Just In
- 13 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 14 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 16 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 19 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
గుడ్ న్యూస్... ఇండియాలో 2020 జిఎల్ఇ డెలివరీలను ప్రారంభించిన బెంజ్
జర్మనీ కి చెందిన వాహన తయారీదారు అయిన మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో తన కొత్త బ్రాండ్ అయిన 2020 జిఎల్ఇ యొక్క డెలివరీలను ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం!
మెర్సిడెస్ బెంజ్ యొక్క 2020 జిఎల్ఇ డెలివరీలను భారతదేశంలో మొట్ట మొదట కేరళకు చెందిన మెర్సిడెస్ బెంజ్ డీలర్ రాజశ్రీ మోటార్స్ కి డెలివరీ చేసింది. బెంజ్ 2020 జిఎల్ఇ 300 డి ని కేరళలో కురియన్ అనే వ్యాపారవేత్తకు పంపిణీ చేయడం జరిగింది. బెంజ్ జిఎల్ఇ ఎల్డబ్ల్యుబి యొక్క రెండు వేరియంట్లు అందుబాటులో ఉండగా, మొదట 300 డి పంపిణీ చేయబడింది.
మెర్సిడెస్ బెంజ్ యొక్క నాలుగో తరం జిఎల్ఇ ఐదు సీట్ల ఎస్యువిని వారం క్రితం లాంచ్ చేశారు. కొత్త జిఎల్ఇ రెండు లాంగ్ వీల్ బేస్ ఫార్మాట్లలో లభిస్తాయి. అవి 300 డి, మరియు 400 డి. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ. 73.70 లక్షలు, రూ. 1.25 కోట్లు (ఎక్స్-షోరూమ్).
సరికొత్త 2020 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ 300 డి మోడల్ 2.0 లీటర్ నాలుగు సిలిండర్ డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఇది 242 బిహెచ్పి శక్తి మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 9- స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి జతచేయబడుతుంది.
కొత్తగా వచ్చిన ఎస్యువి మునుపటి తరం మోడళ్ల కంటే సొగసైనది. ఇది ట్విన్-ఐబ్రో ఎల్ఇడి డిఆర్ఎల్లు మరియు వెనుకవైపు ఎల్ఇడి టెయిల్ లైట్లను కలిగి ఉంటుంది. ఇంటీరియర్స్ చాలా అప్డేట్లను కలిగి ఉంది.
మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఇ 300 డి ఎల్డబ్ల్యుబి డ్యూయల్ 12.3-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లను కలిగి ఉంటుంది. ఇందులో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కంపాటిబుల్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు ఎయిర్మాటిక్ ఎయిర్ సస్పెన్షన్ వంటివి కూడా ఇందులో ఉంటాయి.
ఈ వాహనంలో ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్లు, సీట్ మెమరీ ఫంక్షన్, పనోరమిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్ మరియు 4 జోన్ థర్మోట్రోనిక్ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. మెర్సిడెస్ వారి MBUX సిస్టం 2020 జిఎల్ఇ 300 డి ఎల్డబ్ల్యుబి లో వ్యవస్థాపించింది. ఇది మీడియా, నావిగేషన్, సీట్ మసాజ్ ఫంక్షన్ మరియు వాయిస్ కంట్రోల్ వంటి వాటిని కలిగి ఉంటుంది.
బెంజ్ జిఎల్ఇ 300 డి లో భద్రతా లక్షణాలను గమనించినట్లైతే ఇందులో ఎబిఎస్ విత్ ఇబిడి, పార్క్ అసిస్ట్ సిస్టమ్, ఏడు ఎయిర్బ్యాగులు, 360 డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మెర్సిడెస్ బెంజ్ కి సంబంధించిన వార్తల ప్రకారం ఇటీవల జరిగిన 2020 ఆటో ఎక్స్పోలో తమ బ్రాండ్ యొక్క వి క్లాస్ మార్కోపోలో ను కూడా ఆవిష్కరించింది. మార్కోపోయో వాణిజ్యపరంగా డెవలప్ చేసిన మొట్ట మొదటి క్యాంపర్.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
మెర్సిడెస్ బెంజ్ తన కొత్త బ్రాండ్ అయిన 2020 జిఎల్ఇ 300 డి ని డెలివరీ చేయడం హర్సిన్చాదగ్గ విషయం. ఈ కొత్త కారుకి మొదటి ఓనర్ అయినందుకు రామ్ కురియన్ కి అభినందనలు. బెంజ్ సంస్థ ప్రతిసారి కచ్చితమైన సమయానికి డెలివరీలను అందిస్తుందని భావిస్తున్నాము.