ కారణంగా భారతదేశంలో వ్యాపారాలన్నీ తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. కొనసాగుతున్న మహమ్మారి వల్ల దాని ఉద్యోగుల భద్రతను నిర్ధారించడానికి ఇది జరిగింది. ఏది ఏమైనా, ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపులను భారత ప్రభుత్వం ప్రకటించిన తరువాత వ్యాపారాలు తిరిగి ప్రారంభించాయి. దీని వల్ల ఆర్ధిక వ్యవస్థ కొంత వరకు మెరుగుపడుతుంది. అంతే కాకుండా చాలామందికి ఉపాధి కూడా లభిస్తుంది.
MOST READ:3 కోట్ల విలువైన కార్లు దొంగలించిన దొంగల ముఠా, తర్వాత ఏం జరిగించే తెలుసా ?