Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కరోనా బాధితులకు హాస్పిటల్ నిర్మించనున్న బెంజ్, ఎక్కడో తెలుసా..!
భారతదేశంలో కరోనా వైరస్ సంక్రమణ చాలా ఎక్కువగా ఉంది. కరోనావైరస్ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉన్న హాస్పిటల్స్ సరిపోవడం లేదు. కరోనా బాధితుల చికిత్సకు మరిన్ని హాస్పిటల్స్ అవసరం. ఈ నేపథ్యంలో పూణే సమీపంలో 1,500 పడకల తాత్కాలిక కరోనా ఆసుపత్రిని నిర్మిస్తామని మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం..!
జర్మనీకి చెందిన మెర్సిడెస్ బెంజ్ భారతదేశంలో లగ్జరీ కార్ల తయారీలో మరియు అమ్మకాలలో అగ్రస్థానంలో ఉంది. మెర్సిడెస్ బెంజ్ కార్ల తయారీ కర్మాగారం మహారాష్ట్రలోని పూణే సమీపంలోని సహన్ ప్రాంతంలో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పటికే చాల కంపెనీలు వైద్య పరికరాలను తయారుచేసే పనిలో ఉన్నాయి.
ఈ మేరకు మెర్సిడెస్ బెంజ్ కూడా ఒక పెద్ద ప్రకటన చేసింది. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం, సహన్ ప్రాంతంలోని మలాంచ్ ఇంకాలే గ్రామంలో కరోనావైరస్ సోకిన వ్యక్తుల కోసం తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నారు.
బెంజ్ కంపెనీ ఈ ప్రాంతంలోని స్థానిక ప్రభుత్వ అధికారుల సహకారంతో కొత్త కరోనా ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఆసుపత్రిలో 1,500 పడకల సౌకర్యం ఉంటుంది. మహారాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డెవలప్మెంట్ కాంప్లెక్స్లో కొత్తగా నిర్మించిన భవనంలో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు.
ఈ భవనంలో 374 గదులు ఉన్నాయి. కరోనా వైరస్ సోకిన వారికి విడిగా చికిత్స చేయాల్సి ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి కరోనావైరస్ బాధితులకు చికిత్స చేయడానికి ఉపయోగపడుతుంది.
కరోనా హాస్పిటల్ నిర్మాణానికి అవసరమైన పరికరాలను రవాణా చేయడానికి అయ్యే ఖర్చును మెర్సిడెస్ బెంజ్ భరిస్తుంది. గ్రాండ్ మెడికల్ ఫౌండేషన్ ఆఫ్ పూణే కింద పనిచేస్తున్న రూబీ హాల్ క్లినిక్ కోసం వెంటిలేటర్లను అందిస్తామని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది.
కరోనావైరస్ పూర్తిగా ఆగిపోయిన తరువాత, తాత్కాలిక ఆసుపత్రిలోని అన్ని వైద్య పరికరాలు ప్రభుత్వ ఆసుపత్రికి పంపబడతాయి. విద్యార్థుల హాస్టల్కు మంచాలు, ఇతర ఫర్నిచర్ అందించనున్నట్లు కూడా సమాచారం తెలిపింది.
ఇప్పటికే కరోనాతో పోరాడుతున్న ప్రభుత్వానికి తమవంతు మద్దతుగా మారుతి సుజుకి, మహీంద్రాతో సహా పలు కంపెనీలు కరోనా రోగులకు వెంటిలేటర్ల ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు మెర్సిడెస్ బెంజ్ తాత్కాలిక ఆసుపత్రిని నిర్మించడానికి అన్ని సన్నాహాలను చేస్తోంది.