ఎంజి హెక్టర్ యానివెర్సరీ ఎడిషన్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

ఎంజి మోటార్స్ ఇండియా తన యానివెర్సరీ ఎడిషన్ హెక్టర్ ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఎంజి హెక్టర్ వార్షికోత్సవ ఎడిషన్ ఎస్‌యూవీని పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది. వీటి ధరలు వరుసగా రూ. 13.63 లక్షలు, రూ .14.99 లక్షలు [ఎక్స్-షోరూమ్, ఢిల్లీ].

కొత్త ఎంజి హెక్టర్ ఆనివెర్సరీ ఎడిషన్ ఎస్‌యూవీ 'సూపర్' ట్రిమ్ ఆధారంగా రూపొందించబడింది. ఇది మోడల్ లైనప్‌లోని ప్రామాణిక వేరియంట్ నుండి అన్ని లక్షణాలను మరియు పరికరాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో కొన్ని కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి.

యానివెర్సరీ ఎడిషన్ లో లభించే కొన్ని కొత్త ఫీచర్లలో 10.3-అంగుళాల హెచ్‌డి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్ప్లే, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ మరియు ఎస్‌యూవీ లోపలి భాగంలో మెడ్‌క్లిన్ కిట్ ఉన్నాయి.

MOST READ:భారత రాష్ట్రపతి ఎస్కార్ట్‌లో చేరనున్న కొత్త కార్ : బిఎస్ 6 మహీంద్రా అల్టురాస్ జి 4

కొత్త ఎంజి హెక్టర్ ఆనివెర్సరీ ఎడిషన్ ఎస్‌యూవీ ఇంజిన్ ఎంపికలను గమనించినట్లయితే, ఇందులో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 140 బిహెచ్‌పి మరియు 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇందులో 2.0-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది, ఇది 173 బిహెచ్‌పి మరియు 350 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి.

పైన పేర్కొన్న నాలుగు ఫీచర్లు కాకుండా, ఎంజి హెక్టర్ ఆనివెర్సరీ ఎడిషన్ స్టాండర్డ్ 'సూపర్' వేరియంట్‌తో సమానంగా ఉంటుంది. ఈ కారు ఇతర బాహ్య సౌందర్య మార్పులను కూడా కలిగి ఉన్నట్లు అనిపించదు, ఇది స్టాండర్డ్ వేరియంట్ నుండి వేరు చేయడానికి సహాయపడుతుంది.

MOST READ:అంబులెన్స్ ముందుకు వెళ్ళడానికి దారి ఇవ్వని కార్ డ్రైవర్‌కి ఏం జరిగిందో చూసారా ?

ఆనివెర్సరీ ఎడిషన్ లో నాలుగు కొత్త ఫీచర్లు వినియోగదారులకు ఉచితంగా ఇవ్వబడతాయి, ఎందుకంటే హెక్టర్ యొక్క స్టాండర్డ్ 'సూపర్' వేరియంట్‌కు అదే ధర ఉంటుంది. ఎంజీ హెక్టర్‌లోని 'సూపర్' ట్రిమ్ తక్కువ మిడ్-స్పెక్ వేరియంట్. ఎస్‌యూవీని స్టైల్, స్మార్ట్, షార్ప్ అనే మరో మూడు వేరియంట్లలో కూడా అందిస్తున్నారు.

ఎంజి హెక్టర్ భారత మార్కెట్లో బాగా రాణిస్తోంది. ఈ సంస్థ ప్రస్తుతం భారత మార్కెట్లో మూడు మోడళ్లను కలిగి ఉంది. వీటిలో హెక్టర్, జెడ్ఎస్ ఇవి మరియు హెక్టర్ ప్లస్ ఉన్నాయి. సంస్థ ఇప్పుడు తన నాలుగవ మోడల్‌ను గ్లోస్టర్ ఎస్‌యూవీ రూపంలో ప్రవేశపెట్టే పనిలో ఉంది.

MOST READ:నీటిపై నడిచే బైక్.. వీడియో చూసారా ?

కొత్త ఎంజి గ్లోస్టర్ భారతదేశంలో తొలిసారిగా 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. ఒకసారి భారతదేశంలో ప్రారంభించిన ఎంజి గ్లోస్టర్ బ్రాండ్ యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా ఉంటుంది మరియు టయోటా ఫార్చ్యూనర్, ఫోర్డ్ ఎండీవర్ మరియు మహీంద్రా అల్టూరాస్ జి 4 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఎంజి హెక్టర్ ఆనివెర్సరీ ఎడిషన్ మోడల్ భారత మార్కెట్లో మంచి అమ్మకాలను కొనసాగిస్తోంది. భారతీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఉత్పత్తి హెక్టర్. ఇది అత్యంత ప్రజాదరణ పొందింది ఒకటి. భారతదేశంలోని ఎంజి హెక్టర్ కియా సెల్టోస్, జీప్ కంపాస్, టాటా హారియర్, మహీంద్రా ఎక్స్‌యువి 500 మరియు హ్యుందాయ్ క్రెటా వంటి వాటికి ప్రత్యర్థిగా నిలుస్తుంది.

MOST READ:మూలికా పెట్రోల్ తయారీకి కేరళ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నెల్

Most Read Articles

English summary
MG Hector Anniversary Edition SUV Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X