Just In
- 1 hr ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 2 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 3 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 4 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా బాధితులకు హాస్పిటల్ నిర్మించనున్న బెంజ్, ఎక్కడో తెలుసా..!
భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ చాలా ఎక్కువగా ఉంది. కరోనావైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉన్న హాస్పిటల్స్ సరిపోవడం లేదు. కరోనా బాధితుల చికిత్సకు మరిన్ని హాస్పిటల్స్ అవసరం. ఈ నేపథ్యంలో పూణే సమీపంలో 1,500 పడకల తాత్కాలిక కరోనా ఆసుపత్రిని నిర్మిస్తామని మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..!
జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో లగ్జరీ కార్ల తయారీలో మరియు అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది. మెర్సిడెస్ బెంజ్ కార్ల తయారీ కర్మాగారం మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహన్ ప్రాంతంలో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పటికే చాల కంపెనీలు వైద్య పరికరాలను తయారుచేసే పనిలో ఉన్నాయి.
ఈ మేరకు మెర్సిడెస్ బెంజ్ కూడా ఒక పెద్ద ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, సహన్ ప్రాంతంలోని మలాంచ్ ఇంకాలే గ్రామంలో కరోనావైరస్ సోకిన వ్యక్తుల కోసం తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు.
బెంజ్ కంపెనీ ఈ ప్రాంతంలోని స్థానిక ప్రభుత్వ అధికారుల సహకారంతో కొత్త కరోనా ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఆసుపత్రిలో 1,500 పడకల సౌకర్యం ఉంటుంది. మహారాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన భవనంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు.
ఈ భవనంలో 374 గదులు ఉన్నాయి. కరోనా వైరస్ సోకిన వారికి విడిగా చికిత్స చేయాల్సి ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి కరోనావైరస్ బాధితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.
కరోనా హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన పరికరాలను రవాణా చేయడానికి అయ్యే ఖర్చును మెర్సిడెస్ బెంజ్ భరిస్తుంది. గ్రాండ్ మెడికల్ ఫౌండేషన్ ఆఫ్ పూణే కింద పనిచేస్తున్న రూబీ హాల్ క్లినిక్ కోసం వెంటిలేటర్లను అందిస్తామని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది.
కరోనావైరస్ పూర్తిగా ఆగిపోయిన తరువాత, తాత్కాలిక ఆసుపత్రిలోని అన్ని వైద్య పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపబడతాయి. విద్యార్థుల హాస్టల్కు మంచాలు, ఇతర ఫర్నిచర్ అందించనున్నట్లు కూడా సమాచారం తెలిపింది.
ఇప్పటికే కరోనాతో పోరాడుతున్న ప్రభుత్వానికి తమవంతు మద్దతుగా మారుతి సుజుకి, మహీంద్రాతో సహా పలు కంపెనీలు కరోనా రోగులకు వెంటిలేటర్ల ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ తాత్కాలిక ఆసుపత్రిని నిర్మించడానికి అన్ని సన్నాహాలను చేస్తోంది.